Political News

చేతగానితనం అనుకోవద్దు.. టీ మంత్రులకు షాకిచ్చిన ఏపీ మంత్రి

జల జగడం పై రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య కొత్త పంచాయితీని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో అవసరం లేని ఆవేశాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రదర్శించినప్పటికీ.. ఏపీ అధికారపక్షం మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిందే తప్పించి.. అధికారపక్షానికి చెందిన ఏ నాయకుడు కూడా నోరు పారేసుకున్నది లేదు.

తమ ఆరాధ్య దైవమైన దివంగత మహానేత వైఎస్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రులు పలువురు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి మాటలతో సెంటిమెంట్ ను రాజేయాలన్న వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నాన్ని ఏపీ నేతలు సంయమనంతో చెక్ చెప్పారు. అయినప్పటికీ అదే పనిగా టీఆర్ఎస్ నతల్లో కొందరు నోరు పారేసుకుంటున్నారు. ఇలాంటి వారికి తనదైన శైలిలో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి అనిల్ కుమార్.

తమ సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దని స్పష్టం చేశారు మంత్రి అనిల్. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని.. దీనికి బదులు తీర్చుకుంటామని స్పష్టం చేయటం సంచలనంగా మారింది. శ్రీశైలం డెడ్ స్టోరేజీ నిల్వను విద్యుదుత్పత్తి కోసం వాడేయటం దుర్మార్గమన్న ఆయన.. పొరుగు రాష్ట్రం తీరును మంత్రి మండలి తీవ్రంగా పరిగణించినట్లుగా మంత్రి అనిల్ స్పష్టం చేశారు.

తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాష వాడుతున్నారని.. పదేళ్ల క్రితం మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. తాజాగా వ్యాఖ్యలతో.. నోటికి వచ్చినట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడితే సరిగా ఉండదన్న విషయాన్ని అర్థమయ్యేలా మంత్రి అనిల్ చెప్పారని చెప్పాలి. మరి.. వారి రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇష్యూ ఏదైనా.. నోరు పారేసుకోవటం మంచిది కాదన్న అభిప్రాయాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

This post was last modified on July 1, 2021 11:53 am

Share
Show comments

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

9 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

21 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago