Political News

వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌ పై ప్ర‌భుత్వం ఏ రేంజ్‌లో ప్ర‌చారం క‌ల్పిస్తోందో అంద‌రికీ తెలిసిందే. ఆయా ప‌థ‌కాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎవ‌రూ ప్ర‌వేశ పెట్ట‌లేద‌ని.. తాము మాత్ర‌మే చేస్తున్నామ‌ని.. ఇంత‌లా ప్ర‌జా సంక్షేమాన్ని ఎవ‌రూ ఊహించ లేద‌ని కూడా ప్ర‌చారాన్ని ఊద‌ర‌గొడుతోంది. కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తోంది. అయితే.. ఈ ప‌థ‌కాల‌పై ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీ నేత‌లే ఫైర‌వుతున్నారు. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప‌థ‌కం.. ‘జ‌గ‌న‌న్న కాల‌నీలు-పేద‌లంద‌రికీ ఇళ్లు’.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల‌ను క‌ట్టించి ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. అయితే.. ఆదిలోనే కొంద‌రు వైసీపీ నేత‌లు వీటిపై పెద‌వి విరిచారు. సెంటు స్థ‌లంలో ఇల్లేంటి? అని సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. అప్ప‌ట్లో దీనిపై మౌనంగా ఉన్న ప్ర‌భుత్వానికి ఇప్పుడు.. నేరుగా షాక్ త‌గిలింది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి.. బాహాటంగానే ఈ ఇళ్ల‌పై హాట్ కామెంట్లు కుమ్మ‌రించారు. `”పంచలో శోభనం చేసుకుని బెడ్ రూంలో పడుకునేలా ఈ ఇళ్లు ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.

నెల్లూరు కలెక్టరేట్‌లో తాజాగా జగనన్న ఇళ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు రంగనాథరాజు, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, అనిల్‌కుమార్ యాద‌వ్ స‌హా.. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న ఇళ్లు చిన్న కుటుంబాలకి కూడా సరిపోవన్నారు. అర్బన్‌లో అయితే మరీ ఘోరంగా 6 అంకణాలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాటిల్లో అయితే పంచలో శోభనం చేసుకుని బెడ్ రూంలో పడుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇళ్ల విస్తీర్ణం పెంచాలని, ఇళ్లు ప్రభుత్వమే నిర్మించాలని ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత‌లు ఏ చిన్న విమ‌ర్శ చేసినా.. కేసులు పెడుతున్న జ‌గ‌న్ స‌ర్కారు.. ఇప్పుడు సొంత ఎమ్మెల్యేపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.

Satya

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

49 minutes ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

1 hour ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

1 hour ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

2 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

2 hours ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

2 hours ago