Political News

జగన్ పాలన ఎలా వుంది.. జేడీ లక్ష్మినారాయణ

ఏపీ ముఖ్యమంత్రికి అరుదైన వ్యక్తి నుంచి ప్రశంసలు వచ్చాయి. ఆయన ఎవరో కాదు… జగన్ సీబీఐ కేసులను డీల్ చేసిన అప్పటి సీబీఐ జేడీ… లక్ష్మినారాయణ. జగన్ హామీల అమలులో మాట తప్పడం లేదని జేడీ జగన్ పై ప్రశంసలు కురిపించారు.అంతే కాదు, మరో అరుదైన సందర్భం గురించి వెల్లడించారు జేడీ.

బ్యూరోక్రసీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జేడీ లక్ష్మినారాయణ ప్రస్తుతం క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. జనసేనలో చేరి విశాఖపట్నం నుంచి ఎంపీగా ఓడిపోయిన జేడీ ఆ తర్వాత చాలాకాలం ఆ పార్టీలో యాక్టివ్ గా లేరు. పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత మళ్లీ సినిమాలు చేయడానికి నిర్ణయించడంతో అప్పట్లో పవన్ సినిమాలు చేయడం తనకు నచ్చలేదంటూ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఒక మీడియా సంస్థకు జేడీ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మరోసారి తాను జనసేన నుంచి బయటకు రావడానికి పవన్ సినిమాలు చేయడమే కారణమని చెప్పుకొచ్చారు.

ఇక జగన్ ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటి అంటే… ఏడాది అయ్యాక చెబుతాను అన్నారు. అయితే, అక్కడితో ఆపకుండా… జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. ‘జగన్ ఇంకా నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. కొందరు మేనిఫెస్టోను కేవలం ఎన్నికల్లో విజయం కోసమే అనుకుంటారు. మేనిఫెస్టోలో చెప్పినవి చేయరు. కానీ జగన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్న విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు’ అంటూ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన ఘటన గురించి జేడీ వెల్లడించారు. సీబీఐలో ఉన్నపుడే జగన్ అక్రమాస్తుల కేసు విచారించిన తర్వాత అనంతరం ఒక సారి జగన్ -జేడీ ఒకరికొకరు ఎయిర్ పోర్టులో ఎదురుపడ్డారట. ‘నమస్కారం అంటే నమస్కారం’ ఇద్దరు ఒకరికొకరు నమస్కారం పెట్టుకున్నారట. ఉద్యోగిగా తన బాధ్యత విచారణ, అంతకుమించి వ్యక్తిగతంగా ఆలోచించడానికి ఏముంటుందని జేడీ వ్యాఖ్యానించారు.

నేను పూర్థి స్తాయిలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాను. నాకు జనసేనలో కుదరలేదు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ లేను. గత రెండు వారాల్లోనే తనకు నాలుగు పార్టీలు అంటగట్టారని… సరదాగా వ్యాఖ్యానించారు. కొద్దిరోజుల క్రితం కూడా జేడీ ఓ ఇంటర్వ్యూలో జగన్ విమర్శించడానికి అవకాశం వచ్చిన ప్రయత్నించలేదు. తాజా వ్యాఖ్యలతో జేడీ కొత్త రాజకీయ ఉత్కంఠను రేకెత్తించారు.

This post was last modified on May 18, 2020 11:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

45 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago