Political News

జగన్‌పై ఆర్కే సంచలన పలుకు

ప్రతి శనివారం రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో.. మరుసటి రోజు ఉదయం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే ‘కొత్త పలుకు’ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సమకాలీన రాజకీయాలపై విశ్లేషణతో ఈ వ్యాసం రాస్తుంటారు. అందులో అంశాలు సంచలనాత్మకంగా ఉండేలా చూసుకుంటారాయన. బడా రాజకీయ నాయకులకు సంబంధించి లోగుట్టులన్నీ తనకు బాగా తెలిసినట్లుగా ఆయన ఇందులో వ్యాఖ్యానాలు చేస్తుంటారు.

ముఖ్యంగా తనకు బద్ధ శత్రుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి వారం ఏదో ఒక సంచలన విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఆర్కే. అందులో కొన్ని వాస్తవికంగా అనిపిస్తాయి.. కొన్ని అతిశయోక్తుల్లా కనిపిస్తాయి. ఈ వారం కొంచెం అతిగా అనిపించడమే కాక.. అందరూ నోరెళ్లబెట్టేలా ఆయన కొన్ని విషయాలను ప్రస్తావించారు.

వైఎస్ జగన్ క్రిస్టియన్ అని, ఏసు ప్రభువును కొలుస్తారని అందరికీ తెలుసు. ఐతే జగన్ ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటలకు జీసస్‌తో మాట్లాడతానని అందరితో చెప్పుకుంటారంటూ జగన్ ఈ వారం ‘కొత్త పలుకు’లో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్కే.

గత ఏడాది కరోనా వచ్చిన కొత్తలో అధికారులు వైరస్ ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేస్తే.. జగన్ తేలిగ్గా కొట్టిపారేశారని.. తాను అర్ధరాత్రి జీసస్‌తో మాట్లాడానని.. వైరస్ లాంటిదేమీ ఉండదంటూ తేలిగ్గా కొట్టిపారేశారని.. దీంతో అధికారులకు ఏం మాట్లాడాలో పాలుపోలేదని ఆర్కే పేర్కొన్నారు. అలాగే గతంలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి పదవీ విరమణ తర్వాత వైకాపాలో చేరుదామని జగన్‌ను కలిశారని.. ఐతే తాను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో రోజూ రాత్రి పూట మాట్లాడతానని జగన్ తన దగ్గర అనడంతో సదరు అధికారి అయోమయానికి గురై ఆ పార్టీలో చేరకుండా ఆగిపోయారని ఆర్కే అన్నారు. జగన్ మానసిక జబ్బుతో బాధపడుతున్నాడన్న తరహాలో ఆర్కే ఈ వారం ‘కొత్తపలుకు’ రాశారు. ఐతే దీనిపై జగన్ మద్దతుదారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండగా.. ఆయన ప్రత్యర్థులు సంబంధిత కామెంట్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

This post was last modified on June 27, 2021 3:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

43 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

2 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

5 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago