మన వైద్య నిపుణులు, డాక్టర్లు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఒక డాక్టరంటారు. కాదు కాదు చాలా తీవ్రంగా రాబోతోందని మరో వైద్య నిపుణుడుంటారు. థర్డ్ వేవ్ తీవ్రత విషయంలో డాక్టర్లు, వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞుల్లోనే ఇన్ని వాదాలుంటే జనాలు ఎవరిని నమ్మాలి ? అసలు వైద్యరంగంలోని ప్రముఖుల మధ్యే ఇంత గందరగోళం ఎందుకుంటోందో అర్ధం కావటంలేదు.
సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కొందరు నిపుణులు ఎప్పటినుండో చెబుతున్నారు. అయితే మరికొందరు నిపుణులు దీనికి విరుద్ధంగా ప్రకటనలిస్తున్నారు. సెకెండ్ వేవ్ తో పోల్చుకుంటే థర్డ్ వేవ్ మరీ అంత ప్రమాధకరం కాదని మరికొందరు ప్రకటిస్తున్నారు. ఏదేమైనా సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉంటుందో లేకపోతే కాస్త తక్కువగా ఉంటుందో ఎవరు చెప్పలేకున్నది వాస్తవం.
అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక శాస్త్రజ్ఞుడో నిపుణుడో థర్డ్ వేవ్ తీవ్రత ప్రమాధకరంగా ఉంటుందని జనాలు ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని హెచ్చరించిన వెంటనే ఇంకొకరు దానికి విరుద్ధంగా ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారో అర్ధం కావటంలేదు. డాక్టర్లు, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల్లో థర్డ్ వేవ్ పై కనిపిస్తున్న గందరగోళం మొత్తం సమాజాన్నే గందరగోళంలోకి నెట్టేస్తోందన్నది వాస్తవం.
అయితే జనాలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తీవ్రత విషయాన్ని పక్కనపెట్టేస్తే భౌతికదూరం, మాస్కుల వాడకం, శానిటైజర్ల వినియోగంలో గనుక అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ కరోనా వైరస్ విజృంభణ తప్పదు. డాక్టర్లు ఏమి చెబుతారన్నది వేరే విషయం. జనాలు మాత్రం ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాల్సిందే అని మొదటి రెండు దశల్లో చాలా స్పష్టంగా బయటపడింది.
This post was last modified on June 24, 2021 10:58 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…