Political News

మళ్ళీ లాక్ డౌన్ పెట్టేస్తున్నారు

కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఓ ఆటాడుకుంటోంది. తగ్గినట్లే తగ్గడం మళ్ళీ విజృంభిస్తుండటంతో చాలా దేశాలకు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. కరోనా మహమ్మరి సమస్య ఎప్పటికి పోతోందో కూడా ప్రపంచానికి తెలియంలేదు. ఇపుడు విషయం ఏమిటంటే తమ దేశాల్లో కరోనా వైరస్ తగ్గిపోయింది కాబట్టి మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కొన్ని దేశాలు ప్రకటించిన విషయం గుర్తుందికదా. ఇపుడా దేశాల్లో మాస్కులు పెట్టుకోమని కాదు ఏకంగా లాక్ డౌనే విధించేశాయి.

తమ దేశాల్లో కరోనా కేసులు మాయమైపోయాయని కాబట్టి జనాలు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మొదటి ప్రకటించిన దేశం ఇజ్రాయెల్. ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించేయటంతో జనాలందరో పోలోమంటూ రోడ్లపైకి వచ్చేశారు. సినిమా హాళ్ళు, హోటళ్ళు, రెస్టారెంట్లు, పబ్బు ఒకటేమిటి ఎక్కడ చూసినా జనాలే. దాంతో మాయమైపోయిందనుకున్న మహమ్మారి మళ్ళీ విజృంభించింది. దంతో మాస్కులు పెట్టుకోమని కాదు ఏకంగా లాక్ డౌనే విధించేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఎందుకంటే వందల్లో కేసులు నమోదవుతున్నాయి మరి.

ఒక్క ఇజ్రాయెల్ దేశమే కాదు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, ఫిజీ ఐల్యాండ్స్, ఆఫ్రికాలోని దాదాపు 14 దేశాలు, రష్యా రాజధాని మాస్కో, కాంగో, ఉగాండా దేశాల్లోని ప్రభుత్వాలు మళ్ళీ లాక్ డౌన్ విధించేశాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ కు మందనేది లేదు. రాకుండానే కాదు వచ్చిన తర్వాత నయం చేసుకునేందుకు కూడా మందులేదు. కరోనా సోకకుండా ఉండేందుకు ఏకైక మార్గం ఏమిటంటే భౌతికదూరం పాటించటమే.

వీలైనంతలో ఇళ్ళల్లో నుండి బయటకు రాకుండా ఉండటమే ఏకైక రక్షణ మార్గం. మనంతట మనం ఆహ్వానిస్తే కానీ కరోనా వైరస్ ఎవరి ఒంట్లోకి రావటంలేదన్నది వాస్తవం. జనాలకు డిసిప్లిన్ లేకపోవటమే అతిపెద్ద సమస్యగా మారిపోయింది. దీన్నే కరోనా అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. దీంతో చాలా దేశాల్లో సమస్య మళ్ళీ పెరిగిపోతుండటంతో యుద్ధ ప్రాతిపాదికన చాలా దేశాలు మళ్ళీ లాక్ డౌన్ పెట్టేస్తున్నాయి.

This post was last modified on June 26, 2021 11:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

40 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago