కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూతబడిన స్కూళ్లను తిరిగి తెరిచేందుకు తెలంగాణ సర్కారు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని బావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని కూడా భావిస్తోందని అన్నారు. ఇక, ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు .. వచ్చే నెల 5వ తేదీ తర్వాత స్కూళ్లను ప్రారంభించేందుకు కేసీఆర్ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గత ఏడాది కూడా కరోనా ఫస్ట్ వేవ్ నేపథ్యంలో స్కూళ్లను పూర్తిగా బంద్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం.. పది, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్ క్లాసులు పెట్టినా.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు రావడంతో వాటిని కూడా ఆపుచేశారు. ఇక, తాజాగా ఇంటర్ రెండు సంవత్సరాలు, పదో తరగతి పరీక్షలను వరుసగా రెండో ఏడాది కూడా రద్దు చేసిన ప్రభుత్వం.. పరిస్థితి ఇలానే ఉంటే.. కష్టమని భావిస్తోంది. ఇదే అభిప్రాయం తల్లి దండ్రుల నుంచి వ్యక్తం అవుతున్నట్టు అధికారులు కూడా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా స్కూళ్లను ప్రారంభించకపోతే విద్యార్థుల భవితవ్యం ఇబ్బందుల్లోకి జారుతుందని భావించిన కేసీఆర్ సర్కార్.. ఈ నెల 16 నుంచి 8-ఇంటర్ వరకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. అదేసమయంలో వచ్చే నెల 5వ తేదీ నుంచి అన్ని పాఠశాలలను అన్ని తరగతులను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఈ స్కూళ్లను రోజు విడిచి రోజు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on June 10, 2021 5:16 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…