మనది 130 కోట్ల జనాభా. చాలా తక్కువ కేసులే వస్తున్నాయిలే… అనుకుంటూ సర్దుకుంటున్న భారతీయులకు రోజురోజుకు కొత్త షాకులు తగులుతున్నాయి. ఈరోజు కనీవినీ ఎరుగుని స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
ఎక్కడో వేరే దేశంలో ఇన్ని కేసులు నమోదైతే ఆశ్చర్యపోయిన మనం… ఇపుడు మనదేశంలోనే అన్ని కేసులు నమోదవడం చూస్తున్నాం. గత 24 గంటల్లో సుమారు 5 వేల కేసులు (సరిగ్గా 4987) నమోదయ్యాయి. ఇది భారత్ లో ఇప్పటివరకు రికార్డు. ఒక్క రోజులో ఇన్ని కేసులు… అది కూడా లాక్ డౌన్ 4 భారీ సడలింపులు ఇస్తారనుకున్న రోజున రావడం భయం పుట్టిస్తోంది.
150 కోట్ల జనాభా ఉన్న చైనా లో నమోదైన కేసుల కంటే భారత్ లో నమోదైన కేసుల సంఖ్య చాలా ఎక్కువ. కాకపోతే మరణాలు చాలా తక్కువ ఉండటమే ఊరట. గత 24 గంటల్లో 124 మంది మరణించారు.
ఇతర దేశాల మరణాల శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. వీటితో కలిపి భారత్ లో మృతులు 2872కి చేరాయి. మొత్తం 34,109 మంది కోలుకోగా… 53946 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, కొత్త కేసులు గాని పాత కేసులు గాని ఎందులో చూసినా 3 రాష్ట్రాలదే ఈ లెక్కల్లో మెజారిటీ.
మహారాష్ట్రలో 30,706 కేసులు ఇప్పటివరకు నమోదు కాగా… గుజరాత్ (10988), తమిళనాడు (10585), ఢిల్లీ (9333) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంటే 65 శాతం కేసులు 4 రాష్ట్రాల నుంచే వచ్చాయి. కేసుల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నా మరణాల్లో మాత్రం చాలా దిగువన ఉంది. కేసుల్లో గాని, మరణాల్లో గాని మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.
This post was last modified on May 17, 2020 1:24 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…