మనది 130 కోట్ల జనాభా. చాలా తక్కువ కేసులే వస్తున్నాయిలే… అనుకుంటూ సర్దుకుంటున్న భారతీయులకు రోజురోజుకు కొత్త షాకులు తగులుతున్నాయి. ఈరోజు కనీవినీ ఎరుగుని స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
ఎక్కడో వేరే దేశంలో ఇన్ని కేసులు నమోదైతే ఆశ్చర్యపోయిన మనం… ఇపుడు మనదేశంలోనే అన్ని కేసులు నమోదవడం చూస్తున్నాం. గత 24 గంటల్లో సుమారు 5 వేల కేసులు (సరిగ్గా 4987) నమోదయ్యాయి. ఇది భారత్ లో ఇప్పటివరకు రికార్డు. ఒక్క రోజులో ఇన్ని కేసులు… అది కూడా లాక్ డౌన్ 4 భారీ సడలింపులు ఇస్తారనుకున్న రోజున రావడం భయం పుట్టిస్తోంది.
150 కోట్ల జనాభా ఉన్న చైనా లో నమోదైన కేసుల కంటే భారత్ లో నమోదైన కేసుల సంఖ్య చాలా ఎక్కువ. కాకపోతే మరణాలు చాలా తక్కువ ఉండటమే ఊరట. గత 24 గంటల్లో 124 మంది మరణించారు.
ఇతర దేశాల మరణాల శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. వీటితో కలిపి భారత్ లో మృతులు 2872కి చేరాయి. మొత్తం 34,109 మంది కోలుకోగా… 53946 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, కొత్త కేసులు గాని పాత కేసులు గాని ఎందులో చూసినా 3 రాష్ట్రాలదే ఈ లెక్కల్లో మెజారిటీ.
మహారాష్ట్రలో 30,706 కేసులు ఇప్పటివరకు నమోదు కాగా… గుజరాత్ (10988), తమిళనాడు (10585), ఢిల్లీ (9333) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంటే 65 శాతం కేసులు 4 రాష్ట్రాల నుంచే వచ్చాయి. కేసుల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నా మరణాల్లో మాత్రం చాలా దిగువన ఉంది. కేసుల్లో గాని, మరణాల్లో గాని మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.
This post was last modified on May 17, 2020 1:24 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…