అప్పుడెప్పుడో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. అయిపోయిన పనులకు బిల్లులు చెల్లించకపోతే పనులుచేసిన కాంట్రాక్టర్ల పరిస్ధితి ఏమిటనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించటంలేదు. 2018-19లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో జరిగిన పనులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు.
2018-19లో పనుల బిల్లులను 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత చెల్లించాలి. కానీ ప్రభుత్వం మారిపోవడంతో అంతా తారుమారైపోయింది. ఆ దెబ్బకు అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు రాలేదు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపులపై కోర్టులో కేసు వేశారు. ఆ విచారణలో కోర్టు ప్రభుత్వాన్ని గట్టిగానే చివాట్లు పెట్టింది.
అయిపోయిన రెండు పనులకు సంబంధించిన బిల్లులు రు. 50 లక్షలు కూడా లేదు. అలాంటిది డబ్బులు లేవన్న సాకుతో బిల్లులు ఆపేయటం జగన్ కు ఎంతమాత్రం తగదు. ఒకవైపు వేల కోట్లరూపాయాలను సంక్షేమానికి ఖర్చుపెడుతున్నట్లు జగనే స్వయంగా చెబుతున్నారు. మరోవైపు రెండు బిల్లులను చెల్లించేందుకు డబ్బులు లేవంటే ఎవరైనా నమ్ముతారా ?
ఇదే ప్రశ్న కోర్టు కూడా అడిగింది. మరి ఉన్నతాధికారులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. టీడీపీ హయాంలో జరిగిన పనులకు తామెందుకు బిల్లులు చెల్లించాలనే ఆలోచనలో ఉంటే అది పూర్తిగా తప్పని ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. పనులు చేసిన కాంట్రాక్టర్లు టీడీపీ నేతలే అయ్యుండచ్చు అయినా అయిపోయిన పనులకు బిల్లులు ఆపటం మాత్రం తప్పే. మరి తన తప్పును జగన్ ప్రభుత్వం ఎప్పుడు సరిచేసుకుంటుందో ?
This post was last modified on June 23, 2021 10:35 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…