కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అగ్రనాయకుల దగ్గర ఏపీ సీఎం జగన్ మొహమాటం లేకుండా మాట్లాడేశారా ? ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఆయన కుండ బద్దలు కొట్టారా ? ఇక, ఆలోచిస్తూ.. కూర్చుంటే.. రోజులు నెలలు సంవత్సరాలు కూడా జరిగిపోతాయని.. ఈ క్రమంలో ఏదైతే అదే జరుగుతుందని ఆయన కేంద్రం వద్ద ఉన్న విషయాలను కక్కేశారా ? అంటే.. ఔననే అంటోంది జాతీయ మీడియా. నిజానికి జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. ప్లీజ్ .. ప్లీజ్.. అంటూ.. ఏపీకి సంబంధించిన విషయాలపై చర్చించేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
దీంతో పోలవరం సహా.. ప్రత్యేక హోదా.. వంటి కీలక విషయాలు ముందుకు సాగడం లేదు. ఇది జగన్కు ఇబ్బందిగా మారింది. రాజకీయంగా పక్కన పెడితే.. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు.. రాష్ట్రానికి గత సీఎం చంద్రబాబు కన్నా ఎక్కువ చేసి చూపించాల్సిన బాధ్యత జగన్పై ఉంది. లేకపోతే..రేపు వచ్చే ఎన్నికల్లో జగన్ వైఫల్యాలే..ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. పైగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే అపవాదు పడుతుంది. దీంతో తన 30 ఏళ్ల ముఖ్యమంత్రి కల నెరవేరడం కూడా కష్టమే.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీలో పర్యటించిన జగన్.. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా మాట్లాడేశారని.. ఏం జరిగినా.. ఎదుర్కొనేందుకు.. అంటే.. ఒకవేళ తన వ్యాఖ్యలతో కేంద్రంలోని పెద్దలు ఆగ్రహానికి గురై.. తనపై వ్యక్తిగత చర్యలు తీసుకున్నా కూడా ఎదుర్కొనేందుకు జగన్ రెడీ అయ్యారట. రాష్ట్ర ప్రయోజనాలు.. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకే ప్రాధాన్యంఇచ్చారని.. జాతీయ మీడియా వెల్లడించింది. ఈ క్రమంలోనే మూడు రాజధానులు, పోలవరం, సహా.. జిల్లాల ఏర్పాటు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వంటి వాటిని బల్లగుద్ది మరీ.. టైంబౌండ్ కోసం పట్టుబట్టినట్టు మీడియా వెల్లడించింది.
ఈ క్రమంలోనే తెలుగు మీడియా జగన్ ఢిల్లీ పర్యటన విషయంలో ముందుగా వేసుకున్న అంచనాలు కూడా తల్లకిందులు అయ్యాయని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనకు జగన్ వెళ్తున్నాడని తెలియగానే తెలుగు మీడియా.. ఆయన కేసుల మాఫీ కోసమే వెళ్తున్నారని.. బెయిల్ రద్దుకోసమే వెళ్తున్నారని ప్రచారం చేసింది. కానీ, ఢిల్లీలో జగన్కేంద్ర మంత్రులను నిలదీయడంతోపాటు.. ఇంకెన్నేళ్లు ఎదురు చూడాలని ప్రశ్నించడంతో సీన్ మారిపోయిందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. జగన్ బాగానే ఒత్తిడి తెచ్చినా.. కేంద్రం ఏమేరకు ఏపీపై కరుణ చూపుతుందో ? చూడాలి.
This post was last modified on June 12, 2021 1:49 pm
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…
ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…
అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…