Political News

కేసీఆర్ నిర్ణయానికి షాకిస్తూ హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలింది. కొద్దికాలంగా పలు మీడియా సమావేశాల్లో ఆయన వినిపిస్తున్న వాదనను కొట్టిపారేసేలా తాజాగా ఇచ్చిన హైకోర్టు తీర్పు ఉండటం గమనార్హం. మాయదారి రోగాన్ని గుర్తించేందుకు వీలుగా నిర్వహించే టెస్టులను ప్రైవేటు సంస్థలు కూడా చేయొచ్చంటూ ఐసీఎంఆర్ అనుమతిని ఇచ్చింది. తెలంగాణలోని 12 సంస్థలకు ఈ పరీక్షలు చేసే వెసులుబాటు కల్పించింది. అయితే.. ఐసీఎంఆర్ ఇచ్చిన ఆదేశాలకు నో చెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రైవేటు ల్యాబ్ లలో నిర్దారణ పరీక్షలు చేయటానికి.. ప్రైవేటు ఆసుతప్రులు చికిత్స చేయటానికి అనుమతికి నో చెప్పింది. ఈ నేపథ్యంలో..కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా మాయదారి రోగానికి అవసరమయ్యే నిర్దారణ పరీక్షలు.. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రుల్ని భరించే శక్తి ఉన్న వారికి.. ఆ వెసులుబాటు కల్పించాల్సిందిగా ఆసుపత్రులు తమ వాదనను వినిపించాయి.

దీనికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేశారు. నిర్దారణ.. చికిత్సకు అయ్యే ఖర్చుకు సంబంధించి ఐసీఎంఆర్ ఆదేశించిన విధంగానే ఫీజులు వసూలు చేయాలే తప్పించి.. ఎక్కువ తీసుకోకూడదని ఆదేశించింది. అంతేకాదు.. నిర్దారణ పరీక్షలు.. చికిత్స చేయటానికి ప్రైవేటు ల్యాబులు.. ఆసుపత్రుల యజమాన్యాలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. మొత్తంగా ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలిందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on May 22, 2020 2:05 am

Share
Show comments
Published by
suman

Recent Posts

కవితకు మరో షాక్ ఇవ్వనున్న బీఆర్ఎస్?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్‌కు ఊహించ‌ని సంక‌టం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. క‌విత.. పాత `టీఆర్ ఎస్‌`…

6 hours ago

నాగబాబు వల్ల కానిది నీహారిక చేస్తోంది

తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…

7 hours ago

ఈ గోటీల గోలేంటి రాజశేఖర

సీనియర్ నటుడు రాజశేఖర్‌కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…

7 hours ago

ఈసారి అమరావతి లక్ష్యం… గురి తప్పకూడదు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే బిల్లుకు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో ఇక రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే…

8 hours ago

మావిగన్ క్రెడిట్… జగన్ పై తోసేసిన సజ్జల

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…

8 hours ago

గందరగోళం ఎప్పుడు తీరుతుంది పెద్ది

ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…

8 hours ago