దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగా జరగడంలేదనే సంతృప్తి చాలా మందిలో ఉంది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపించడంతో పాటు.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. దీంతో.. సుప్రీం కోర్టు సీరియస్ కావడంతో.. కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది.
వ్యాక్సిన్లను పెంచేలా చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ బయోలాజికల్ -ఈ కి వ్యాక్సిన్ల కోసం రూ. 1500 కోట్లు అందించేందుకు అంగీకారం తెలిపింది. యూఎస్లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో బయోలాజికల్- ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది.
ఇప్పటికే ఈ వ్యాక్సిన్ మొదటి, రెండు దశల ప్రయోగాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయింది. మూడో దశ ప్రయోగాల కోసం గత ఏప్రిల్లోనే సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతి కూడా వచ్చింది. దీంతో భారత్లో ఈ టీకా ఉత్పత్తి చేసేందుకు తమకు అడ్వాన్సుగా రూ. 1500 కోట్లు ఇవ్వాలని బయోలాజికిల్ -ఈ సంస్థ కోరింది.
ఆగస్టు- డిసెంబర్ కల్లా 30 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని తెలిపింది. దీంతో కేంద్రం ఆ 30 కోట్ల డోసుల వ్యాక్సిన్లను రిజర్వ్ చేయడానికి ముందస్తు చెల్లింపు చేసేందుకు ముందుకొచ్చింది. బయోలాజికల్- ఈ రూపొందిస్తున్న టీకాలో RBD ప్రోటీన్ సబ్-యూనిట్ సమ్మేళనంతో కూడి పదార్థం ఉంటుందని సమాచారం.
This post was last modified on June 3, 2021 3:24 pm
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…
చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…