ఏపీ సీఎం జగన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పరీక్షలు రద్దు చేయమని కోరకుండానే.. బాధ్యత వహించాలని.. ఏ ఒక్క విద్యార్థికి కరోనా సోకినా.. రూ. కోటి పరిహారం చెల్లించాలని హెచ్చరించింది. దీంతో జగన్ సర్కారు పరీక్షల విషయంలో వెనక్కి తగ్గింది. ఇది జరిగి 24 గంటలు కూడా కాకముందే.. ఇప్పుడు జగన్ సర్కారు కు భారీ షాక్ తగిలింది. అది కూడా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నుంచి కావడం గమనార్హం.
సీఎం జగన్ సర్కారు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఏడాదిన్నర పైగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యేనల్లో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఈ నిర్మాణాన్ని సాగించవద్దని.. ట్రైబ్యునల్ కొన్నాళ్ల కిందటే ఏపీ సర్కారుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ.. జగన్ మాత్రం మా పరిధిలో మేం కట్టుకుంటుంటే తప్పేంటి? అన్న విధంగా వ్యవహరిస్తూ.. నిర్మాణాన్ని కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో తాజాగా దీనిపై విచారణ జరిగిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. జగన్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపడితే.. జైలుకు పంపుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్జీటీ హెచ్చరించింది. పర్యావరణ అనుమతుల్లేకుండా పనులు చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోదంటూ.. ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.
తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ధిక్కరణ వేసిన పిటిషన్ను విచారించిన హరిత ట్రైబ్యునల్ చెన్నై ధర్మాసనం.. ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతోపాటు చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది. మరి ఇప్పటికైనా జగన్ వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి. కాగా, ఇదే విషయంపై కొన్ని రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతి తీసుకోకుండా.. చేస్తున్న నిర్మాణం ఎప్పటికైనా ప్రమాదమేనని హెచ్చరించడం గమనార్హం.
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…