Political News

జగన్ వాదన నిలుస్తుందా ?

అప్పుడెప్పుడో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. అయిపోయిన పనులకు బిల్లులు చెల్లించకపోతే పనులుచేసిన కాంట్రాక్టర్ల పరిస్ధితి ఏమిటనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించటంలేదు. 2018-19లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో జరిగిన పనులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు.

2018-19లో పనుల బిల్లులను 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత చెల్లించాలి. కానీ ప్రభుత్వం మారిపోవడంతో అంతా తారుమారైపోయింది. ఆ దెబ్బకు అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు రాలేదు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపులపై కోర్టులో కేసు వేశారు. ఆ విచారణలో కోర్టు ప్రభుత్వాన్ని గట్టిగానే చివాట్లు పెట్టింది.

అయిపోయిన రెండు పనులకు సంబంధించిన బిల్లులు రు. 50 లక్షలు కూడా లేదు. అలాంటిది డబ్బులు లేవన్న సాకుతో బిల్లులు ఆపేయటం జగన్ కు ఎంతమాత్రం తగదు. ఒకవైపు వేల కోట్లరూపాయాలను సంక్షేమానికి ఖర్చుపెడుతున్నట్లు జగనే స్వయంగా చెబుతున్నారు. మరోవైపు రెండు బిల్లులను చెల్లించేందుకు డబ్బులు లేవంటే ఎవరైనా నమ్ముతారా ?

ఇదే ప్రశ్న కోర్టు కూడా అడిగింది. మరి ఉన్నతాధికారులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. టీడీపీ హయాంలో జరిగిన పనులకు తామెందుకు బిల్లులు చెల్లించాలనే ఆలోచనలో ఉంటే అది పూర్తిగా తప్పని ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. పనులు చేసిన కాంట్రాక్టర్లు టీడీపీ నేతలే అయ్యుండచ్చు అయినా అయిపోయిన పనులకు బిల్లులు ఆపటం మాత్రం తప్పే. మరి తన తప్పును జగన్ ప్రభుత్వం ఎప్పుడు సరిచేసుకుంటుందో ?

This post was last modified on June 23, 2021 10:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

23 minutes ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

44 minutes ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

3 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

4 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

4 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

6 hours ago