కరోనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల చూసినా దీని గురించే చర్చ. ఈ మహమ్మారి ధాటికి రోజూ వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దాదాపు 11 లక్షల మంది కరోనాతో పోరాడుతున్నారు. కొన్ని నెలల కిందటే బయటపడ్డ ఈ వైరస్కు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియను వివిధ దేశాలు చేపడుతున్నాయి.
ఐతే ఆ పరిశోధనలు పూర్తయి.. వ్యాక్సిన్ బయటికి రావడానికి చాలా సమయం పట్టేట్లుంది. ఈలోపు అందుబాటులో ఉన్న మందులతోనే వివిధ దేశాల వైద్యులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. చివరి దశలో ఉన్న పేషెంట్ల మీద కొన్ని రకాల మందులు, కాంబినేషన్లు ప్రయోగించి చూస్తున్నారు.
హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉన్నంతలో కొంచెం మెరుగ్గా కరోనా చికిత్సకు ఉపయోగపడుతోందని వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు దాన్ని మించి కరోనాపై ప్రభావవంతంగా పని చేసే మందును ఆస్ట్రేలియా వైద్యులు గుర్తించారు.
అందుబాటులో ఉన్న యాంటి-పారాస్టిక్ డ్రగ్ ‘ఐవర్మెక్టిన్’తో కోవిడ్-19ను ఎదుర్కోవచ్చని ఆస్ట్రేలియా వైద్యుల పరిశీలనతో తేలింది. హెచ్ఐవీ, జికా వైరస్, డెంగ్యూ, ఇన్ఫ్లూయెంజా వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఐవర్మెక్టిన్కు బాధితుని శరీరంలో నుంచి కరోనా వైరస్ క్రిములను పారదోలే శక్తి ఉందని ఆస్ట్రేలియాలో కొన్ని సంస్థలు కలిపి చేసిన స్టడీకి నేతృత్వం వహించిన డాక్టర్ కైలీ వాగ్స్టాఫ్ చెప్పారు.
ఐవర్మెక్టిన్ అనే ఔషధం ఎఫ్డీఏ అనుమతి పొందిన డ్రగ్. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న ఔషదం. ఎంతో సురక్షితమైన డ్రగ్ కూడా. పలు వైరల్ ఫీవర్లపై ఐవర్మెక్టిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించి మానవ శరీరంలో సెల్ సంస్కృతిలో పెరుగుతున్న కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవచ్చని మా పరిశోధనలో తేలింది.
‘‘ఈ మెడిసిన్ సింగిల్ డోస్ ద్వారా బాధితుని శరీరంలోని వైరల్ ఆర్ఎన్ఏను 48 గంటల్లో తొలగించవచ్చు. అంటే ఒక్క డోస్తో 24 గంటల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. కాబట్టి, అందుబాటులో ఉన్న ఈ మందుతో చికిత్స చేస్తే మంచిది. అయితే ల్యాబ్ దశలో విజయవంతం అయిన తమ పరీక్షలను మనుషులపై క్లినియల్ ట్రయల్స్ చేయాల్సి ఉంది’’ అని వాగ్స్టాఫ్ పేర్కొన్నారు.
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…