తొలిసారిగా అంతరిక్షంలోకి ఓ తెలుగు మహిళ అడుగుపెడుతోంది. అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఓ మహిళకు అంతరిక్షంలోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహన నౌకను ప్రయోగించనుంది.
నలుగురు ప్రయాణికులు వెళ్తున్న ఈ వాహన నౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉండటం విశేషం. వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యాక్షురాలి హోదాలో ఉన్న ఆమె అంతరిక్ష యానం చేయనున్నారు.
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గాను వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేయనుంది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు ఈ కంపెనీకి జూన్ 25న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లైసెన్స్ జారీ చేసింది. దీంతో ఈ నెల 11న న్యూ మెక్సికో నుంచి ఈ స్పేస్ ఫ్లైట్ బయలుదేరనుంది. వర్జిన్ గెలాక్టిక్ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది. అయితే… ప్రయాణికులను తీసుకువెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
This post was last modified on July 2, 2021 1:58 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…