Political News

సుప్రీం సీరియ‌స్‌.. దిగొచ్చిన జ‌గ‌న్‌.. ప‌రీక్ష‌లు ర‌ద్దు

  • ప‌రీక్ష‌లు నిర్వ‌హించే తీరుతాం.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం – ప్ర‌భుత్వం
  • థ‌ర్డ్ వేవ్ క‌రోనాతో ఏ ఒక్క విద్యార్థి చ‌నిపోయినా.. కోటి రూపాయ‌ల ప‌రిహారం ఇవ్వాలి. ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాలి- సుప్రీం కోర్టు

క‌ట్ చేస్తే..
జ‌గ‌న్ స‌ర్కారు వెన‌క్కి త‌గ్గింది. సుప్రీం హెచ్చ‌రిక‌లు, ఆదేశాలతో విద్యార్థుల‌కు ఉప‌శ‌మ‌నం వ‌చ్చింది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో జ‌గ‌న్‌ ప్రభుత్వం దిగొచ్చింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హైపవర్ కమిటీ నివేదిక తర్వాత మార్కులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇతర బోర్డు పరీక్షలు రద్దుతో ఏపీ విద్యార్థులకు నష్టం జరగదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షల నిర్వహణ అసాధ్యమని తెలిపారు. జులై 31లోగా ఫలితాలు ప్రకటించడం సాధ్యంకాదని మంత్రి సురేశ్ తేల్చి చెప్పారు. మ‌రోవైపు కొన్నాళ్లుగా.. కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ విష‌యంలో టీడీపీ జాతీయ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ విద్యార్థుల త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించారు.

ఇది కూడా రాష్ట్ర స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌డానికి కార‌ణ‌మైంది. మరోవైపు ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. అయినా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధపడింది. దీంతో పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 15 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ట్ట‌యింది.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

2 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

3 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

3 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

3 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

4 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

6 hours ago