Political News

ఏపీ స‌ర్కారు పంతం.. ఎంసెట్‌కు ప‌చ్చ‌జెండా

“మా కొద్దీ..ప‌రీక్ష‌లు.. క‌రోనాతో అల్లాడిపోతున్నా.. ప‌రీక్షలేంటి?” “మా పిల్ల‌ల‌కుచ‌దువులు ముఖ్య‌మే.. అంత‌క‌న్నా.. వారి ప్రాణాలూ ముఖ్య‌మే. ప్ర‌భుత్వం ఆలోచించాలి!”

ఇదీ.. చ‌దువులు-ప‌రీక్ష‌ల‌పై ఏపీలో విద్యార్థులు వారి త‌ల్లిదండ్రులు.. కొన్నాళ్లుగా చేస్తున్న వ్యాఖ్య‌లు. ఈ క్ర‌మంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఏకంగా.. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌తో వ‌ర్చువ‌ల్ భేటీలు నిర్వ‌హించి.. వారి అభిప్రాయాలు కూడా సేక‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు పిల్ల‌ల ప్రాణాలే ముఖ్య‌మని త‌ల్లిదండ్రులు.. ముక్త‌కంఠంతో పేర్కొన్నారు.

అయితే.. సీఎం జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం ఎవ‌రు ఏమ‌నుకున్నా.. ఎవ‌రు ఎంత బాధ‌ప‌డినా బేఖాతర్ చేస్తోంద నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప‌రీక్ష‌లు నిర్వ‌హించే తీరుతామ‌ని.. ప్ర‌క‌టిస్తూ.. వ‌చ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌.. అన్న‌ట్టే.. స‌ర్కారు పంతాన్ని నెర‌వేర్చేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. తాజాగా ఆయ‌న ఎంసెట్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేశారు.

రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ -2021 పరీక్షలకు సంబంధించి మంత్రి సురేష్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు మంత్రి చెప్పారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు.

అంటే.. మొత్తంగా క‌రోనా ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ప్ర‌జ‌లు అల్లాడుతున్నా.. మర‌ణాలు కొన‌సాగుతున్నా.. స‌ర్కారు త‌మ ఇష్టానుసార‌మే వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం.. పంతానికి పోతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి సీబీఎస్ఈ స‌హా అనేక ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని.. సుప్రీం కోర్టు ఆదేశించిన మూడు రోజులు కూడా గ‌డవ‌క‌ముందే.. ఏపీ స‌ర్కారు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ.. ఎంసెట్‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేయ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

2 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

2 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

5 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

5 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

6 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

6 hours ago