Political News

మండలి ఛైర్మన్ ఈయనేనా ?

శాసనమండలి ఛైర్మన్ గా ఎవరిని నియమించాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ అయిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. మండలిలో గవర్నర్ కోటాలో భర్తీ చేయటానికి ఇప్పటికే ప్రభుత్వం నుండి నాలుగుపేర్లు గవర్నర్ పరిశీలనకు పంపినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటినుండి పదవుల భర్తీలో సామాజికవర్గాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్న జగన్ ఈ జాబితా విషయంలో కూడా సామాజిక న్యాయం పాటించినట్లు సమాచారం.

కడప జిల్లాలో బీసీ నేత రమేష్ యాదవ్, పశ్చిమగోదావరి జిల్లాలోని ఎస్సీ నేత కొయ్య మోషేన్ రాజు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు నేత తోట త్రిమూర్తులు, గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత లేళ్ళ అప్పిరెడ్డి పేర్లతో గవర్నర్ దగ్గరకు ఫైల్ వెళ్ళిందట. ఈరోజో లేకపోతే రేపో గవర్నర్ ఫైలును ఆమోదిస్తారని పార్టీ నేతలు చెప్పారు. కాబట్టి పై నలుగురు ఎంఎల్సీలైపోవటం ఖాయం.

సరే నలుగురు ఎంఎల్సీలైపోయారు బాగానే ఉంది. కానీ ఖాళీగా ఉన్న శాసనమండలి ఛైర్మన్ గా ఎవరిని నియమించబోతున్నారు ? ఇపుడిదే అంశం సస్పెన్సుగా మారింది. ఈమధ్యనే రిటైర్ అయిన మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ముస్లిం మైనారిటి నేత కాబట్టి తొందరలో జగన్ ఫైనల్ చేయబోయే ఛైర్మన్ కూడా ముస్లిం నేతే అవుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కొత్తగా ఎంపిక కాబోతున్న మోషేన్ రాజునే ఛైర్మన్ పదవి వరించబోతోందట. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేశారు. 2014లో టికెట్ కోసం ప్రయత్నించినా దక్కకపోవటంతో టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో చేరిన రెండు నెలలకే మళ్ళీ తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. మళ్ళీ 2019లో టికెట్ ఆశించి భంగపడినా పార్టీ అధికారంలోకి వస్తే ఎంఎల్సీ ఇస్తానన్న జగన్ హామీ దక్కింది.

దాంతో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు కష్టపడ్డారు. ఆ కష్టానికి ఇపుడు మోషేన్ ఫలితం అందుకోబోతున్నారట. ఎంఎల్సీతో పాటు మండలి ఛైర్మన్ కూడా మోషేన్ కే దక్కబోతోందని నేతలంటున్నారు. ఎలాగూ అసెంబ్లీ స్పీకర్ గా ఉత్తరాంధ్ర బీసీ నేత తమ్మినేని సీతారామ్ ఉన్నారు. కాబట్టి మండలి ఛైర్మన్ గా గోదావరి జిల్లా ఎస్సీకి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారని టాక్. మొత్తానికి మోషేన్ రాజు భలే లక్కీ అనే చెప్పుకోవాలి.

This post was last modified on June 12, 2021 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడేళ్ళలో పుష్ప 3 సాధ్యమేనా

ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్…

1 minute ago

బాహుబలి 1 రీ రిలీజ్ – రికార్డులు గల్లంతే

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం.…

5 minutes ago

సునీతా సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

44 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

2 hours ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

3 hours ago