Categories: Political News

షాకింగ్ రిపోర్టు: ప్రపంచ వ్యాప్తంగా కోట్ల ఉద్యోగాలు ఫట్

కంటికి కనిపించని కరోనా వైరస్ కారణంగా ఆ దేశం.. ఈ దేశం అన్నది తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. సంపన్న దేశాల్లోనూ ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని దారుణమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కరోనాను వెనువెంటనే కంట్రోల్ చేయాలని.. లేని పక్షంలో ప్రపంచవ్యాప్తంగా  కోట్లాది కొలువులు పోవటం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కరోనాను కంట్రోల్ చేసేందుకు వివిధ దేశాలు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటిస్తున్నాయి. దీంతో ఉత్పాదకత పడిపోవటమే కాదు.. వివిధ దేశాల్లోని పలు సంస్థలు తమ వ్యాపారాల్ని నిర్వహించలేక ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. ఎప్పుడూ సింగిల్ డిజిట్ దాటని అమెరికా.. యూరప్ లలో నిరుద్యోగ రేటు డబుల్ డిజిట్ కు చేరుకోవటం చూస్తే.. పరిస్థితి ఎలా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు.

ఇదిలా ఉంటే..కరోనా కారణంగా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక నివేదికను సిద్ధం చేసింది. ఇందులో పలు షాకింగ్ అంశాలు చోటు చేసుకున్నాయి. కరోనా చెలరేగిపోతున్న వేళ.. దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగాల్ని కోల్పోయినట్లుగా గుర్తించారు. వాస్తవానికి ఆర్థిక నిపుణులు లెక్క వేసిన దాని కంటే ఈ గణాంకాలు ఏడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటివరకూ ఎప్పుడు లేనంతగా ఆస్ట్రియాలో నిరుద్యోగం పన్నెండు శాతానికి చేరుకుంది. సంపన్న దేశాల్లో ఒకటిగా చెప్పే జర్మనీలో కరోనా ముందు వరకూ చేసే పనికి గంటల చొప్పున వేతనాన్ని ఇచ్చేవారు. తాజాగా నెలకొన్న పరిస్థితులతో కంపెనీలు ఉద్యోగుల పని గంటల్ని రికార్డు స్థాయిలో తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో 4.7 లక్షల కంపెనీలు జర్మనీ ప్రభుత్వాన్ని వేతన సాయానికి అప్లై చేసుకోవటం విశేషం.

వారం వ్యవధిలో బ్రిటన్ లో 27 శాతం సిబ్బందిని తగ్గించారు. గడిచిన రెండు వారాల్లో యూరప్ లో పది లక్షల మంది తమకు బతుకు గడవటమే కష్టంగా ఉన్నట్లుగా పేర్కొంటూ ప్రభుత్వ సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా పద్నాలుగు శాతం నిరుద్యోగం నమోదైంది. స్పెయిన్ లో ఉద్యోగాలుకోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఫ్రాన్స్ లో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక ప్రభుత్వ సాయాన్ని కోరుతుండటం గమనార్హం.

ప్రైవేటు రంగంలో పని చేస్తున్న కార్మికుల్లో 20 శాతం మందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని.. ప్రభుత్వమే సాయం చేయాలని కోరుతున్నారు. థాయ్ లాండ్ దేశ జనాభాలో మూడో వంతు మంది (2.3కోట్లు) ప్రభుత్వం ఇచ్చే నగదు సాయానికి అప్లై చేసుకోవటం గమనార్హం. చైనాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నా.. రెండునెలలుగా కరోనా విలయతాండవటంతో దగ్గర దగ్గర 80 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లుగా తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే.. ఆ దేశం ఈ దేశం అన్నది తేడా లేకుండా.. ప్రపంచంలోని పలు దేశాల్లోని ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువంటున్నారు.


This post was last modified on April 9, 2020 6:44 pm

Share

Recent Posts

సౌండ్ సరిపోతుందా శ్రీనివాసా

వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…

1 hour ago

బెజవాడ నడిబొడ్డున ముద్రగడ విగ్రహం

కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…

3 hours ago

కాబోయే విద్యాశాఖ మంత్రి ఎవరు?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…

3 hours ago

యువత తిరగబడింది… రాజ్యం ఉలికిపడింది!

నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…

4 hours ago

శ్రీగౌరి నేర్చుకోవాల్సిన బేబీ పాఠాలు

మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి  అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…

5 hours ago

ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…

6 hours ago