వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఎదురెదురు పడటం అప్పుడప్పుడే జరుగుతుంది. ఇలాంటివేళ.. వారి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందన్న ఆసక్తి అక్కడున్న వారిలో కనిపిస్తోంది. ఇప్పుడు నడుస్తోన్నది కరోనా కాలం. ఎవరో కొద్దిమంది తప్పించి మిగిలిన ప్రముఖులంతా ఇళ్లకో.. ఫాంహౌస్ లకు పరిమితమవుతున్నారు. ఎంతో అవసరం ఉంటే తప్పించి బయటకు వెళ్లటం లేదు. ఇదిలా ఉంటే.. కష్టంలో ఉన్నామంటే చాలు.. వెంటనే స్పందించే సినీ నటుడు సోనూ సూద్.. కరోనా సెకండ్ వేవ్ లో తన ట్విటర్ ఖాతా ద్వారా తనను సాయం చేయమని కోరే వారందరికి సాయం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లు సోషల్ మీడియాలో కాసేపు మాట్లాడుకున్నారు.
వీరి సంభాషణ నెటిజన్లకు విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఒకరినొకరు పరస్పర గౌరవ మర్యాదలతో మాట్లాడుకున్నారు. ఆ సందర్భంగా పొగుడుకున్నారు. నిజానికి ఈ విషయాల్ని మీడియాలో వచ్చినవే. కాకుంటే.. కొన్ని విషయాలు మాత్రం రాలేదు. అందులో ఆసక్తికరమైన అంశం.. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ ను కలవాలని ఉందని సోనూ అడిగితే.. తప్పకుండా తాను కూడా కలవాలని అనుకుంటున్న మాటను కేటీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా తాను ముంబయి నుంచి ఫుడ్ తీసుకొస్తానని.. తనకు హైదరాబాద్ బిర్యానీ సిద్ధం చేసి ఉంచాలని సోనూ సూద్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. వీరి సంభాషణను ఆసక్తిగా ఫాలో అయిన ఒక నెటిజన్ అనూహ్యమైన కోరికను కోరాడు. కేటీఆర్ – సోనూసూద్ కలిసిన సందర్భంలో తనకు ఫోటో షూట్ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అండగా నిలుస్తున్న ఇద్దరు రియల్ హీరోస్ కు ఫోటోషూట్ చేస్తానని కోరాడు. మరి.. ఆ కుర్రాడి కోరికను కేటీఆర్ మన్నిస్తారా?
This post was last modified on June 3, 2021 7:43 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…