Political News

విజయసాయిరెడ్డి చెప్పిన జూలై 23 ముహూర్తం

ఆమధ్య వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ పెట్టారు. చంద్రబాబునాయుడును ఉద్దేశించి ట్వీట్ పెట్టినా జూలై 23వ తేదీన ఏమి జరగబోతోందో చూడమంటు సస్పెన్సులో పడేశారు విజయసాయిరెడ్డి. అయితే విశాఖపట్నంలో ఆయన చేసిన ప్రకటన చూసిన తర్వాత జూలై 23వ తేదీకి వైజాగ్ పాలనా రాజధానిగా మారబోతోందా ? అనే సందేహాలు మొదలయ్యాయి.

విజయసాయిరెడ్డి చెప్పిన జూలై 23 ముహూర్తం రోజున అమరావతి నుండి పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి మారిపోతుందేమో అనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఎందుకంటే తొందరలోనే పరిపాలనా రాజధాని అమరావతి నుండి వైజాగ్ కు మారిపోతోందని ఎంపి తాజాగా ప్రకటించారు. సీఆర్డీఏ చట్టంపై కోర్టుల్లో విచారణకు రాజధాని తరలింపుకు సంబంధమే లేదని తేల్చేశారు.

ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధానిగా ఉంటుందని ఎంపి స్పష్టంచేశారు. గతంలో చంద్రబాబునాయుడు కూడా హైదరాబాద్ లో కూర్చునే పరిపాలించిన విషయాన్ని గుర్తుచేశారు. సో విజయసాయి తాజా ప్రకటన చూస్తుంటే తొందరలోనే పరిపాలనా రాజధాని విశాఖకు మారిపోవటం తథ్యమన్న విషయం అర్ధమైపోతోంది. ఇందుకోసమే వైజాగ్ లో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయట.

రుషికొండ, భీమిలీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, రెసిడెన్స్ తో పాటు మంత్రుల క్యాంపు కార్యాలయాలు, సచివాలయం ఏర్పాటు తదితరాలకు అవసరమైన భవనాలను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఆఫీసులు, రెసిడెన్స్ భవనాలు అవసరానికి మించే ఉన్నాయని కాకపోతే వాటిని కాస్త అవసరాలకు తగ్గట్లు సర్దుబాటు చేసుకుంటే సరిపోతుందని అధికారయంత్రాంగం భావించిందట. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవసరమైనట్లుగా వాస్తు తదితర మార్పులు చేర్పులు చేసిన వెంటనే అమరావతి టు వైజాగ్ వచ్చేయటమే మిగిలిందని అనిపిస్తోంది.

This post was last modified on June 3, 2021 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్నగారికి కొత్త డేట్?

డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…

8 minutes ago

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…

24 minutes ago

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…

41 minutes ago

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

2 hours ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

5 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

7 hours ago