డ్రాగన్ కంట్రీ చైనా.. మరో పైశాచానికి తెరదీసిందా? కరోనా పుట్టుకకు.. కేంద్రమైన చైనా.. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వూహాన్ నగరంలో తొలి కేసు నమోదు కావడం మొదలు.. ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి.. ఉద్యోగాలు పోయి.. కుటుంబాలకు కుటుంబాలే ఆప్తులను పోగొట్టుకుని రోడ్డున పడ్డ విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విపరీతానికి చైనానే కారణమని.. చైనా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అమెరికా సహా కొన్ని అగ్రరాజ్యాలు డిమాండ్లు చేస్తున్నాయి.
చైనా ల్యాబ్లోనే కరోనా పుట్టిందనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలో డ్రాగన్ కంట్రీ.. మరో పైశాచిక కృత్యానికి తెరదీసింది. కరోనా ఆనవాళ్లు కనిపించకుండా వ్యవహరిస్తోంది. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అందుకు బలాన్నిచ్చే సమాచారాన్ని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనా జన్యుక్రమానికి సంబంధించిన తొలినాళ్ల నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్ నుంచి చైనా తొలగిస్తున్నట్లు సమాచారం.
కొవిడ్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి దర్యాప్తునకు సిద్ధమవుతోన్న వేళ చైనా యత్నాలను అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి బయటపెట్టారు. కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో చైనా విడుదల చేసిన వైరస్ టెస్ట్ సీక్వెన్సులను అంతర్జాతీయ డేటాబేస్ల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాలో ప్రముఖ వైరాలజిస్ట్ జెస్సీ బ్లూమ్ తెలిపారు. ముఖ్యంగా కరోనా మూలాలు కనిపించకుండా చేసేందుకే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కు సంబంధించిన ‘సీక్వెన్స్ రీడ్ ఆర్కైవ్’ నుంచి వాటిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
వైరస్ వెలుగుచూసిన సమయంలో వుహాన్లో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాల సమాచారమే తొలగించిన వాటిలో ఎక్కువగా ఉందన్నారు. కొవిడ్ మూలాలు, విస్తృతిని అర్థం చేసుకోవడంలో అత్యంత కీలకమైన ఇటువంటి డజనుకుపైగా నివేదికలను చైనా తొలగించినట్లు తెలిపారు. వైరస్ పరిణామ క్రమంపై గందరగోళం సృష్టించడానికే చైనా ఈ పన్నాగాలు పన్నినట్లు భావిస్తున్నామన్నారు. వుహాన్లోని స్థానిక మార్కెట్లో కరోనా వైరస్ వెలుగుచూడక ముందే నగరంలో పలుచోట్ల వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో చైనా ఇప్పుడు డేటాబేస్ నుంచి సమాచారాన్ని తొలగించడం ద్వారా ప్రపంచం చెవిలో పూలు పెడుతోందని అంటున్నారు.
This post was last modified on June 25, 2021 7:11 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…