వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఎదురెదురు పడటం అప్పుడప్పుడే జరుగుతుంది. ఇలాంటివేళ.. వారి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందన్న ఆసక్తి అక్కడున్న వారిలో కనిపిస్తోంది. ఇప్పుడు నడుస్తోన్నది కరోనా కాలం. ఎవరో కొద్దిమంది తప్పించి మిగిలిన ప్రముఖులంతా ఇళ్లకో.. ఫాంహౌస్ లకు పరిమితమవుతున్నారు. ఎంతో అవసరం ఉంటే తప్పించి బయటకు వెళ్లటం లేదు. ఇదిలా ఉంటే.. కష్టంలో ఉన్నామంటే చాలు.. వెంటనే స్పందించే సినీ నటుడు సోనూ సూద్.. కరోనా సెకండ్ వేవ్ లో తన ట్విటర్ ఖాతా ద్వారా తనను సాయం చేయమని కోరే వారందరికి సాయం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లు సోషల్ మీడియాలో కాసేపు మాట్లాడుకున్నారు.
వీరి సంభాషణ నెటిజన్లకు విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఒకరినొకరు పరస్పర గౌరవ మర్యాదలతో మాట్లాడుకున్నారు. ఆ సందర్భంగా పొగుడుకున్నారు. నిజానికి ఈ విషయాల్ని మీడియాలో వచ్చినవే. కాకుంటే.. కొన్ని విషయాలు మాత్రం రాలేదు. అందులో ఆసక్తికరమైన అంశం.. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ ను కలవాలని ఉందని సోనూ అడిగితే.. తప్పకుండా తాను కూడా కలవాలని అనుకుంటున్న మాటను కేటీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా తాను ముంబయి నుంచి ఫుడ్ తీసుకొస్తానని.. తనకు హైదరాబాద్ బిర్యానీ సిద్ధం చేసి ఉంచాలని సోనూ సూద్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. వీరి సంభాషణను ఆసక్తిగా ఫాలో అయిన ఒక నెటిజన్ అనూహ్యమైన కోరికను కోరాడు. కేటీఆర్ – సోనూసూద్ కలిసిన సందర్భంలో తనకు ఫోటో షూట్ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అండగా నిలుస్తున్న ఇద్దరు రియల్ హీరోస్ కు ఫోటోషూట్ చేస్తానని కోరాడు. మరి.. ఆ కుర్రాడి కోరికను కేటీఆర్ మన్నిస్తారా?
This post was last modified on June 3, 2021 7:43 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…