ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కొందరు నేతల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గత ఎన్నికలకు ముందు నెలకొన్న ఈ పరిస్తితి ఇప్పటికీ కొనసాగుతుండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానం గా టీడీపీ అనుబంధ తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విషయం పార్టీ నేతల మధ్య చర్చగా మారింది. 2014లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రభుత్వ టీచర్ అనిత. అప్పట్లో విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
తెలుగు దేశం పార్టీకి ఆది నుంచి మంచి పట్టున్న పాయకరావుపేట నుంచి అనిత విజయం దక్కించుకున్న ప్పటికీ..స్థానికంగా ఉన్న పార్టీ కేడర్ను కలుపుకొని పోవడంలో ఆమె విఫలమయ్యారు. దీంతో గత 2019 ఎన్నికల నాటికి ఆమెపై వ్యతిరేకత వచ్చింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు బదిలీ చేశారు. ఇక్కడ ఆమె ఓడి పోయారు. వలస నేత అనే ముద్ర కూడా పడిపోయింది. దీంతో మళ్లీ.. అనధికారికంగానే ఆమె.. పాయకరావు పేట నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. అనితకు.. తెలుగు మహిళ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. దీంతో అనిత కొంత పుంజుకున్నారు. ఇటీవల మరణించిన డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం వేధించిన తీరుపై ఆమె హైకోర్టులో కేసు వేశారు. రాజధాని మహిళలపై పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తూ.. హైకోర్టుకెక్కారు. అదేవిధంగా తాజా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, ప్రభుత్వ ఉదాశీన వైఖరిని ప్రశ్నిస్తూ.. నిర్వహించి న వెబినార్ను కూడా అనిత సక్సెస్ చేశారు.
అయితే.. ఇంతగా అనిత పుంజుకున్నా.. నియోజకవర్గం విషయానికి వచ్చే సరికి మాత్రం మైనస్ మార్కులే కనిపిస్తున్నాయని అంటున్నారు టీడీపీ సీనియర్లు. పాయకరావుపేట నియోజకవర్గం నుంచి వచ్చే 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని అనిత భావిస్తున్నారు. అయితే.. ఇక్కడ మాత్రం ఆమెకు సానుకూల పవనాలు కనిపించడం లేదు. ఆమెను గత ఎన్నికల సమయంలో వ్యతిరేకించిన నాయకులే ఇప్పటికీ.. ఇక్కడ చక్రం తిప్పుతున్నారు.
ఈ నేపథ్యంలో అనిత.. రచ్చ గెలిచినా.. ఇంట గెలవలేక పోతున్నారని.. నియోజకవ ర్గంలోనూ తనకు అనుకూలమైన రాజకీయాలు ఏర్పడేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. సీనియర్లు అంటున్నారు. మరి అనిత ఏం చేస్తారో చూడాలి. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. పాయకరావుపేట నియోజకవర్గం విషయంలో అనితకు బాధ్యతలు అప్పగించే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ తేల్చకపోవడం గమనార్హం.
This post was last modified on June 8, 2021 9:40 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…