Political News

వైఎస్‌-జ‌గ‌న్‌ల‌ను తిడుతున్నా వైసీపీ నేత‌ల మౌనం వెన‌క ?

ఏపీ రాజ‌కీయాల్లో ఇదో చిత్ర‌మైన ప‌రిస్థితి. సీఎం జ‌గ‌న్‌కు, ఆయ‌న తండ్రికి అత్యంత ప్రియ‌మైన నేత‌లు.. నిత్యం వారి స్మ‌ర‌ణ‌తోనే నిద్ర లేచే నేత‌లు ఇప్పుడు ఒక విష‌యంలో చాలా మౌనంగా ఉన్నారు. నిజానికి జ‌గ‌న్‌ను కానీ, వైఎస్‌ను కానీ.. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసినా.. ప‌రుష ప‌దాల‌తో దూషించినా.. ఫైర్ బ్రాండ్ నేత‌లు వెంట‌నే రియాక్ట్ అవుతారు. లైన్‌లోకి వ‌చ్చేసి మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేస్తారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రికీ తెలిసిన విష‌యం. కానీ, ఇప్పుడు విష‌యం మార‌క‌పోయినా.. నాయ‌కులు మారారు. ఇటు వైసీపీ నాయ‌కులు.. అటు విమ‌ర్శ‌లు చేసే నాయ‌కులు కూడా మారిపోయారు. దీంతో రాజ‌కీయం చిత్రంగా అనిపిస్తోంది.

ఏపీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి వైసీపీపై దాడి ఇటీవ‌ల కాలంలో పెరిగిపోయింది. నీళ్ల విష‌యంలో తెలంగాణ అధికార పార్టీ మంత్రులు, నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు మ‌రీ ముఖ్యంగా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు స‌న్నిహితుడుగా ఉన్నాడ‌నే ప్ర‌చారంలో ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా తీవ్ర వ్యాఖ్య‌లే చేస్తున్నారు. జ‌గ‌న్ మూర్ఖుడు అని ఆయ‌న చేసిన వ్యాఖ్యప్ర‌ధాన మీడియాతో పాటు సోష‌ల్‌మీడియాను కూడా కుదిపేసింది. ఇక‌, నీళ్ల విష‌యంలో మ‌రో మంత్రి స్పందిస్తూ.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని నీళ్ల దొంగ‌ అనేశారు.

ఇక‌, ఇంకో మంత్రి కూడా ఏపీలో ఉమ్మ‌డి పాల‌న‌తో వైఎస్ తెలంగాణ గొంతు నొక్కార‌ని వ్యాఖ్యానించారు. ఇవ‌న్నీ.. ఎప్పుడో ఏడాది కింద‌టో కాదు.. ఇప్పుడు.. తాజాగా రెండు మూడు రోజుల కింద‌ట చేసిన వ్యాఖ్య‌లే. అయితే.. వీటిపై ఏపీ వైసీపీ నేత‌ల నుంచి ఎలాంటి రియాక్ష‌న్ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. సీఎంను ఆరాధించేవారు కానీ, వైఎస్‌ను దేవుడిగా కొలిచే నేత‌లు కానీ.. ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు తూతు మంత్రంగా మాట్లాడ‌డం త‌ప్పా చంద్ర‌బాబు, టీడీపీకి ఇచ్చే రేంజ్‌లో అయితే కౌంట‌ర్లు లేవు.

ఏపీలో అయితే.. చంద్ర‌బాబుకానీ, టీడీపీ నేత‌లు కానీ.. ఇవే వ్యాఖ్య‌లు చేస్తే.. దుమారం రేపే నేత‌లు.. తెలంగాణ విష‌యంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? అనేది మిలియ‌న్‌డాల‌ర్ల ప్ర‌శ్న‌.అయితే.. జ‌గ‌న్ వ్యాపారాలు మేజ‌ర్‌గా హైద‌రాబాద్‌లో ఉండ‌డం కూడా దీనికి కార‌ణంగా చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ఆ మాట‌కు వ‌స్తే ఏపీలో అంద‌రు వైసీపీ నేత‌ల‌కు హైద‌రాబాద్‌లో వ్యాపారాలు ఉన్నాయ‌న్న భ‌యాలు వాళ్ల‌కు ఉన్నాయి. ఏదేమైనా.. ప్ర‌స్తుతం వైసీపీ నేత‌ల మౌనం అనేక సందేహాల‌కు దారితీస్తోంది.

This post was last modified on June 28, 2021 6:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

3 minutes ago

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

3 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

3 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

4 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

4 hours ago

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

6 hours ago