Political News

చేతగానితనం అనుకోవద్దు.. టీ మంత్రులకు షాకిచ్చిన ఏపీ మంత్రి

జల జగడం పై రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య కొత్త పంచాయితీని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో అవసరం లేని ఆవేశాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రదర్శించినప్పటికీ.. ఏపీ అధికారపక్షం మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిందే తప్పించి.. అధికారపక్షానికి చెందిన ఏ నాయకుడు కూడా నోరు పారేసుకున్నది లేదు.

తమ ఆరాధ్య దైవమైన దివంగత మహానేత వైఎస్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రులు పలువురు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి మాటలతో సెంటిమెంట్ ను రాజేయాలన్న వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నాన్ని ఏపీ నేతలు సంయమనంతో చెక్ చెప్పారు. అయినప్పటికీ అదే పనిగా టీఆర్ఎస్ నతల్లో కొందరు నోరు పారేసుకుంటున్నారు. ఇలాంటి వారికి తనదైన శైలిలో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి అనిల్ కుమార్.

తమ సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దని స్పష్టం చేశారు మంత్రి అనిల్. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని.. దీనికి బదులు తీర్చుకుంటామని స్పష్టం చేయటం సంచలనంగా మారింది. శ్రీశైలం డెడ్ స్టోరేజీ నిల్వను విద్యుదుత్పత్తి కోసం వాడేయటం దుర్మార్గమన్న ఆయన.. పొరుగు రాష్ట్రం తీరును మంత్రి మండలి తీవ్రంగా పరిగణించినట్లుగా మంత్రి అనిల్ స్పష్టం చేశారు.

తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాష వాడుతున్నారని.. పదేళ్ల క్రితం మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. తాజాగా వ్యాఖ్యలతో.. నోటికి వచ్చినట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడితే సరిగా ఉండదన్న విషయాన్ని అర్థమయ్యేలా మంత్రి అనిల్ చెప్పారని చెప్పాలి. మరి.. వారి రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇష్యూ ఏదైనా.. నోరు పారేసుకోవటం మంచిది కాదన్న అభిప్రాయాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

This post was last modified on July 1, 2021 11:53 am

Share
Show comments

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

1 hour ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

2 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

2 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

5 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago