మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తాజా ప్రకటన చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. వాసిరెడ్డి తాజా ప్రకటన చూస్తే తన పరిధిని మించి మాట్లాడుతున్నట్లు స్పష్టం గా అర్థమవుతోంది. ఆమె మహిళా కమిషన్ విధులను ఇంకో రకంగా అర్థం చేసుకున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. మహిళా కమీషన్ అన్నది మహిళల హక్కులకు భంగం కలిగినపుడో లేకపోతే మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగినపుడో న్యాయం కోసం పనిచేయాల్సిన సంస్ధ. అలాంటి సంస్ధకు ఛైర్ పర్సన్ ఉన్న వ్యక్తి తన పరిధి దాటి వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇంతకీ వాసిరెడ్డి చెప్పేదేమిటంటే మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా తొలగించిన సంచయిత గజపతిరాజు తరపున రాష్ట్రప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేయాలట. అలాగే కోర్టు తీర్పు కారణంగా పదవిని కోల్పోయిన సంచయితకు మహిళా కమీషన్ అండగా నిలుస్తుందట. నిజానికి ఈ రెండు విషయాలకు మహిళా కమీషన్ కు ఎలాంటి సంబంధము లేదనే అనుకోవాలి.
ఎందుకంటే సంచయిత విషయంలో ఏమి చేయాలనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. ఇందులో వాసిరెడ్డి సలహా అవసరమే లేదు. ఒకవేళ హైకోర్టు తీర్పుపై ఏదైనా అభ్యంతరాలుంటే సంచయిత వ్యక్తిగత హోదాలో సుప్రింకోర్టులో కేసు వేసుకోవచ్చు. ఇదే సమయంలో హైకోర్టు తీర్పుపై సుప్రింకోర్టులో కేసువేసే విషయాన్ని ప్రభుత్వమే నిర్ణయించుకుంటుంది.
ఇక సంచయితకు మహిళా కమీషన్ బాసటగా నిలుస్తుందని వాసిరెడ్డి ప్రకటనలో కూడా అర్ధంలేదు. ఎందుకంటే సంచయితపై ఎవరు దాడి చేయలేదు. మానసికంగా, శారీరకంగా సంచయితపై ఎక్కడా దాడి జరగలేదు. కోర్టు తీర్పు ప్రకారమే ఆమె పదవిని కోల్పోయింది. దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆమె కోర్టులోనే తేల్చుకుంటుంది. ఇంతోటిదానికి మహిళా కమీషన్ బాసట ఎందుకు ? సంచయిత విషయం కన్నా మహిళా కమీషన్ దృష్టి పెట్టాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని వాసిరెడ్డి గ్రహిస్తే బాగుంటుంది.
This post was last modified on June 24, 2021 4:17 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…