ఏపీలో మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ను విస్తరించనున్నారు. ఈ మార్పులు, చేర్పుల్లో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు తమకు బెర్త్ దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఐదు సార్లు గెలిచిన వారు కూడా ఉన్నారు. అయితే జగన్ తొలి మంత్రి వర్గంలో ప్రాంతీయ, సామాజిక సమీకరణల్లో 90 శాతం మంది జూనియర్లకే మంత్రి పదవులు ఇచ్చారు. అయితే ఈ సారి మాత్రం తమకు ఖచ్చితంగా బెర్త్ ఖాయమని ఎక్కువ మంది సీనియర్లు ఆశల పల్లకీలో ఉన్నారు. ఈ మార్పుల్లో కొందరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న అంచనాలు అధికార పార్టీలో ఉంది.
వీరికి ప్రాంతీయ, సామాజిక సమీకరణలు కలిసి వస్తున్నాయి. ఇక జగన్ కొందరికి ఇప్పటికే మంత్రి పదవులపై హామీ ఇచ్చి ఉన్నారు. ఈ లిస్టులో గుంటూరు జిల్లాకే చెందిన మర్రి రాజశేఖర్ తో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఉన్నారు. ఇక తొలి టర్మ్లోనే ఖచ్చితంగా మంత్రి పదవి దక్కించుకోవాల్సిన కొందరు ఎమ్మెల్యేలకు అనేక కారణాలతో మంత్రి పదవులు రాలేదు. ఈ లిస్టులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కూడా ఒకరు. జగన్ కోసం ముందే తన ఎమ్మెల్యే పదవి వదులుకున్న ఆయన 2012 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో తన సొంత సీటు అయిన నరసాపురం వదులుకుని ఆచంటలో పోటీ చేసి ఓడిపోయారు.
2014లో అప్పటికప్పుడు పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు కోసం జగన్ సూచనల మేరకే ప్రసాదరాజు ఆచంటలో పోటీ చేసి ఓడిపోయారు. ఇలా జగన్ కోసం ఎన్నో త్యాగాలు చేసినా ఏనాడు క్రమశిక్షణ దాటలేదు. ఇక క్షత్రియ వర్గం కోటాలో 2019లోనే మంత్రి అవ్వాల్సి ఉంది. అయితే చెరుకువాడ రంగనాథరాజు జాతీయ స్థాయిలో క్షత్రియ నేతలతో జగన్పై ఒత్తిడి తేవడంతో పాటు బలమైన లాబీయింగ్ చేయడంతో జగన్ రంగనాథరాజుకు మంత్రి పదవి ఇవ్వక తప్పని పరిస్థితి. ఇక రంగనాథ రాజు వయస్సు నేపథ్యంలో ఆయన శాఖలో మరీ అంత సంచలనాలు ఏవీ నమోదు చేయలేదు.
అదే క్షత్రియ వర్గానికి చెందిన ఎంపీ రఘురామను కట్టడి చేసే విషయంలోనూ రంగనాథరాజు సక్సెస్ కాలేదన్న అభిప్రాయం జగన్కు ఉంది. ఏదేమైనా తనను నమ్ముకున్న ప్రసాదరాజుకు ఈ సారి బెర్త్ ఖాయం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ఉన్నత స్థాయి సమావేశాలు, నేతలతో కూడా ప్రసాదరాజుకు హింట్ వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే రఘురామ విషయంలో క్షత్రియుల్లో వైసీపీ, జగన్పై వ్యతిరేకత పెరుగుతోందన్న అంచనాలు ఉన్నాయి. దీనికి బ్రేక్ వేసేలా జగన్ ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా ? అన్న సందేహం కూడా ఉంది.
This post was last modified on June 15, 2021 1:03 pm
అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…
ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…
సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు…
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే నటుల్లో బ్రహ్మానందం ఒకరు. నటుడిగా ఆయన సంపాదించుకున్న ఆదరణ గురించి…
పరకాల నుంచి పోటీ చేయాలని మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మితా పటేల్ భావించిన సంగతి తెలిసిందే. అయితే,…