Political News

బీజేపీకే అంటుకున్న మంటలు

పచ్చని, ప్రశాంత దీవులలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చిచ్చుపెట్టింది. కేరళకు ఆనుకునుండే లక్షద్వీప్ లో నిబంధనల పేరుతో బీజేపీ మంటలు పెట్టాలని చూసింది. కానీ చివరకు ఆ మంటలు పార్టీకే అంటుకున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే లక్షద్వీప్ లో జనాభా సుమారు 85 వేలు. ఇందులో 95 శాతం ముస్లిం మైనారిటీలే ఉంటారు.

ఇలాంటి ద్వీపంలో స్ధానికులకు వ్యతిరేకంగా ఉండే చట్టాలను అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ కుమార్ తెచ్చారు. దాంతో ఇపుడు ద్వీప్ లో ఆందోళనమొదలయ్యాయి. ఇంతకీ కొత్త నిబంధనలు ఏమిటంటే ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువుంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీకి అనర్హులట. ఇప్పటివరకు మొత్తం 10 దీవుల్లో ఒక్కచోట మాత్రమే మద్యం దొరుకుతుంది. అలాంటిది ఇపుడు అన్నీ దీవుల్లోను మద్యానికి అనుమతులు ఇచ్చేశారు.

అలాగే గో మాంసాన్ని తినటం నిషేధించారు. చివరగా గూండా చట్టాన్ని పట్టుకొచ్చారు. ఈ చట్టం కింద ఎవరైనా అరెస్టు చేస్తే ఏడాదివరకు కోర్టులో కూడా ప్రవేశపెట్టక్కర్లేదు. ఇలాంటి చట్టాలను పట్టుకొచ్చిన అడ్మినిస్ట్రేటర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దాంతో కేంద్రం కాస్త వెనక్కుతగ్గింది. ఇదే సమయంలో లక్షద్వీప్ లో బాగా పాపులరైన నటి, దర్శకురాలు, నిర్మాత, మోడలైన ఆయేషా సుల్తానాపై లక్షద్వీప్ పోలీసులు రాజద్రోహం కేసు పెట్టారు.

ఇంతకీ ఆమెమీద రాజద్రోహం కేసు ఎందుకు పెట్టారంటే అడ్మినిస్ట్రేటర్ ను సుల్తానా జీవాయుధంగా వర్ణించారు. దాంతో ఆమెపై కేసు పెట్టారు. అసలే ముస్లిం మైనారిటిలుండే ద్వీపం. పైగా కేసు పెట్టింది కూడా చాలా పాపులరైన ముస్లిం సెలబ్రిటీపైనే ఇంకేముంది లక్షద్వీప్ లో మంటలు ఒక్కసారిగా రాజుకుంది. ఎప్పుడైతే ఆయేషా మీద రాజద్రోహం కేసు పెట్టారో వెంటనే ముస్లింలు మండిపోయారు.

రాజద్రోహం కేసు మంటలు బీజేపీలోని కీలక నేతలకు బాగా తగిలింది. వెంటనే 15 మంది సీనియర్ నేతలు పార్టీకి రాజీనామాలు చేసేశారు. ఇదే విషయమై మొన్నటి మేనెలలలోనే 10 మంది సీనియర్లు రాజీనామా చేశారు. ప్రశాంతంగా ఉండే లక్షద్వీప్ లో చిచ్చుపెట్టి లబ్దిపొందుదామని ప్రయత్నించిన కేంద్రానికి ఇపుడు అదే రివర్సులో తగులుకుంది. మరి తాజా కేసు విషయంలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on June 15, 2021 8:20 am

Share
Show comments
Published by
satya

Recent Posts

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

9 mins ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

19 mins ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

1 hour ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

2 hours ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

3 hours ago

ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీ మునుగుతుందా ?

పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…

4 hours ago