దేశమంతా కరోనా భయంలో ఉండగా..

ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరి దృష్టి కరోనా వైరస్ మీదే ఉంది. ఇండియాలో అంతకంతకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం.. మున్ముందు మరింత విపత్కర పరిస్థితులు తలెత్తుతాయన్న అంచనాల నేపథ్యంలో వ్యవస్థలన్నీ ఆ మహమ్మారిని నిలువరించే పనిలోనే నిమగ్నమయ్యాయి. ప్రధాన మంత్రి సహా మంత్రి వర్గం అంతా దీని మీదే దృష్టిసారించింది. సైన్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొంతమంది సిబ్బందిని విధుల నుంచి దూరం పెట్టారు.

ఇలాంటి సమయంలో ఇండియా మీద దాడి చేయడం తేలికని భావించిన ఉగ్రవాదులు నియంత్రణ రేఖను దాటి ఇండియాలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. కశ్మీర్లో గడిచిన 24 గంటల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి.

ఆదివారం ఉదయం కెరాన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమైనట్లు వెల్లడైంది. ఈ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరులను గుర్తించిన సైనికులు వెంటనే కాల్పులు జరిపారు. ఆ ఐదుగురూ హతమైనట్లు నిర్ధరించారు.

ఐతే ఎదురు కాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. మరోవైపు దక్షిణ కశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు పౌరులు మృతి చెందడంతో.. సైన్యం ఆపరేషన్ చేపట్టింది. బత్ పురా వద్ద శనివారం రాత్రి నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది.

నియంత్రణ రేఖ సమీపంలో మరింతమంది ముష్కరులు దాగి ఉన్నారన్న అనుమానాలతో అక్కడ కూంబింగ్ చేపడుతోంది సైన్యం. ఉగ్ర ముప్పును దృష్టిలో ఉంచుకుని సెలవు ఇచ్చిన సైనికులందరినీ తిరిగి విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం.

This post was last modified on April 9, 2020 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

49 minutes ago

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి…

51 minutes ago

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…

2 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…

2 hours ago

పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. గురువారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల…

2 hours ago

అఖండ తాండవానికి మరో ఎదురుదెబ్బ

న‌ట‌సింహం బాల‌య్య హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన అఖండ్‌-2 సినిమాల‌కు బాలారిష్టాలు తీర‌డం లేదు. ఈ నెల తొలి…

2 hours ago