Political News

మడ అడవుల్లోనూ కోర్టు జోక్యం – నరకొద్దు !

జగన్ ఆలోచనలకు హైకోర్టు నుంచి అడగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా మడ అడవులు ధ్వంసం చేయడంపై కొందరు మత్స్యకారులు హైకోర్టులో పిటిషను వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు వెంటనే మడ అడవుల ధ్వంసాన్ని ఆపేయాలని సూచించింది. నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం వెంటనే కౌంటరు దాఖలు చేయాలని ఆదేేశించింది.

కొద్ది రోజలుగా మడ అడవుల నరికివేతపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కాకినాడ వద్ద సముద్ర తీరాన వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న మడ అడవులను చదును చేసి అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కొంత భాగం చదును చేసింది. ఇది తీవ్ర వివాదాస్పదం అయ్యింది.

విశాఖ పట్నానికి యారాడ కొండలు రక్షణ కల్పించినట్టే కాకినాడకు మడ అడవులు సముద్రం నుంచి రక్షణ కల్పిస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు వాదిస్తున్నారు. పైగా ఇక్కడ కోరంగి బర్డ్ శాంక్చుయరీలో అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయని… మడ అడవులు ధ్వంసం చేస్తే పక్షులకు ముప్పు ఏర్పడుతుందని పలువురు ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. అనేక తుపాన్ల నుంచి కాకినాడను రక్షించిన మడ అడవులు లేకపోతే భవిష్యత్తులో ముప్పు తప్పదని స్థానికులు చెబుతున్నారు.

పేదలకు మరెక్కడైనా ఇళ్లు ఇవ్వండి… మడ అడవులను మాత్రం నరకొద్దు అని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కొందరు మత్స్యకారులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. అంతవరకు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది.

This post was last modified on May 18, 2020 11:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago