‘టీఆర్ఎస్ బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ వస్తానంటే పార్టీలోకి ఆహ్వానిస్తాం’ ..ఇది తాజాగా ఈటల గురించి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్య. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురి అర్హతతో తెలంగాణా రాజకీయ పార్టీ పెట్టాలని షర్మిల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. గడచిన ఐదుమాసాలుగా తెలంగాణా రాజకీయాల్లోకి ఇపుడే ఆమె అడుగుపెట్టారు. ఇంకా పార్టీ పెట్టలేదు, అజెండా ఏమిటో తెలేదు, కనీసం జెండా ఏమిటో కూడా ఎవరికీ తెలీదు.
ఇలాంటిది తొందరలో పెట్టబోయే పార్టీలోకి ఈటల రాజేందర్ చేరుతారని షర్మిల ఎలా అకున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. కేసులకు భయపడే ఈటల బీజేపీలో చేరుతున్నారా ? లేకపోతే భవిష్యత్ బాగుంటుందని అంచనా వేసుకునే కమలం కండువా కప్పుకుంటున్నారో కాలమే చెప్పాలి. అలాంటిది రాజేందర్ చేరుతానంటే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని షర్మిల చెప్పటమే కాస్త ఓవర్ గా అనిపిస్తోంది.
ఎప్పుడు ఏర్పాటవుతుందో తెలీని, ఏర్పాటైనా భవిష్యత్తు ఎలాగుంటుందో అంచనాలకు కూడా అందని షర్మిల పార్టీలో చేరి ఈటల ఏమి చేయాలి ? ఈటల రాజకీయ భవిష్యత్తు ఇపుడు ఇన్ స్టంట్ కాఫీ లాగ తయారైపోయింది. స్టౌవ్ మీద కాఫీ పెట్టి కాఫీపొడి+పాలు కలపగానే ఇన్ స్టంట్ కాఫీ అయిపోయినట్లు హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవాలనేది ప్రస్తుతం ఈటల అజెండాగా ఉంది.
రాజీనామా చేసిన తర్వాత ఉపఎన్నిక జరిగి పాజిటివ్ రిజల్టు రావాలంటే ఈటల అయితే కాంగ్రెస్ లో కానీ లేకపోతే బీజేపీలో కానీ చేరాల్సిందే అని డిసైడ్ అయ్యారు. పై రెండు పార్టీల్లో కూడా బీజేపీలో చేరితేనే భవిష్యత్ ఉపయోగాలుంటాయని భావించారు. అందుకనే బీజేపీ అగ్రనేతలను ఢిల్లీ కలిశారు. తక్షణ, దీర్ఘకాలిక రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే షర్మిల పెట్టబోయే పార్టీలో చేరితే జరిగేపనేనా ? కాబట్టి ఈటల తమతో చేయి కలపాలని షర్మిల అనుకోవటం అత్యాసగానే అనిపిస్తోంది.
This post was last modified on June 10, 2021 12:24 pm
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…
డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…