Political News

ఏపీ ఉద్యోగుల వేదన తీరింది

ఓవైపు సంక్షేమ పథకాలకు వేల కోట్ల నిధులు విడుదల చేస్తూ.. తమకు మాత్రం కోతలు విధించడం ఏంటంటూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్ని రోజులుగా. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి తలకిందులు కావడంతో గత రెండు నెలలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం జీతాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. మే నెలలో కూడా ఇదే పద్ధతి కొనసాగితే తామంతా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటామంటూ ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఐతే వారి ఆందోళలను తీర్చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 1న మే నెల జీతాలు ఇవ్వబోతుండగా.. ఉద్యోగులకు పూర్తి మొత్తం చెల్లించాలంటూ ఫైనాన్స్, ట్రెజరీలకు ఆదేశాలు అందాయి.

గత రెండు నెలలు సగం జీతమే పడేలా ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. దాన్ని మార్చి పూర్తి జీతం ఉద్యోగులకు చేరేలా చూస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదల కానుంది. గత రెండు నెలల్లో కోత విధించిన 50 శాతం జీతాన్ని కూడా బకాయిల రూపంలో త్వరలో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, వ్యాపారాలు కూడా పాక్షికంగా తెరవడంతో ఈ నెల ప్రభుత్వానికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆదాయం అందింది. దీంతో జీతాలకు ఇబ్బంది అయితే లేదు. ప్రభుత్వ పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తూ జీతాల్ని ఇలా కోత పెడుతూ పోతే ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన మార్చుకుంది. ఉద్యోగులకు గత రెండు నెలల్లో 50 శాతం జీతం కోసిన ప్రభుత్వం పింఛనుదారులకు కూడా 40 శాతం కట్ చేసింది. ప్రజా ప్రతినిధులకు గత రెండు నెలలు పూర్తిగా జీతాల్లో కోత విధించారు.

suman

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

6 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

6 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

7 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

7 hours ago