జల జగడం పై రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య కొత్త పంచాయితీని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో అవసరం లేని ఆవేశాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రదర్శించినప్పటికీ.. ఏపీ అధికారపక్షం మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిందే తప్పించి.. అధికారపక్షానికి చెందిన ఏ నాయకుడు కూడా నోరు పారేసుకున్నది లేదు.
తమ ఆరాధ్య దైవమైన దివంగత మహానేత వైఎస్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రులు పలువురు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి మాటలతో సెంటిమెంట్ ను రాజేయాలన్న వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నాన్ని ఏపీ నేతలు సంయమనంతో చెక్ చెప్పారు. అయినప్పటికీ అదే పనిగా టీఆర్ఎస్ నతల్లో కొందరు నోరు పారేసుకుంటున్నారు. ఇలాంటి వారికి తనదైన శైలిలో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి అనిల్ కుమార్.
తమ సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దని స్పష్టం చేశారు మంత్రి అనిల్. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని.. దీనికి బదులు తీర్చుకుంటామని స్పష్టం చేయటం సంచలనంగా మారింది. శ్రీశైలం డెడ్ స్టోరేజీ నిల్వను విద్యుదుత్పత్తి కోసం వాడేయటం దుర్మార్గమన్న ఆయన.. పొరుగు రాష్ట్రం తీరును మంత్రి మండలి తీవ్రంగా పరిగణించినట్లుగా మంత్రి అనిల్ స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాష వాడుతున్నారని.. పదేళ్ల క్రితం మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. తాజాగా వ్యాఖ్యలతో.. నోటికి వచ్చినట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడితే సరిగా ఉండదన్న విషయాన్ని అర్థమయ్యేలా మంత్రి అనిల్ చెప్పారని చెప్పాలి. మరి.. వారి రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇష్యూ ఏదైనా.. నోరు పారేసుకోవటం మంచిది కాదన్న అభిప్రాయాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
This post was last modified on July 1, 2021 11:53 am
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…