కరోనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల చూసినా దీని గురించే చర్చ. ఈ మహమ్మారి ధాటికి రోజూ వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దాదాపు 11 లక్షల మంది కరోనాతో పోరాడుతున్నారు. కొన్ని నెలల కిందటే బయటపడ్డ ఈ వైరస్కు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియను వివిధ దేశాలు చేపడుతున్నాయి.
ఐతే ఆ పరిశోధనలు పూర్తయి.. వ్యాక్సిన్ బయటికి రావడానికి చాలా సమయం పట్టేట్లుంది. ఈలోపు అందుబాటులో ఉన్న మందులతోనే వివిధ దేశాల వైద్యులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. చివరి దశలో ఉన్న పేషెంట్ల మీద కొన్ని రకాల మందులు, కాంబినేషన్లు ప్రయోగించి చూస్తున్నారు.
హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉన్నంతలో కొంచెం మెరుగ్గా కరోనా చికిత్సకు ఉపయోగపడుతోందని వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు దాన్ని మించి కరోనాపై ప్రభావవంతంగా పని చేసే మందును ఆస్ట్రేలియా వైద్యులు గుర్తించారు.
అందుబాటులో ఉన్న యాంటి-పారాస్టిక్ డ్రగ్ ‘ఐవర్మెక్టిన్’తో కోవిడ్-19ను ఎదుర్కోవచ్చని ఆస్ట్రేలియా వైద్యుల పరిశీలనతో తేలింది. హెచ్ఐవీ, జికా వైరస్, డెంగ్యూ, ఇన్ఫ్లూయెంజా వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఐవర్మెక్టిన్కు బాధితుని శరీరంలో నుంచి కరోనా వైరస్ క్రిములను పారదోలే శక్తి ఉందని ఆస్ట్రేలియాలో కొన్ని సంస్థలు కలిపి చేసిన స్టడీకి నేతృత్వం వహించిన డాక్టర్ కైలీ వాగ్స్టాఫ్ చెప్పారు.
ఐవర్మెక్టిన్ అనే ఔషధం ఎఫ్డీఏ అనుమతి పొందిన డ్రగ్. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న ఔషదం. ఎంతో సురక్షితమైన డ్రగ్ కూడా. పలు వైరల్ ఫీవర్లపై ఐవర్మెక్టిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించి మానవ శరీరంలో సెల్ సంస్కృతిలో పెరుగుతున్న కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవచ్చని మా పరిశోధనలో తేలింది.
‘‘ఈ మెడిసిన్ సింగిల్ డోస్ ద్వారా బాధితుని శరీరంలోని వైరల్ ఆర్ఎన్ఏను 48 గంటల్లో తొలగించవచ్చు. అంటే ఒక్క డోస్తో 24 గంటల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. కాబట్టి, అందుబాటులో ఉన్న ఈ మందుతో చికిత్స చేస్తే మంచిది. అయితే ల్యాబ్ దశలో విజయవంతం అయిన తమ పరీక్షలను మనుషులపై క్లినియల్ ట్రయల్స్ చేయాల్సి ఉంది’’ అని వాగ్స్టాఫ్ పేర్కొన్నారు.
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి…