మన వైద్య నిపుణులు, డాక్టర్లు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఒక డాక్టరంటారు. కాదు కాదు చాలా తీవ్రంగా రాబోతోందని మరో వైద్య నిపుణుడుంటారు. థర్డ్ వేవ్ తీవ్రత విషయంలో డాక్టర్లు, వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞుల్లోనే ఇన్ని వాదాలుంటే జనాలు ఎవరిని నమ్మాలి ? అసలు వైద్యరంగంలోని ప్రముఖుల మధ్యే ఇంత గందరగోళం ఎందుకుంటోందో అర్ధం కావటంలేదు.
సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కొందరు నిపుణులు ఎప్పటినుండో చెబుతున్నారు. అయితే మరికొందరు నిపుణులు దీనికి విరుద్ధంగా ప్రకటనలిస్తున్నారు. సెకెండ్ వేవ్ తో పోల్చుకుంటే థర్డ్ వేవ్ మరీ అంత ప్రమాధకరం కాదని మరికొందరు ప్రకటిస్తున్నారు. ఏదేమైనా సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉంటుందో లేకపోతే కాస్త తక్కువగా ఉంటుందో ఎవరు చెప్పలేకున్నది వాస్తవం.
అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక శాస్త్రజ్ఞుడో నిపుణుడో థర్డ్ వేవ్ తీవ్రత ప్రమాధకరంగా ఉంటుందని జనాలు ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని హెచ్చరించిన వెంటనే ఇంకొకరు దానికి విరుద్ధంగా ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారో అర్ధం కావటంలేదు. డాక్టర్లు, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల్లో థర్డ్ వేవ్ పై కనిపిస్తున్న గందరగోళం మొత్తం సమాజాన్నే గందరగోళంలోకి నెట్టేస్తోందన్నది వాస్తవం.
అయితే జనాలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తీవ్రత విషయాన్ని పక్కనపెట్టేస్తే భౌతికదూరం, మాస్కుల వాడకం, శానిటైజర్ల వినియోగంలో గనుక అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ కరోనా వైరస్ విజృంభణ తప్పదు. డాక్టర్లు ఏమి చెబుతారన్నది వేరే విషయం. జనాలు మాత్రం ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాల్సిందే అని మొదటి రెండు దశల్లో చాలా స్పష్టంగా బయటపడింది.
This post was last modified on June 24, 2021 10:58 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…