Political News

వైఎస్‌-జ‌గ‌న్‌ల‌ను తిడుతున్నా వైసీపీ నేత‌ల మౌనం వెన‌క ?

ఏపీ రాజ‌కీయాల్లో ఇదో చిత్ర‌మైన ప‌రిస్థితి. సీఎం జ‌గ‌న్‌కు, ఆయ‌న తండ్రికి అత్యంత ప్రియ‌మైన నేత‌లు.. నిత్యం వారి స్మ‌ర‌ణ‌తోనే నిద్ర లేచే నేత‌లు ఇప్పుడు ఒక విష‌యంలో చాలా మౌనంగా ఉన్నారు. నిజానికి జ‌గ‌న్‌ను కానీ, వైఎస్‌ను కానీ.. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసినా.. ప‌రుష ప‌దాల‌తో దూషించినా.. ఫైర్ బ్రాండ్ నేత‌లు వెంట‌నే రియాక్ట్ అవుతారు. లైన్‌లోకి వ‌చ్చేసి మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేస్తారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రికీ తెలిసిన విష‌యం. కానీ, ఇప్పుడు విష‌యం మార‌క‌పోయినా.. నాయ‌కులు మారారు. ఇటు వైసీపీ నాయ‌కులు.. అటు విమ‌ర్శ‌లు చేసే నాయ‌కులు కూడా మారిపోయారు. దీంతో రాజ‌కీయం చిత్రంగా అనిపిస్తోంది.

ఏపీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి వైసీపీపై దాడి ఇటీవ‌ల కాలంలో పెరిగిపోయింది. నీళ్ల విష‌యంలో తెలంగాణ అధికార పార్టీ మంత్రులు, నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు మ‌రీ ముఖ్యంగా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు స‌న్నిహితుడుగా ఉన్నాడ‌నే ప్ర‌చారంలో ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా తీవ్ర వ్యాఖ్య‌లే చేస్తున్నారు. జ‌గ‌న్ మూర్ఖుడు అని ఆయ‌న చేసిన వ్యాఖ్యప్ర‌ధాన మీడియాతో పాటు సోష‌ల్‌మీడియాను కూడా కుదిపేసింది. ఇక‌, నీళ్ల విష‌యంలో మ‌రో మంత్రి స్పందిస్తూ.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని నీళ్ల దొంగ‌ అనేశారు.

ఇక‌, ఇంకో మంత్రి కూడా ఏపీలో ఉమ్మ‌డి పాల‌న‌తో వైఎస్ తెలంగాణ గొంతు నొక్కార‌ని వ్యాఖ్యానించారు. ఇవ‌న్నీ.. ఎప్పుడో ఏడాది కింద‌టో కాదు.. ఇప్పుడు.. తాజాగా రెండు మూడు రోజుల కింద‌ట చేసిన వ్యాఖ్య‌లే. అయితే.. వీటిపై ఏపీ వైసీపీ నేత‌ల నుంచి ఎలాంటి రియాక్ష‌న్ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. సీఎంను ఆరాధించేవారు కానీ, వైఎస్‌ను దేవుడిగా కొలిచే నేత‌లు కానీ.. ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు తూతు మంత్రంగా మాట్లాడ‌డం త‌ప్పా చంద్ర‌బాబు, టీడీపీకి ఇచ్చే రేంజ్‌లో అయితే కౌంట‌ర్లు లేవు.

ఏపీలో అయితే.. చంద్ర‌బాబుకానీ, టీడీపీ నేత‌లు కానీ.. ఇవే వ్యాఖ్య‌లు చేస్తే.. దుమారం రేపే నేత‌లు.. తెలంగాణ విష‌యంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? అనేది మిలియ‌న్‌డాల‌ర్ల ప్ర‌శ్న‌.అయితే.. జ‌గ‌న్ వ్యాపారాలు మేజ‌ర్‌గా హైద‌రాబాద్‌లో ఉండ‌డం కూడా దీనికి కార‌ణంగా చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ఆ మాట‌కు వ‌స్తే ఏపీలో అంద‌రు వైసీపీ నేత‌ల‌కు హైద‌రాబాద్‌లో వ్యాపారాలు ఉన్నాయ‌న్న భ‌యాలు వాళ్ల‌కు ఉన్నాయి. ఏదేమైనా.. ప్ర‌స్తుతం వైసీపీ నేత‌ల మౌనం అనేక సందేహాల‌కు దారితీస్తోంది.

Satya

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

10 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

36 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

37 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago