ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని కి నందమూరి వారసుడు చైతన్య కృష్ణ వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని… ఇటీవల చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైతన్య కృష్ణ.. కొడాలి నాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్లు తిడితే సహించేది లేదని హెచ్చరించారు. లోకేష్ జోలికి వస్తే తాటతీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బూతుల మంత్రి అని ముద్ర వేసుకొని కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ వీడియో విడుదల చేయడం గమనార్హం.
ఒక మంత్రి హోదాలో ఉండి నోటికి ఎంతొస్తే.. అంత వెధవ, సన్నాసి, దద్దమ్మ అంటూ లోకేష్ ను తిడతావా అంటూ మండిపడ్డారు. లోకేష్ ను వేస్ట్ ఫెలో అని ముద్ర వేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఐటీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గా లోకేష్ యువతకు ఉద్యోగాలు కల్పించారని అలాంటి వ్యక్తిని విమర్శించే అర్హత నానికి ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా 12వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. టీడీపీ పై కొడాలి నాని, వైసీపీ నేతలు దుర్భాషలాడటం మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షాలను విమర్శించే బదులు పాలనపై దృష్టి సారిస్తే మంచిదని వైసీపీ నేతలకు నందూమరి చైతన్య కృష్ణ సూచించారు.
This post was last modified on June 23, 2021 10:53 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…