గత కొద్దికాలంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి విషయంలో తుది నిర్ణయం జరిగిపోయిందా? పీసీసీ అధ్యక్ష పదవి రేసులో తుది దశ వరకు పేరు వినిపిస్తున్న రేవంత్ రెడ్డి పేరును పార్టీ పెద్దలు ఖరారు చేసేశారా? ఇక ప్రకటనే మిగిలిందా? అంటే అవునంటున్నారు ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పరిణామాలు గమనిస్తున్న వారు. ఒకట్రెండు రోజుల్లోనే పీసీసీ రథసారథి ప్రకటన రావచ్చునని చెప్తున్నారు.
తెలంగాణ పీసీసీ రథసారథి కసరత్తు దాదాపు ఆరు నెలలుగా సాగుతోంది! పీసీసీ చీఫ్ ఎంపిక కోసం రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ రాష్ట్రంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. గాంధీభవన్లో మూడ్రోజులపాటు కసరత్తు చేసి నియర్లు, కోర్ కమిటీ మెంబర్లు, నియోజకవర్గ ఇన్చార్జిలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలు స్వీకరించారు. వచ్చిన పేర్లలో కొన్నింటిని హైకమాండ్ కు పంపారు. ఐదారుగురి పేర్లను పెద్దల పరిశీలనకు పంపినట్లు అప్పట్లో ఆయనే చెప్పారు. చివరి వడపోతలో జీవన్ రెడ్డి, రేవంత్రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరికి పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఇదే సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రావడం , అక్కడి నుంచి పోటీ చేస్తున్న సీనియర్ నేత జానారెడ్డి.. పీసీసీ ప్రెసిడెంట్ ఎంపికను ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని హైకమాండ్కు లెటర్ రాయడంతో బ్రేక్ పడింది.
తాజాగా గత నాలుగైదు రోజుల నుంచి రేవంత్ రెడ్డికే పీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందని పార్టీలో ప్రచారం ఊపందుకుంది. దాంతో మరోసారి పార్టీలో నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. రేవంత్ను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి.. రెండు రోజుల క్రితం తానూ పీసీసీ రేసులో ఉన్నట్లు మీడియాకు తెలిపారు. రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన తనకు ఫోన్ లో బెదిరింపులు వస్తున్నాయని సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. ఈ వ్యవహారం ఇలా నడస్తుండగానే రేవంత్కు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు ఢిల్లీకి ఫోన్లు చేస్తున్నారు. ఈ గొడవతో విసిగిపోయిన కొందరు లీడర్లు.. ఎవరో ఒకరికి పదవి అనౌన్స్ చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని హైకమాండ్ను కోరుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కునే రేవంత్ రెడ్డికే పీసీసీ పదవి అంటూ వైరల్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే ఒకట్రెండు రోజులు వేచి చూడాల్సిందే.
This post was last modified on June 6, 2021 7:52 am
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…