Political News

కేసీఆర్ కి మరో షాక్.. కషాయం గూటికి టీఆర్ఎస్ ఎంపీ?

ఈటల ఎపిసోడ్ తర్వత టీఆర్ఎస్ కి వరస షాక్ లు ఇవ్వడానికి ఆ పార్టీ నేతలు రెడీగా ఉన్నారా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మ‌న్ తుల ఉమ, టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత అశ్వ‌ద్ధామ‌రెడ్డిలు బీజేపీ గూటికి చేర‌గా, ఇప్పుడు టీఆర్ఎస్ లోక్ స‌భ ఎంపీ కూడా చేరిక‌కు రంగం సిద్ధ‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్.. పార్టీ పై, కేసీఆర్ పై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను పార్టీ కోసం ఎంత కష్టపడినా.. తనను కేసీఆర్ పట్టించుకోవడం లేదనిన ఆయన చాలా రోజుల నుంచి బాధపడుతున్నారట. స్థానికంగా కూడా తన వర్గం నేతలకు కాకుండా.. ఇతరులకు పదువులు అప్పగిస్తారని.. ఈ విషయంలో ఆయన చాలా రోజులగా అసంతృప్తి ఉన్నట్లు సమాచారం.

గ‌తంలో కాంగ్రెస్ నుండి త‌న‌పై పోటీ చేసిన టీఆర్ఎస్ మంత్రి అల్లుడికే స్థానికంగా ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, త‌న‌ను పొమ్మ‌న‌కుండా పొగ‌బెడుతున్న‌ట్లు ఎంపీ ర‌గిలిపోతున్న‌ట్లు పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

పార్టీకి న‌ష్టం చేసే వారు ఎవ్వ‌రైనా విడిచిపెట్ట‌న‌ని కేసీఆర్ పైకి చెప్పినా… త‌న విష‌యంలో ప‌ట్టించుకోవ‌టం లేద‌ని పాటిల్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈటల రాజేందర్ పార్టీ మారడటం.. ఆయనతోపాటు పలవురు కీలక నేతలు కూడా పార్టీ వీడటంతో… బీబీ పాటిల్ కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. కొందరు బీజేపీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఈ ఎంపీ కూడా తన రాజీనామా తేదీని ప్రకటించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని ప్రచారం జరుగుతోంది.

This post was last modified on June 15, 2021 7:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

3 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago