Political News

కరోనా కేసులు – రికార్డు సృష్టించిన భారత్

మనది 130 కోట్ల జనాభా. చాలా తక్కువ కేసులే వస్తున్నాయిలే… అనుకుంటూ సర్దుకుంటున్న భారతీయులకు రోజురోజుకు కొత్త షాకులు తగులుతున్నాయి. ఈరోజు కనీవినీ ఎరుగుని స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

ఎక్కడో వేరే దేశంలో ఇన్ని కేసులు నమోదైతే ఆశ్చర్యపోయిన మనం… ఇపుడు మనదేశంలోనే అన్ని కేసులు నమోదవడం చూస్తున్నాం. గత 24 గంటల్లో సుమారు 5 వేల కేసులు (సరిగ్గా 4987) నమోదయ్యాయి. ఇది భారత్ లో ఇప్పటివరకు రికార్డు. ఒక్క రోజులో ఇన్ని కేసులు… అది కూడా లాక్ డౌన్ 4 భారీ సడలింపులు ఇస్తారనుకున్న రోజున రావడం భయం పుట్టిస్తోంది.

150 కోట్ల జనాభా ఉన్న చైనా లో నమోదైన కేసుల కంటే భారత్ లో నమోదైన కేసుల సంఖ్య చాలా ఎక్కువ. కాకపోతే మరణాలు చాలా తక్కువ ఉండటమే ఊరట. గత 24 గంటల్లో 124 మంది మరణించారు.

ఇతర దేశాల మరణాల శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. వీటితో కలిపి భారత్ లో మృతులు 2872కి చేరాయి. మొత్తం 34,109 మంది కోలుకోగా… 53946 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, కొత్త కేసులు గాని పాత కేసులు గాని ఎందులో చూసినా 3 రాష్ట్రాలదే ఈ లెక్కల్లో మెజారిటీ.

మహారాష్ట్రలో 30,706 కేసులు ఇప్పటివరకు నమోదు కాగా… గుజరాత్ (10988), తమిళనాడు (10585), ఢిల్లీ (9333) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంటే 65 శాతం కేసులు 4 రాష్ట్రాల నుంచే వచ్చాయి. కేసుల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నా మరణాల్లో మాత్రం చాలా దిగువన ఉంది. కేసుల్లో గాని, మరణాల్లో గాని మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

This post was last modified on May 17, 2020 1:24 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

33 mins ago

గోదావరి తీరంలో ‘గ్యాంగ్’ సమరం

https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…

2 hours ago

జ‌గ‌న్ అతి విశ్వాసం.. గెలిపిస్తుందా?

విశ్వాసం ఉండడం త‌ప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు.…

3 hours ago

వాలెంటైన్ – ఫైటర్ కంటే ఇదే నయం

చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…

4 hours ago

జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…

4 hours ago

సుకుమార్ సుహాస్ ఇద్దరూ సేఫ్

యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…

5 hours ago