కరోనా మహమ్మారి అంతమొందించేందుకు మన ముందు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా మహమ్మారిని తరమికొట్టవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో.. అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
అయితే.. ప్రస్తుతం మన దేశంలో కోవీషీల్డ్, కో వ్యాగ్జిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు అందజేస్తున్నారు. కాగా.. వ్యాక్సిన్లలో ఒకటైన కోవీషీల్డ్ పై యూరప్ కంట్రీలు ఆంక్షలు విధిస్తున్నాయి. కోవీషీల్డ్ తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించమని తేల్చి చెబుతున్నాయి.
కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు యూరోప్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యురోపియన్ దేశాల సమాఖ్య నుండి ఇంకా కోవిషీల్డ్ కు అనుమతి రాలేదు. దీంతో కోవిషీల్డ్ తీసుకొని ఈయూ కంట్రీస్ కు వెళ్లేవారికి ఆ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
కాగా.. ఈ విషయంపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరం సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా రియాక్ట్ అయ్యారు. వీరి గురించి ఆయా దేశాల అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. అత్యున్నత స్థాయిలో ఈ విషయాన్ని తీసుకువెళ్లానని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. ఈయూ ఔషధ నియంత్రణాధికారులతో పాటు, దౌత్యపరమైన రీతిలోనూ ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు సీరం సీఈవో తెలిపారు. ఆస్ట్రాజెనికా కంపెనీ యూరప్లో వాక్స్జెవ్రియా పేరుతో కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. ఆ టీకాతో పాటు ఫైజర్, మోడెర్నా, జే అండ్ జే టీకాలకు మాత్రమే ఈయూలో గుర్తింపు ఉంది.
This post was last modified on June 28, 2021 6:06 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను కస్టడీలో హింసించారని.. దీంతో తనకు…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…