కరోనా మహమ్మారి అంతమొందించేందుకు మన ముందు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా మహమ్మారిని తరమికొట్టవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో.. అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
అయితే.. ప్రస్తుతం మన దేశంలో కోవీషీల్డ్, కో వ్యాగ్జిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు అందజేస్తున్నారు. కాగా.. వ్యాక్సిన్లలో ఒకటైన కోవీషీల్డ్ పై యూరప్ కంట్రీలు ఆంక్షలు విధిస్తున్నాయి. కోవీషీల్డ్ తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించమని తేల్చి చెబుతున్నాయి.
కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు యూరోప్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యురోపియన్ దేశాల సమాఖ్య నుండి ఇంకా కోవిషీల్డ్ కు అనుమతి రాలేదు. దీంతో కోవిషీల్డ్ తీసుకొని ఈయూ కంట్రీస్ కు వెళ్లేవారికి ఆ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
కాగా.. ఈ విషయంపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరం సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా రియాక్ట్ అయ్యారు. వీరి గురించి ఆయా దేశాల అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. అత్యున్నత స్థాయిలో ఈ విషయాన్ని తీసుకువెళ్లానని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. ఈయూ ఔషధ నియంత్రణాధికారులతో పాటు, దౌత్యపరమైన రీతిలోనూ ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు సీరం సీఈవో తెలిపారు. ఆస్ట్రాజెనికా కంపెనీ యూరప్లో వాక్స్జెవ్రియా పేరుతో కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. ఆ టీకాతో పాటు ఫైజర్, మోడెర్నా, జే అండ్ జే టీకాలకు మాత్రమే ఈయూలో గుర్తింపు ఉంది.
This post was last modified on June 28, 2021 6:06 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…