వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజు..తాజాగా సీఎం జగన్కు మరో లేఖను సంధించారు. అయితే.. దీనిలో ఆయన సీఎం జగన్ను చాలా చిత్రంగా వర్ణించారు. జగన్కు మంచిపేరు రావాలని కోరుకుంటున్నానని..దైవదూతగా ఆయన నిలిచిపోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే.. ఇవన్నీ సాకారం కావాలంటే.. జగన్ పాలనలో మూతబడిన అన్నా క్యాంటీన్లను.. పేరు మార్చి అయినా..ప్రారంభించాలని.. రఘురామ సీఎం జగన్కు సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో అమలైన అన్న క్యాంటీన్ల బదులు ‘జగనన్న క్యాంటీన్లు’ ప్రారంభించాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. వైఎస్ జయంతి సందర్భంగా జగనన్న లేదా రాజన్న క్యాంటీన్ పేరుతో ప్రారంభించాలని కోరారు. ‘నవ ప్రభుత్వ కర్తవ్యాల’ పేరుతో సీఎం జగన్కు ఎంపీ రఘురామ ఇటీవల లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే. ఈ లేఖలో .. అన్న క్యాంటీన్ల బదులు జగనన్న క్యాంటీన్లు ప్రారంభించాలని కోరారు. ఆకలితో ఉన్నవారికి మంచి ఆహారం అందించడం ఎంతో అవసరమని హితవు పలికారు.
లేఖ ద్వారా క్యాంటీన్ల విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. సమాజంలో రాష్ట్రంలో దేశంలో ‘ మంచి పేరుతోపాటు ‘దైవదూత’ అని జన బాహుళ్యంలో స్థిరపడిపోతుంది. మిమ్మల్ని దైవదూతగా చూడాలని కోరుకునే వారిలో నేనూ ఉన్నారు. తక్షణమే జగనన్న క్యాంటీన్ స్కీమ్ ప్రారంభించాలని సూచిస్తున్నా. పేదవారి ఆకలి తీర్చడం ద్వారా మానవత్వం ప్రదర్శించేందుకు వేదిక అవుతుంది. వైఎస్ జయంతి సందర్భంగా జగనన్న లేదా రాజన్న క్యాంటీన్ పేరుతో ప్రారంభించాలి. అని రఘురామ జగన్కు విజ్ఞప్తి చేశారు.
అయితే.. ఇప్పటి వరకు రాసిన ఏలేఖపైనా.. ప్రభుత్వం నుంచి సూటిగా స్పందన లభించలేదు. కానీ, నిన్న .. మండలి రద్దు కోరుతూ.. రఘురామ రాసిన లేఖపై పరోక్షంగా.. సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మండలి రద్దుకు కట్టుబడతామని చెప్పడం గమనార్హం.
This post was last modified on June 22, 2021 12:49 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…