కరోనా మహమ్మారి మన దేశంలో విలయతాండవం సృష్టించింది. ఈ మహమ్మారి సెకండ్ వేవ్ లో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే.. దాని నుంచి కోలుకుంటున్నాం. కాగా.. అంతలోనే.. ఈ మహమ్మారి మరో రూపంలో పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రెండో దశలో అత్యధిక కేసులకు కారణమైన డెల్టా వేరియంట్.. ఇప్పుడు డెల్టాప్లస్ వేరియంట్గా రూపాంతరం చెందింది. దాంతో ప్రభుత్వాలు ఈ కొత్తరకం ప్రభావాన్ని అంచనా వేసే పనిలోపడ్డాయి. అయితే ఇది ఇప్పటికే మూడు రాష్ట్రాలకు పాకినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైతే కేంద్రం దీన్ని “వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా” మాత్రమే వర్గీకరించింది. దాని తీవ్రతను బట్టి ఆందోళనకర వేరియంట్గా వర్గీకరించాలో లేదో నిర్ణయించనుంది.
అయితే మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్లో డెల్టాప్లస్ వేరియంట్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 21 డెల్టాప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా రత్నగిరిలో తొమ్మిది కేసులు బయటపడగా.. జల్గావ్లో ఏడు, ముంబయిలో రెండు, పాల్ఘర్, ఠానే, సింధుదుర్గ్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున వెలుగులోకి వచ్చినట్లు చెప్పింది. మే 15 నుంచి 7,500 నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టగా 21 కేసులను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే డెల్టాప్లస్ వేరియంట్తో మహారాష్ట్రలో మూడోముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనా వేసింది.
మరోపక్క కేరళలో కూడా మూడు కేసులు, మధ్యప్రదేశ్ ఒక కేసు బయటపడినట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో 64 ఏళ్ల మహిళ నుంచి సేకరించిన నమూనాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ ఔషధాన్ని ఏమారుస్తుందనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడోముప్పుపై వార్తలు వస్తోన్న క్రమంలో ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించడం కొనసాగించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on June 22, 2021 6:09 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…