ఆమధ్య వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ పెట్టారు. చంద్రబాబునాయుడును ఉద్దేశించి ట్వీట్ పెట్టినా జూలై 23వ తేదీన ఏమి జరగబోతోందో చూడమంటు సస్పెన్సులో పడేశారు విజయసాయిరెడ్డి. అయితే విశాఖపట్నంలో ఆయన చేసిన ప్రకటన చూసిన తర్వాత జూలై 23వ తేదీకి వైజాగ్ పాలనా రాజధానిగా మారబోతోందా ? అనే సందేహాలు మొదలయ్యాయి.
విజయసాయిరెడ్డి చెప్పిన జూలై 23 ముహూర్తం రోజున అమరావతి నుండి పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి మారిపోతుందేమో అనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఎందుకంటే తొందరలోనే పరిపాలనా రాజధాని అమరావతి నుండి వైజాగ్ కు మారిపోతోందని ఎంపి తాజాగా ప్రకటించారు. సీఆర్డీఏ చట్టంపై కోర్టుల్లో విచారణకు రాజధాని తరలింపుకు సంబంధమే లేదని తేల్చేశారు.
ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధానిగా ఉంటుందని ఎంపి స్పష్టంచేశారు. గతంలో చంద్రబాబునాయుడు కూడా హైదరాబాద్ లో కూర్చునే పరిపాలించిన విషయాన్ని గుర్తుచేశారు. సో విజయసాయి తాజా ప్రకటన చూస్తుంటే తొందరలోనే పరిపాలనా రాజధాని విశాఖకు మారిపోవటం తథ్యమన్న విషయం అర్ధమైపోతోంది. ఇందుకోసమే వైజాగ్ లో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయట.
రుషికొండ, భీమిలీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, రెసిడెన్స్ తో పాటు మంత్రుల క్యాంపు కార్యాలయాలు, సచివాలయం ఏర్పాటు తదితరాలకు అవసరమైన భవనాలను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఆఫీసులు, రెసిడెన్స్ భవనాలు అవసరానికి మించే ఉన్నాయని కాకపోతే వాటిని కాస్త అవసరాలకు తగ్గట్లు సర్దుబాటు చేసుకుంటే సరిపోతుందని అధికారయంత్రాంగం భావించిందట. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవసరమైనట్లుగా వాస్తు తదితర మార్పులు చేర్పులు చేసిన వెంటనే అమరావతి టు వైజాగ్ వచ్చేయటమే మిగిలిందని అనిపిస్తోంది.
This post was last modified on June 3, 2021 2:50 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…