వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఎదురెదురు పడటం అప్పుడప్పుడే జరుగుతుంది. ఇలాంటివేళ.. వారి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందన్న ఆసక్తి అక్కడున్న వారిలో కనిపిస్తోంది. ఇప్పుడు నడుస్తోన్నది కరోనా కాలం. ఎవరో కొద్దిమంది తప్పించి మిగిలిన ప్రముఖులంతా ఇళ్లకో.. ఫాంహౌస్ లకు పరిమితమవుతున్నారు. ఎంతో అవసరం ఉంటే తప్పించి బయటకు వెళ్లటం లేదు. ఇదిలా ఉంటే.. కష్టంలో ఉన్నామంటే చాలు.. వెంటనే స్పందించే సినీ నటుడు సోనూ సూద్.. కరోనా సెకండ్ వేవ్ లో తన ట్విటర్ ఖాతా ద్వారా తనను సాయం చేయమని కోరే వారందరికి సాయం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లు సోషల్ మీడియాలో కాసేపు మాట్లాడుకున్నారు.
వీరి సంభాషణ నెటిజన్లకు విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఒకరినొకరు పరస్పర గౌరవ మర్యాదలతో మాట్లాడుకున్నారు. ఆ సందర్భంగా పొగుడుకున్నారు. నిజానికి ఈ విషయాల్ని మీడియాలో వచ్చినవే. కాకుంటే.. కొన్ని విషయాలు మాత్రం రాలేదు. అందులో ఆసక్తికరమైన అంశం.. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ ను కలవాలని ఉందని సోనూ అడిగితే.. తప్పకుండా తాను కూడా కలవాలని అనుకుంటున్న మాటను కేటీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా తాను ముంబయి నుంచి ఫుడ్ తీసుకొస్తానని.. తనకు హైదరాబాద్ బిర్యానీ సిద్ధం చేసి ఉంచాలని సోనూ సూద్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. వీరి సంభాషణను ఆసక్తిగా ఫాలో అయిన ఒక నెటిజన్ అనూహ్యమైన కోరికను కోరాడు. కేటీఆర్ – సోనూసూద్ కలిసిన సందర్భంలో తనకు ఫోటో షూట్ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అండగా నిలుస్తున్న ఇద్దరు రియల్ హీరోస్ కు ఫోటోషూట్ చేస్తానని కోరాడు. మరి.. ఆ కుర్రాడి కోరికను కేటీఆర్ మన్నిస్తారా?
This post was last modified on June 3, 2021 7:43 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…