తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి ఛైర్మన్, సభ్యుల నియామకం విషయంలో జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. టీటీడీ ట్రస్టుబోర్డు ఛైర్మన్ లేదా సభ్యుడిగా ఉండటం చాలామందికి తీరని కలనే చెప్పాలి. ఒకపుడు బోర్డు ఛైర్మన్ కానీ సభ్యులుగా నియమితులయ్యే వారిని జనాలు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ గడచిన పాతికేళ్ళల్లో టీటీడీ ట్రస్టుబోర్డుకు రాజకీయ గ్లామర్ తోడవ్వటంతోనే ఈ పోస్టులకు బాగా క్రేజు పెరిగిపోయింది. ఎప్పుడైతే క్రేజ్ పెరిగిపోయిందో అప్పుడే డిమాండూ పెరిగిపోయింది.
జగన్ అధికారంలోకి రాగానే ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ సీటు కేటాయించలేని కారణంగా వైవిని టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవిలో నియమించారు. రెండేళ్ళ కాలపరిమితి ఈనెల 21వ తేదీతో ముగిసిపోయింది. నిజానికి 21వ తేదీలోగానే వైసికి ఎక్స్ టెన్షన్ వస్తుందని అనుకున్నారు. అయితే చాలామంది ఆశించినట్లు పొడిగింపు రాలేదు.
రెండోసారి ఛైర్మన్ గా వైవికి పొడిగింపు రాకపోగా బుధవారం బోర్డు స్ధానంలో స్పెసిఫైడ్ అథారిటిని నియమించింది ప్రభుత్వం. దాంతో వైవీకి రెండోసారి అవకాశంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో పార్టీలో సీనియర్ నేత, మాజీఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఛైర్మన్ పదవి కోసం గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలోనే కొడుకు మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రిపదవి, టీడీపీలో నుండి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎంపి టికెట్ విషయంలో మేకపాటి పక్కకు తప్పుకున్నారు.
2019 లో ఎన్నికల్లో పోటీనుండి తప్పుకునే సమయంలోనే మేకపాటికి జగన్ టీటీడీ ఛైర్మన్ పదవిని హామీఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఒకే విధమైన హామీని జగన్ ఇద్దరు నేతలకూ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. అయితే మొదటగా వైవికి ఛైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టే ఇపుడు మేకపాటికి ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఛైర్మన్ గా కొత్తవారిని ఎంపిక చేయబోతున్నారు కాబట్టే మొత్తం సభ్యులను కూడా మార్చేయబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఒకవైపు ఛైర్మన్ పదవికోసం మరోవైపు సభ్యుల కోసం జగన్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. నిజానికి ఎవరి ఒత్తిళ్ళకు లొంగేరకం కాదు జగన్. అయినా ఎవరి స్ధాయిలో వాళ్ళు జగన్ పై ఒత్తిడి తేవటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మరి మొదటిబోర్డులో ఉన్నట్లే సభ్యుల సంఖ్య 30కి పైగా ఉంటుందా లేక పరిమితంగా ఉంటుందా అనేది చూడాలి.
This post was last modified on June 24, 2021 3:18 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…