కరోనా మహమ్మారి అంతమొందించేందుకు మన ముందు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా మహమ్మారిని తరమికొట్టవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో.. అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
అయితే.. ప్రస్తుతం మన దేశంలో కోవీషీల్డ్, కో వ్యాగ్జిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు అందజేస్తున్నారు. కాగా.. వ్యాక్సిన్లలో ఒకటైన కోవీషీల్డ్ పై యూరప్ కంట్రీలు ఆంక్షలు విధిస్తున్నాయి. కోవీషీల్డ్ తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించమని తేల్చి చెబుతున్నాయి.
కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు యూరోప్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యురోపియన్ దేశాల సమాఖ్య నుండి ఇంకా కోవిషీల్డ్ కు అనుమతి రాలేదు. దీంతో కోవిషీల్డ్ తీసుకొని ఈయూ కంట్రీస్ కు వెళ్లేవారికి ఆ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
కాగా.. ఈ విషయంపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరం సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా రియాక్ట్ అయ్యారు. వీరి గురించి ఆయా దేశాల అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. అత్యున్నత స్థాయిలో ఈ విషయాన్ని తీసుకువెళ్లానని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. ఈయూ ఔషధ నియంత్రణాధికారులతో పాటు, దౌత్యపరమైన రీతిలోనూ ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు సీరం సీఈవో తెలిపారు. ఆస్ట్రాజెనికా కంపెనీ యూరప్లో వాక్స్జెవ్రియా పేరుతో కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. ఆ టీకాతో పాటు ఫైజర్, మోడెర్నా, జే అండ్ జే టీకాలకు మాత్రమే ఈయూలో గుర్తింపు ఉంది.
This post was last modified on June 28, 2021 6:06 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…