Political News

విజయసాయిరెడ్డి చెప్పిన జూలై 23 ముహూర్తం

ఆమధ్య వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ పెట్టారు. చంద్రబాబునాయుడును ఉద్దేశించి ట్వీట్ పెట్టినా జూలై 23వ తేదీన ఏమి జరగబోతోందో చూడమంటు సస్పెన్సులో పడేశారు విజయసాయిరెడ్డి. అయితే విశాఖపట్నంలో ఆయన చేసిన ప్రకటన చూసిన తర్వాత జూలై 23వ తేదీకి వైజాగ్ పాలనా రాజధానిగా మారబోతోందా ? అనే సందేహాలు మొదలయ్యాయి.

విజయసాయిరెడ్డి చెప్పిన జూలై 23 ముహూర్తం రోజున అమరావతి నుండి పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి మారిపోతుందేమో అనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఎందుకంటే తొందరలోనే పరిపాలనా రాజధాని అమరావతి నుండి వైజాగ్ కు మారిపోతోందని ఎంపి తాజాగా ప్రకటించారు. సీఆర్డీఏ చట్టంపై కోర్టుల్లో విచారణకు రాజధాని తరలింపుకు సంబంధమే లేదని తేల్చేశారు.

ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధానిగా ఉంటుందని ఎంపి స్పష్టంచేశారు. గతంలో చంద్రబాబునాయుడు కూడా హైదరాబాద్ లో కూర్చునే పరిపాలించిన విషయాన్ని గుర్తుచేశారు. సో విజయసాయి తాజా ప్రకటన చూస్తుంటే తొందరలోనే పరిపాలనా రాజధాని విశాఖకు మారిపోవటం తథ్యమన్న విషయం అర్ధమైపోతోంది. ఇందుకోసమే వైజాగ్ లో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయట.

రుషికొండ, భీమిలీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, రెసిడెన్స్ తో పాటు మంత్రుల క్యాంపు కార్యాలయాలు, సచివాలయం ఏర్పాటు తదితరాలకు అవసరమైన భవనాలను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఆఫీసులు, రెసిడెన్స్ భవనాలు అవసరానికి మించే ఉన్నాయని కాకపోతే వాటిని కాస్త అవసరాలకు తగ్గట్లు సర్దుబాటు చేసుకుంటే సరిపోతుందని అధికారయంత్రాంగం భావించిందట. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవసరమైనట్లుగా వాస్తు తదితర మార్పులు చేర్పులు చేసిన వెంటనే అమరావతి టు వైజాగ్ వచ్చేయటమే మిగిలిందని అనిపిస్తోంది.

This post was last modified on June 3, 2021 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

52 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago