Political News

ఉత్త‌రాంధ్ర‌లో క‌నిపించ‌ని సేన.. పొలిటిక‌ల్ ఫీట్లు త‌ప్ప‌వా..?


రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఎక్క‌డ జ‌న‌సేన ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది ? అంటే.. ఠ‌క్కున చెప్పే మాట… ఉత్త‌రాంధ్ర‌. జ‌న‌సేన రాజ‌కీయాలు ఎక్కువ‌గా.. ఉత్త‌రాంధ్ర‌లోనే కొన‌సాగాయి. పార్టీ అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్ని నెల‌ల పాటు.. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల మ‌ధ్య ప్ర‌సంగాలు గుప్పించారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు హ‌యాంలోనే ఆయ‌న ఎలుగెత్తారు. త‌ర్వాత‌.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు కూడా నెల‌ల త‌ర‌బ‌డి.. ఆ జిల్లాల్లోనే మ‌కాం వేసి మ‌రీ ప్ర‌చారం చేశారు. దీంతో కోస్తా… సీమ ప్రాంతాల కంటే.. కూడా ఉత్త‌రాంధ్ర‌లో జ‌న‌సేన‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారని అంద‌రూ అనుకున్నారు.

కానీ, గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఉత్త‌రాంధ్ర‌లో ఆశించిన విధంగా ఓట్లు ప‌డ‌లేదు. పైగా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా పోటీ చేసిన విశాఖప‌ట్నం జిల్లాలోని గాజువాక‌లోనే ఆయ‌న ఓడిపోయారు. వాస్త‌వానికి ఏపీ మొత్తంలో ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకుంది. కీల‌క‌మైన విశాఖ ఎంపీ సీటులో సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ గెలుస్తార‌ని అంద‌రూ అనుకుంటే ఆయ‌న మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. ఎన్నిక‌లు అయ్యి రెండేళ్ల‌య్యింది. స‌రే ఉత్త‌రాంధ్ర‌లో ప‌వ‌న్ ప్రాణాలు పెట్టుకుని మ‌రీ ఇక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేశారు క‌దా.. మ‌రి ఇక్క‌డ ఇప్పుడు పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

వాస్త‌వానికి మిగిలిన రెండు ప్రాంతాలైన కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల‌తో పోల్చుకుంటే.. ఉత్త‌రాంధ్ర‌లో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. కోస్తాంధ్ర‌లో క‌నీసం వాయిస్ వినిపించేందుకు నాయ‌కులు ఉన్నారు. జెండా ప‌ట్టుకునేందుకు కార్య‌క‌ర్త‌లైనా ఉన్నారు. మరీ ముఖ్యంగా పోతుల మ‌హేష్ వంటి వారు.. కోస్తాలో పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నారు. కానీ, ఉత్త‌రాంధ్ర విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ అభ్య‌ర్థి.. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీ వీడిపోయారు.

ఇక‌, ఇత‌ర నేత‌లు కూడా పార్టీకి అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కీల‌క‌మైన శ్రీకాకుళంలోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు.. పార్టీ వాయిస్ వినిపించ‌డం లేదు. దీంతో ఉత్త‌రాంధ్ర‌లో జ‌న‌సేన ఉన్న‌ట్టా? లేన‌ట్టా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌వ‌న్ పుంజుకుంటేనే పార్టీ… లేక‌పోతే.. లేన‌ట్టే అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on June 21, 2021 7:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

2 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

4 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

6 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

6 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

8 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

8 hours ago