ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని కి నందమూరి వారసుడు చైతన్య కృష్ణ వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని… ఇటీవల చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైతన్య కృష్ణ.. కొడాలి నాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్లు తిడితే సహించేది లేదని హెచ్చరించారు. లోకేష్ జోలికి వస్తే తాటతీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బూతుల మంత్రి అని ముద్ర వేసుకొని కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ వీడియో విడుదల చేయడం గమనార్హం.
ఒక మంత్రి హోదాలో ఉండి నోటికి ఎంతొస్తే.. అంత వెధవ, సన్నాసి, దద్దమ్మ అంటూ లోకేష్ ను తిడతావా అంటూ మండిపడ్డారు. లోకేష్ ను వేస్ట్ ఫెలో అని ముద్ర వేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఐటీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గా లోకేష్ యువతకు ఉద్యోగాలు కల్పించారని అలాంటి వ్యక్తిని విమర్శించే అర్హత నానికి ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా 12వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. టీడీపీ పై కొడాలి నాని, వైసీపీ నేతలు దుర్భాషలాడటం మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షాలను విమర్శించే బదులు పాలనపై దృష్టి సారిస్తే మంచిదని వైసీపీ నేతలకు నందూమరి చైతన్య కృష్ణ సూచించారు.
This post was last modified on June 23, 2021 10:53 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…