మన వైద్య నిపుణులు, డాక్టర్లు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఒక డాక్టరంటారు. కాదు కాదు చాలా తీవ్రంగా రాబోతోందని మరో వైద్య నిపుణుడుంటారు. థర్డ్ వేవ్ తీవ్రత విషయంలో డాక్టర్లు, వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞుల్లోనే ఇన్ని వాదాలుంటే జనాలు ఎవరిని నమ్మాలి ? అసలు వైద్యరంగంలోని ప్రముఖుల మధ్యే ఇంత గందరగోళం ఎందుకుంటోందో అర్ధం కావటంలేదు.
సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కొందరు నిపుణులు ఎప్పటినుండో చెబుతున్నారు. అయితే మరికొందరు నిపుణులు దీనికి విరుద్ధంగా ప్రకటనలిస్తున్నారు. సెకెండ్ వేవ్ తో పోల్చుకుంటే థర్డ్ వేవ్ మరీ అంత ప్రమాధకరం కాదని మరికొందరు ప్రకటిస్తున్నారు. ఏదేమైనా సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉంటుందో లేకపోతే కాస్త తక్కువగా ఉంటుందో ఎవరు చెప్పలేకున్నది వాస్తవం.
అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక శాస్త్రజ్ఞుడో నిపుణుడో థర్డ్ వేవ్ తీవ్రత ప్రమాధకరంగా ఉంటుందని జనాలు ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని హెచ్చరించిన వెంటనే ఇంకొకరు దానికి విరుద్ధంగా ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారో అర్ధం కావటంలేదు. డాక్టర్లు, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల్లో థర్డ్ వేవ్ పై కనిపిస్తున్న గందరగోళం మొత్తం సమాజాన్నే గందరగోళంలోకి నెట్టేస్తోందన్నది వాస్తవం.
అయితే జనాలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తీవ్రత విషయాన్ని పక్కనపెట్టేస్తే భౌతికదూరం, మాస్కుల వాడకం, శానిటైజర్ల వినియోగంలో గనుక అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ కరోనా వైరస్ విజృంభణ తప్పదు. డాక్టర్లు ఏమి చెబుతారన్నది వేరే విషయం. జనాలు మాత్రం ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాల్సిందే అని మొదటి రెండు దశల్లో చాలా స్పష్టంగా బయటపడింది.
This post was last modified on June 24, 2021 10:58 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…