ఈటల ఎపిసోడ్ తర్వత టీఆర్ఎస్ కి వరస షాక్ లు ఇవ్వడానికి ఆ పార్టీ నేతలు రెడీగా ఉన్నారా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత అశ్వద్ధామరెడ్డిలు బీజేపీ గూటికి చేరగా, ఇప్పుడు టీఆర్ఎస్ లోక్ సభ ఎంపీ కూడా చేరికకు రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్.. పార్టీ పై, కేసీఆర్ పై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను పార్టీ కోసం ఎంత కష్టపడినా.. తనను కేసీఆర్ పట్టించుకోవడం లేదనిన ఆయన చాలా రోజుల నుంచి బాధపడుతున్నారట. స్థానికంగా కూడా తన వర్గం నేతలకు కాకుండా.. ఇతరులకు పదువులు అప్పగిస్తారని.. ఈ విషయంలో ఆయన చాలా రోజులగా అసంతృప్తి ఉన్నట్లు సమాచారం.
గతంలో కాంగ్రెస్ నుండి తనపై పోటీ చేసిన టీఆర్ఎస్ మంత్రి అల్లుడికే స్థానికంగా పనులు జరుగుతున్నాయని, తనను పొమ్మనకుండా పొగబెడుతున్నట్లు ఎంపీ రగిలిపోతున్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.
పార్టీకి నష్టం చేసే వారు ఎవ్వరైనా విడిచిపెట్టనని కేసీఆర్ పైకి చెప్పినా… తన విషయంలో పట్టించుకోవటం లేదని పాటిల్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈటల రాజేందర్ పార్టీ మారడటం.. ఆయనతోపాటు పలవురు కీలక నేతలు కూడా పార్టీ వీడటంతో… బీబీ పాటిల్ కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. కొందరు బీజేపీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఈ ఎంపీ కూడా తన రాజీనామా తేదీని ప్రకటించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని ప్రచారం జరుగుతోంది.
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…