Political News

కరోనా కేసులు – రికార్డు సృష్టించిన భారత్

మనది 130 కోట్ల జనాభా. చాలా తక్కువ కేసులే వస్తున్నాయిలే… అనుకుంటూ సర్దుకుంటున్న భారతీయులకు రోజురోజుకు కొత్త షాకులు తగులుతున్నాయి. ఈరోజు కనీవినీ ఎరుగుని స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

ఎక్కడో వేరే దేశంలో ఇన్ని కేసులు నమోదైతే ఆశ్చర్యపోయిన మనం… ఇపుడు మనదేశంలోనే అన్ని కేసులు నమోదవడం చూస్తున్నాం. గత 24 గంటల్లో సుమారు 5 వేల కేసులు (సరిగ్గా 4987) నమోదయ్యాయి. ఇది భారత్ లో ఇప్పటివరకు రికార్డు. ఒక్క రోజులో ఇన్ని కేసులు… అది కూడా లాక్ డౌన్ 4 భారీ సడలింపులు ఇస్తారనుకున్న రోజున రావడం భయం పుట్టిస్తోంది.

150 కోట్ల జనాభా ఉన్న చైనా లో నమోదైన కేసుల కంటే భారత్ లో నమోదైన కేసుల సంఖ్య చాలా ఎక్కువ. కాకపోతే మరణాలు చాలా తక్కువ ఉండటమే ఊరట. గత 24 గంటల్లో 124 మంది మరణించారు.

ఇతర దేశాల మరణాల శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. వీటితో కలిపి భారత్ లో మృతులు 2872కి చేరాయి. మొత్తం 34,109 మంది కోలుకోగా… 53946 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, కొత్త కేసులు గాని పాత కేసులు గాని ఎందులో చూసినా 3 రాష్ట్రాలదే ఈ లెక్కల్లో మెజారిటీ.

మహారాష్ట్రలో 30,706 కేసులు ఇప్పటివరకు నమోదు కాగా… గుజరాత్ (10988), తమిళనాడు (10585), ఢిల్లీ (9333) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంటే 65 శాతం కేసులు 4 రాష్ట్రాల నుంచే వచ్చాయి. కేసుల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నా మరణాల్లో మాత్రం చాలా దిగువన ఉంది. కేసుల్లో గాని, మరణాల్లో గాని మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

This post was last modified on May 17, 2020 1:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago