లాక్ డౌన్ సెప్టెంబర్ వరకునా? మీకో దండం సామి!

భారత్‌లో ఏప్రిల్ 14 దాకా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే 72 మంది ప్రాణాలు కోల్పోగా 2300లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దేశంలో కేసులు పెరుగుతున్నప్పటికీ దేశంలో లాక్ డౌన్ దాదాపు ఏప్రిల్ 14న ముగుస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు లాక్ డౌన్ ఆంక్షలు సెప్టెంబర్ మాసం దాకా పొడగించే అవకాశం ఉందని జనాలను భయపెడుతున్నాయి.

అమెరికాకు చెందిన బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ అధ్యయనం ప్రకారం భారత్‌లో విధించిన లాక్ డౌన్ జూన్ నాలుగో వారంలో గానీ లేదా సెప్టెంబర్ రెండో వారంలో గానీ ఎత్తివేయొచ్చని అంచనా వేసింది. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో జరిగిన ప్రాణ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని భారత్ ఈ లాక్ డౌన్ ఆంక్షలను అప్పటిదాకా పొడగిస్తుందని అభిప్రాయపడింది ఈ సంస్థ. అయితే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఈ రిపోర్ట్స్‌ను నమ్మాల్సిన అవసరం లేదని అంటున్నారు భారతీయ ఎపిడమాలజిస్టులు.

కరోనా కేసులు పెరుగుతున్నా, మిగిలినదేశాలతో పోలిస్తే మన దగ్గర ఆ రేటు చాలా తక్కువ. దాంతో ఏప్రిల్ 15న లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయకపోయినా కూడా, మరీ సెప్టెంబర్ వరకు పొగిడించాల్సిన అవసరం అయితే రాదంటున్నారు. కాకపోతే ఒకేసారి ఆంక్షలు పూర్తిగా తొలగిస్తే జనాలు గుంపులుగా రోడ్లమీదకి చేరతారు. కాబట్టి దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే దిశగా ఆలోచన చేస్తారేమో. అసలు లాక్ డౌన్ గురించి ఇలాంటి వార్తలను చూసి భయపడవద్దని హామీ ఇస్తున్నారు అధికారులు.

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

4 mins ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

1 hour ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

2 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

3 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

3 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

4 hours ago