టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్ వ్యవహారంపై మరోసారి ఆవేదన, ఆక్రందన వ్యక్తం చేశారు. జగన్ వ్యవహరిస్తు న్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఇలా ఎప్పుడూ చేయలేదని అన్నారు. తాజాగా పార్టీ శ్రేణులు, మీడియాతో వర్చువల్గా ప్రసంగించిన చంద్రబాబు.. జగన్ వైఖరిపై నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సహా… ఏపీని పాలించిన ముఖ్యమంత్రులెవరూ సీఎం జగన్ తరహాలో రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించలేదన్నారు. రెండేళ్లలోనే ఇలా ఉంటే… రాబోయే మూడేళ్లు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో విధ్వంసానికి పునాదులు పడి రెండేళ్లు పూర్తయ్యాయన్న చంద్రబాబు.. మరో మూడేళ్ల పాలనను తలుచుకుంటేనే బాధ కలుగుతోందని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసాలకు పునాది వేసి నేటికి రెండేళ్లయిందని మండిపడ్డారు. కూల్చివేతలే తప్ప ఏ ఒక్కటీ కట్టకుండా తన పాలనా స్వభావాన్ని ప్రజలకు తెలియజెప్పాడన్నారు. ఈ రెండేళ్ళలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తిరోగమన బాట పట్టాయని విమర్శించారు. రెండేళ్ళలోనే ఇలా ఉంటే.. రాబోయే మూడేళ్ళలో రాష్ట్రం ఎలా ఉంటుందో అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షేమం పేరుతో ప్రజాధనాన్ని అయిన వారికి దోచిపెడుతున్నారని.. దుయ్యబట్టారు. పారదర్శకత లేని పాలనతో జగన్ వ్యవహ రిస్తున్నారని.. కేసులు… మొట్టికాయలు అన్నచందగా పాలన తీరు ఉందని దుయ్యబట్టారు. పరీక్షల విషయంలోనూ సరైన విధానంతో వ్యవహరించేలేక.. సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టే వరకు తెచ్చుకున్నారని.. అన్నారు. విద్యార్థల ప్రాణాలతో చెలగాటం ఆడాలని జగన్ ప్రయత్నించారని.. సుప్రీం కోర్టు కనుక స్పందించకపోయి ఉంటే.. పరిస్థితి తీవ్రంగా ఉండేదని.. రాష్ట్రం శవాల దిబ్బగా మారి ఉండేదని చెప్పారు. జగన్ పాలనను చూసి పొరుగు రాష్ట్రాలు ఛీ కొడుతున్నాయని.. చెప్పారు. ఇప్పటికైనా.. జగన్ దిగి రావాలని.. ప్రతిపక్షాలను వేధించడం, కేసులు నమోదు చేయడంపైనే దృష్టిపెట్టారని విమర్శించారు.
This post was last modified on June 25, 2021 7:31 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…