Political News

ఈటల విషయంలో సస్పెన్స్

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికపై సస్పెన్స్ మొదలైంది. రాజీనామా ద్వారా జరగబోయే ఉపఎన్నికలో ఈటలే పోటీచేస్తారా ? లేకపోతే ఆయన భార్య జమునారెడ్డి పోటీచేస్తారా అనే చర్చ మొదలైంది. ఎంఎల్ఏగా రాజీనామా చేయగానే బీజేపీలో చేరాలని ఈటల డిసైడ్ చేసుకున్నారు.

బీజేపీ అభ్యర్ధిగా ఈటల మాత్రమే పోటీ చేయాలని కమలంపార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారట. తనకు బదులుగా తన భార్య జమునను పోటీలోకి దింపితే ఉపయోగం ఉండదని బీజేపీ నేతలు ఇప్పటికే ఈటలకు స్పష్టంగా చెప్పారట. భార్యను ఉపఎన్నికలో పోటీ చేయించి గెలిపించుకునే ఆలోచనలో మాజీమంత్రి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి నియోజకవర్గంలో బీజేపీ బలం దాదాపు శూన్యమనే చెప్పాలి. ఈటల నిలబడినా, భార్య నిలబడినా సొంత బలం మీద గెలవాల్సిందే. బీజేపీ నుండి ఓట్ల సహకారం అందుతుందని ఈటల ఏమాత్రం ఆశించేందుకు లేదు. ఇలాంటి నేపధ్యంలో ఎవరు పోటీచేస్తే ఏమిటనేది ఈటల ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. అయితే తమ అభ్యర్ధిగా ఈటల పోటీచేస్తేనే ఊపుంటుందని అలాకాదని ఆయన భార్య పోటీచేస్తే ఇంత ఊపుండదనేది కమలనాదుల ఆలోచన.

ఇదే సమయంలో ఈటలను ఎలాగైనా ఓడించాలని కేసీయార్ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈటల ఇప్పటికప్పుడు రాజీనామా చేసినా ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేది ఎవరు చెప్పలేకున్నారు. మామూలుగా అయితే ఆరుమాసాల్లో ఉపఎన్నిక జరగాలి. కానీ ఇపుడు కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందుకనే అందరు ముందుగా ఈటల రాజీనామా తర్వాతే వ్యూహాలు బయటపెట్టాలని అనుకుంటున్నారు. మరి ఈ నేపధ్యంలో ఈటల ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.

This post was last modified on June 9, 2021 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

1 hour ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

2 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

2 hours ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

3 hours ago