Political News

మోడికి ఘాటు లేఖలు రాస్తున్న సీఎంలు

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను ముఖ్యమంత్రులందరు తప్పు పడుతున్నారు. ఒకవైపు టీకా కార్యక్రమాన్ని తప్పుపడుతు సుప్రింకోర్టు వాయించేస్తోంది. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తప్పుపడుతూ మోడికి లేఖలు రాయటం గమనార్హం. మొన్నటికి మొన్న కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్ ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా టీకాల కార్యక్రమంపై మోడి విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతూ లేఖ రాశారు.

ఇప్పటికే ఇదే విషయమై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మోడి విధానాలను తప్పుపడుతూ లేఖలు రాశారు. వీళ్ళందరు మోడికి లేఖలు రాయటంలో ఆశ్చర్యమేమీ లేదుకానీ ఒడిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ లేఖ రాయటమే కాస్త ఆశ్చర్యపరిచే విషయం.

మోడి ప్రధాని అయినదగ్గర నుండి ఏదో రూపంలో మోడిపై చాలామంది ముఖ్యమంత్రులు రుసరుసలాడుతునే ఉన్నారు. కేజ్రీవాల్, మమత ఇప్పటికే చాలాసార్లు మోడికి అనేక అంశాలపై లేఖలు రాయటం అందరికీ తెలిసిందే. ఎవరు మోడిని తప్పుపట్టినా వ్యాక్సినేషన్ కార్యక్రమమే కీలక అంశంగా మారింది. అయితే మిగిలిన సీఎంలు ఒకఎత్తతయితే ఒడిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ మాత్రం మరోఎత్తనే చెప్పాలి.

ఎందుకంటే పట్నాయక్ ఏ విషయంలో కూడా వివాదాలకు దూరంగా ఉంటాడు. ఇటు కేంద్రంతో కానీ అటు సహచర ముఖ్యమంత్రులతో కూడా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా తన పనేదో తాను చేసుకువెళుతుంటారు. కేంద్రంతో ఎంతపెద్ద సమస్య వచ్చినా వీలైనంతలో సామరస్యపూర్వకంగానే పరిష్కరించుకునేందుకు చూస్తారు. అలాంటిది టీకాల కార్యక్రమాన్ని తప్పుపడుతూ మోడికి పెద్ద లేఖ రాశారు. అలాగే అదే లేఖను ఇతర ముఖ్యమంత్రులకు షేర్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

మోడి విధానాలను ఒకవైపు సుప్రింకోర్టు, మరోవైపు ముఖ్యమంత్రులు తప్పుపడుతున్నారు. మరి తన విధానాలను మోడి మార్చుకుంటారా ? ముఖ్యమంత్రులు చెప్పారని కాకపోయినా కనీసం సుప్రింకోర్టు చెప్పినందుకైనా మార్చుకోక తప్పదుకదా. సుప్రింకోర్టు చెప్పిన తర్వాత కూడా మార్చుకోకపోతే జనాలే మార్చేస్తారు.

This post was last modified on June 4, 2021 2:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

22 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

52 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

1 hour ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago