Political News

బీజేపీకే అంటుకున్న మంటలు

పచ్చని, ప్రశాంత దీవులలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చిచ్చుపెట్టింది. కేరళకు ఆనుకునుండే లక్షద్వీప్ లో నిబంధనల పేరుతో బీజేపీ మంటలు పెట్టాలని చూసింది. కానీ చివరకు ఆ మంటలు పార్టీకే అంటుకున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే లక్షద్వీప్ లో జనాభా సుమారు 85 వేలు. ఇందులో 95 శాతం ముస్లిం మైనారిటీలే ఉంటారు.

ఇలాంటి ద్వీపంలో స్ధానికులకు వ్యతిరేకంగా ఉండే చట్టాలను అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ కుమార్ తెచ్చారు. దాంతో ఇపుడు ద్వీప్ లో ఆందోళనమొదలయ్యాయి. ఇంతకీ కొత్త నిబంధనలు ఏమిటంటే ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువుంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీకి అనర్హులట. ఇప్పటివరకు మొత్తం 10 దీవుల్లో ఒక్కచోట మాత్రమే మద్యం దొరుకుతుంది. అలాంటిది ఇపుడు అన్నీ దీవుల్లోను మద్యానికి అనుమతులు ఇచ్చేశారు.

అలాగే గో మాంసాన్ని తినటం నిషేధించారు. చివరగా గూండా చట్టాన్ని పట్టుకొచ్చారు. ఈ చట్టం కింద ఎవరైనా అరెస్టు చేస్తే ఏడాదివరకు కోర్టులో కూడా ప్రవేశపెట్టక్కర్లేదు. ఇలాంటి చట్టాలను పట్టుకొచ్చిన అడ్మినిస్ట్రేటర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దాంతో కేంద్రం కాస్త వెనక్కుతగ్గింది. ఇదే సమయంలో లక్షద్వీప్ లో బాగా పాపులరైన నటి, దర్శకురాలు, నిర్మాత, మోడలైన ఆయేషా సుల్తానాపై లక్షద్వీప్ పోలీసులు రాజద్రోహం కేసు పెట్టారు.

ఇంతకీ ఆమెమీద రాజద్రోహం కేసు ఎందుకు పెట్టారంటే అడ్మినిస్ట్రేటర్ ను సుల్తానా జీవాయుధంగా వర్ణించారు. దాంతో ఆమెపై కేసు పెట్టారు. అసలే ముస్లిం మైనారిటిలుండే ద్వీపం. పైగా కేసు పెట్టింది కూడా చాలా పాపులరైన ముస్లిం సెలబ్రిటీపైనే ఇంకేముంది లక్షద్వీప్ లో మంటలు ఒక్కసారిగా రాజుకుంది. ఎప్పుడైతే ఆయేషా మీద రాజద్రోహం కేసు పెట్టారో వెంటనే ముస్లింలు మండిపోయారు.

రాజద్రోహం కేసు మంటలు బీజేపీలోని కీలక నేతలకు బాగా తగిలింది. వెంటనే 15 మంది సీనియర్ నేతలు పార్టీకి రాజీనామాలు చేసేశారు. ఇదే విషయమై మొన్నటి మేనెలలలోనే 10 మంది సీనియర్లు రాజీనామా చేశారు. ప్రశాంతంగా ఉండే లక్షద్వీప్ లో చిచ్చుపెట్టి లబ్దిపొందుదామని ప్రయత్నించిన కేంద్రానికి ఇపుడు అదే రివర్సులో తగులుకుంది. మరి తాజా కేసు విషయంలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on June 15, 2021 8:20 am

Share

Recent Posts

నాగార్జున నమ్మకం ఎక్కడ తప్పింది

చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…

2 hours ago

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

5 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

7 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

8 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

8 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

8 hours ago