మన వైద్య నిపుణులు, డాక్టర్లు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఒక డాక్టరంటారు. కాదు కాదు చాలా తీవ్రంగా రాబోతోందని మరో వైద్య నిపుణుడుంటారు. థర్డ్ వేవ్ తీవ్రత విషయంలో డాక్టర్లు, వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞుల్లోనే ఇన్ని వాదాలుంటే జనాలు ఎవరిని నమ్మాలి ? అసలు వైద్యరంగంలోని ప్రముఖుల మధ్యే ఇంత గందరగోళం ఎందుకుంటోందో అర్ధం కావటంలేదు.
సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కొందరు నిపుణులు ఎప్పటినుండో చెబుతున్నారు. అయితే మరికొందరు నిపుణులు దీనికి విరుద్ధంగా ప్రకటనలిస్తున్నారు. సెకెండ్ వేవ్ తో పోల్చుకుంటే థర్డ్ వేవ్ మరీ అంత ప్రమాధకరం కాదని మరికొందరు ప్రకటిస్తున్నారు. ఏదేమైనా సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉంటుందో లేకపోతే కాస్త తక్కువగా ఉంటుందో ఎవరు చెప్పలేకున్నది వాస్తవం.
అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక శాస్త్రజ్ఞుడో నిపుణుడో థర్డ్ వేవ్ తీవ్రత ప్రమాధకరంగా ఉంటుందని జనాలు ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని హెచ్చరించిన వెంటనే ఇంకొకరు దానికి విరుద్ధంగా ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారో అర్ధం కావటంలేదు. డాక్టర్లు, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల్లో థర్డ్ వేవ్ పై కనిపిస్తున్న గందరగోళం మొత్తం సమాజాన్నే గందరగోళంలోకి నెట్టేస్తోందన్నది వాస్తవం.
అయితే జనాలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తీవ్రత విషయాన్ని పక్కనపెట్టేస్తే భౌతికదూరం, మాస్కుల వాడకం, శానిటైజర్ల వినియోగంలో గనుక అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ కరోనా వైరస్ విజృంభణ తప్పదు. డాక్టర్లు ఏమి చెబుతారన్నది వేరే విషయం. జనాలు మాత్రం ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాల్సిందే అని మొదటి రెండు దశల్లో చాలా స్పష్టంగా బయటపడింది.
This post was last modified on June 24, 2021 10:58 am
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…