Political News

ఈటల విషయంలో సస్పెన్స్

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికపై సస్పెన్స్ మొదలైంది. రాజీనామా ద్వారా జరగబోయే ఉపఎన్నికలో ఈటలే పోటీచేస్తారా ? లేకపోతే ఆయన భార్య జమునారెడ్డి పోటీచేస్తారా అనే చర్చ మొదలైంది. ఎంఎల్ఏగా రాజీనామా చేయగానే బీజేపీలో చేరాలని ఈటల డిసైడ్ చేసుకున్నారు.

బీజేపీ అభ్యర్ధిగా ఈటల మాత్రమే పోటీ చేయాలని కమలంపార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారట. తనకు బదులుగా తన భార్య జమునను పోటీలోకి దింపితే ఉపయోగం ఉండదని బీజేపీ నేతలు ఇప్పటికే ఈటలకు స్పష్టంగా చెప్పారట. భార్యను ఉపఎన్నికలో పోటీ చేయించి గెలిపించుకునే ఆలోచనలో మాజీమంత్రి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి నియోజకవర్గంలో బీజేపీ బలం దాదాపు శూన్యమనే చెప్పాలి. ఈటల నిలబడినా, భార్య నిలబడినా సొంత బలం మీద గెలవాల్సిందే. బీజేపీ నుండి ఓట్ల సహకారం అందుతుందని ఈటల ఏమాత్రం ఆశించేందుకు లేదు. ఇలాంటి నేపధ్యంలో ఎవరు పోటీచేస్తే ఏమిటనేది ఈటల ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. అయితే తమ అభ్యర్ధిగా ఈటల పోటీచేస్తేనే ఊపుంటుందని అలాకాదని ఆయన భార్య పోటీచేస్తే ఇంత ఊపుండదనేది కమలనాదుల ఆలోచన.

ఇదే సమయంలో ఈటలను ఎలాగైనా ఓడించాలని కేసీయార్ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈటల ఇప్పటికప్పుడు రాజీనామా చేసినా ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేది ఎవరు చెప్పలేకున్నారు. మామూలుగా అయితే ఆరుమాసాల్లో ఉపఎన్నిక జరగాలి. కానీ ఇపుడు కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందుకనే అందరు ముందుగా ఈటల రాజీనామా తర్వాతే వ్యూహాలు బయటపెట్టాలని అనుకుంటున్నారు. మరి ఈ నేపధ్యంలో ఈటల ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.

This post was last modified on June 9, 2021 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

4 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

6 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

35 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago