టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్ వ్యవహారంపై మరోసారి ఆవేదన, ఆక్రందన వ్యక్తం చేశారు. జగన్ వ్యవహరిస్తు న్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఇలా ఎప్పుడూ చేయలేదని అన్నారు. తాజాగా పార్టీ శ్రేణులు, మీడియాతో వర్చువల్గా ప్రసంగించిన చంద్రబాబు.. జగన్ వైఖరిపై నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సహా… ఏపీని పాలించిన ముఖ్యమంత్రులెవరూ సీఎం జగన్ తరహాలో రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించలేదన్నారు. రెండేళ్లలోనే ఇలా ఉంటే… రాబోయే మూడేళ్లు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో విధ్వంసానికి పునాదులు పడి రెండేళ్లు పూర్తయ్యాయన్న చంద్రబాబు.. మరో మూడేళ్ల పాలనను తలుచుకుంటేనే బాధ కలుగుతోందని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసాలకు పునాది వేసి నేటికి రెండేళ్లయిందని మండిపడ్డారు. కూల్చివేతలే తప్ప ఏ ఒక్కటీ కట్టకుండా తన పాలనా స్వభావాన్ని ప్రజలకు తెలియజెప్పాడన్నారు. ఈ రెండేళ్ళలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తిరోగమన బాట పట్టాయని విమర్శించారు. రెండేళ్ళలోనే ఇలా ఉంటే.. రాబోయే మూడేళ్ళలో రాష్ట్రం ఎలా ఉంటుందో అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షేమం పేరుతో ప్రజాధనాన్ని అయిన వారికి దోచిపెడుతున్నారని.. దుయ్యబట్టారు. పారదర్శకత లేని పాలనతో జగన్ వ్యవహ రిస్తున్నారని.. కేసులు… మొట్టికాయలు అన్నచందగా పాలన తీరు ఉందని దుయ్యబట్టారు. పరీక్షల విషయంలోనూ సరైన విధానంతో వ్యవహరించేలేక.. సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టే వరకు తెచ్చుకున్నారని.. అన్నారు. విద్యార్థల ప్రాణాలతో చెలగాటం ఆడాలని జగన్ ప్రయత్నించారని.. సుప్రీం కోర్టు కనుక స్పందించకపోయి ఉంటే.. పరిస్థితి తీవ్రంగా ఉండేదని.. రాష్ట్రం శవాల దిబ్బగా మారి ఉండేదని చెప్పారు. జగన్ పాలనను చూసి పొరుగు రాష్ట్రాలు ఛీ కొడుతున్నాయని.. చెప్పారు. ఇప్పటికైనా.. జగన్ దిగి రావాలని.. ప్రతిపక్షాలను వేధించడం, కేసులు నమోదు చేయడంపైనే దృష్టిపెట్టారని విమర్శించారు.
This post was last modified on June 25, 2021 7:31 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…