ఈటల ఎపిసోడ్ తర్వత టీఆర్ఎస్ కి వరస షాక్ లు ఇవ్వడానికి ఆ పార్టీ నేతలు రెడీగా ఉన్నారా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత అశ్వద్ధామరెడ్డిలు బీజేపీ గూటికి చేరగా, ఇప్పుడు టీఆర్ఎస్ లోక్ సభ ఎంపీ కూడా చేరికకు రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్.. పార్టీ పై, కేసీఆర్ పై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను పార్టీ కోసం ఎంత కష్టపడినా.. తనను కేసీఆర్ పట్టించుకోవడం లేదనిన ఆయన చాలా రోజుల నుంచి బాధపడుతున్నారట. స్థానికంగా కూడా తన వర్గం నేతలకు కాకుండా.. ఇతరులకు పదువులు అప్పగిస్తారని.. ఈ విషయంలో ఆయన చాలా రోజులగా అసంతృప్తి ఉన్నట్లు సమాచారం.
గతంలో కాంగ్రెస్ నుండి తనపై పోటీ చేసిన టీఆర్ఎస్ మంత్రి అల్లుడికే స్థానికంగా పనులు జరుగుతున్నాయని, తనను పొమ్మనకుండా పొగబెడుతున్నట్లు ఎంపీ రగిలిపోతున్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.
పార్టీకి నష్టం చేసే వారు ఎవ్వరైనా విడిచిపెట్టనని కేసీఆర్ పైకి చెప్పినా… తన విషయంలో పట్టించుకోవటం లేదని పాటిల్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈటల రాజేందర్ పార్టీ మారడటం.. ఆయనతోపాటు పలవురు కీలక నేతలు కూడా పార్టీ వీడటంతో… బీబీ పాటిల్ కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. కొందరు బీజేపీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఈ ఎంపీ కూడా తన రాజీనామా తేదీని ప్రకటించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని ప్రచారం జరుగుతోంది.
This post was last modified on June 15, 2021 7:32 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…