Political News

బీజేపికి నొప్పేంటో తెలుస్తోందా ?

దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఆ అధికారం నేరుగా ప్రజలు ఇవ్వటం వల్ల వచ్చిందికాదు. కొన్ని రాష్ట్రాల్లో మెజారిటి లేకపోయినా అధికారంలోకి వచ్చేసింది. ఫలితాల సమయంలోనే ముందుగా మేల్కొనటం ద్వారా ప్రత్యర్ధిపార్టీలకు చెందిన ఎంఎల్ఏలను లోబరుచుకోవటం తదితర మార్గాల్లో అధికారంలోకి వచ్చేసింది.

అలాగే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియాకు గాలమేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీని చీల్చేసింది. దాంతో ప్రభుత్వం పడిపోగానే తాను అధికారంలోకి వచ్చేసింది. దాంతో బీజేపీ నుండి తమ ఎంఎల్ఏలను కాపాడుకోవటానికి కాంగ్రెస్, ఇతర పార్టీలు నానా అవస్తలు పడాల్సొస్తోంది. కర్నాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.

ఇప్పుడిదంతా ఎందుకంటే పశ్చిమబెంగాల్లో తగిలిన ఎదురుదెబ్బ నుండి బీజేపీ తట్టుకోవటం కష్టంగా తయారైందట. ఎప్పుడే ఎంఎల్ఏ బీజేపీని వదిలేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరిపోతారో తెలీక అగ్రనేతలు నానా టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ మాతృసంస్ధ తృణమూల్లో చేరిపోయారు. దాంతో అదేదారిలో మరికొందరు ఎంఎల్ఏలు, నేతలు కూడా రెడీ అయిపోతున్నారు.

ముకుల్ దారిలోనే వెళ్ళాలని అనుకుంటున్న ఎంఎల్ఏలందరినీ బీజేపీలోనే ఉంచటానికి అగ్రనేతలు ఇబ్బందులు పడుతున్నారట. ఎంఎల్ఏలతో చర్చల కోసం ఏర్పాటుచేసిన రెండు సమావేశాలకు ఇప్పటికి ఎనిమిది మంది హాజరుకాలేదట. బీజేపీ శాసనసభా నేత సువేందు అధికారి ఫోన్లు చేసినా రెస్పాండ్ కావటంలేదని సమాచారం. సువేందు కూడా ఫిరాయింపు నేతే కావటం గమనార్హం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫిరాయింపు నేతలకు కానీ లేదా బీజేపీ ఎంఎల్ఏల్లో కొందరికి సువేందుతో ఏమాత్రం పడదట. అధికారానికి దూరంగా ఉండటం సాధ్యంకాక కొందరు, సువేందు అధికారితో పడక మరికొందరు ఎంఎల్ఏలు బీజేపీని వదిలేయటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఎదుటిపార్టీల్లో నుండి ఎంఎల్ఏలను లాక్కోవటానికే అలవాటుపడిపోయిన బీజేపీ అగ్రనేతలకు ఇపుడు అలాంటి ఫిరాయింపులను కాపాడుకోవటంలో తలనొప్పులేంటో తెలుస్తోందా ?

This post was last modified on June 14, 2021 10:27 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

59 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

5 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

9 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

9 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

10 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

10 hours ago