Political News

ఆపుతారా? జైలుకు పంపేయ‌మంటారా?.. జ‌గ‌న్‌కు మ‌రో షాక్‌.!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై సుప్రీం కోర్టు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌మ‌ని కోర‌కుండానే.. బాధ్య‌త వ‌హించాల‌ని.. ఏ ఒక్క‌ విద్యార్థికి క‌రోనా సోకినా.. రూ. కోటి ప‌రిహారం చెల్లించాల‌ని హెచ్చ‌రించింది. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు ప‌రీక్ష‌ల విష‌యంలో వెన‌క్కి త‌గ్గింది. ఇది జ‌రిగి 24 గంట‌లు కూడా కాక‌ముందే.. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు కు భారీ షాక్ త‌గిలింది. అది కూడా నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్ నుంచి కావ‌డం గ‌మ‌నార్హం.

సీఎం జ‌గ‌న్ స‌ర్కారు.. అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న రాయ‌ల‌సీమ ఎత్తిపోతల ప‌థ‌కంపై తెలంగాణ స‌ర్కారు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. దీనిపై ఏడాదిన్న‌ర పైగా నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యేన‌ల్‌లో విచార‌ణ సాగుతోంది. ఈ క్ర‌మంలో ఈ నిర్మాణాన్ని సాగించ‌వ‌ద్ద‌ని.. ట్రైబ్యున‌ల్ కొన్నాళ్ల కింద‌టే ఏపీ స‌ర్కారుకు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మాత్రం మా ప‌రిధిలో మేం క‌ట్టుకుంటుంటే త‌ప్పేంటి? అన్న విధంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. నిర్మాణాన్ని కొన‌సాగిస్తోంది.

ఈ క్ర‌మంలో తాజాగా దీనిపై విచార‌ణ జ‌రిగిన నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్‌.. జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపడితే.. జైలుకు పంపుతామని రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్జీటీ హెచ్చరించింది. పర్యావరణ అనుమతుల్లేకుండా పనులు చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోదంటూ.. ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది.

తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ధిక్కరణ వేసిన పిటిషన్‌ను విచారించిన హరిత ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనం.. ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతోపాటు చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది. మ‌రి ఇప్ప‌టికైనా జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గుతారో లేదో చూడాలి. కాగా, ఇదే విష‌యంపై కొన్ని రోజుల కింద‌ట టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా గ్రీన్ ట్రైబ్యున‌ల్ అనుమ‌తి తీసుకోకుండా.. చేస్తున్న నిర్మాణం ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మేన‌ని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 25, 2021 3:38 pm

Share

Recent Posts

పావలా శ్యామల ఇక లేరు

క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరొందిన పావలా శ్యామల కన్ను మూశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న శ్యామల గారికి…

1 hour ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

9 hours ago

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

11 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

11 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

13 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

13 hours ago