వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఎదురెదురు పడటం అప్పుడప్పుడే జరుగుతుంది. ఇలాంటివేళ.. వారి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందన్న ఆసక్తి అక్కడున్న వారిలో కనిపిస్తోంది. ఇప్పుడు నడుస్తోన్నది కరోనా కాలం. ఎవరో కొద్దిమంది తప్పించి మిగిలిన ప్రముఖులంతా ఇళ్లకో.. ఫాంహౌస్ లకు పరిమితమవుతున్నారు. ఎంతో అవసరం ఉంటే తప్పించి బయటకు వెళ్లటం లేదు. ఇదిలా ఉంటే.. కష్టంలో ఉన్నామంటే చాలు.. వెంటనే స్పందించే సినీ నటుడు సోనూ సూద్.. కరోనా సెకండ్ వేవ్ లో తన ట్విటర్ ఖాతా ద్వారా తనను సాయం చేయమని కోరే వారందరికి సాయం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లు సోషల్ మీడియాలో కాసేపు మాట్లాడుకున్నారు.
వీరి సంభాషణ నెటిజన్లకు విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఒకరినొకరు పరస్పర గౌరవ మర్యాదలతో మాట్లాడుకున్నారు. ఆ సందర్భంగా పొగుడుకున్నారు. నిజానికి ఈ విషయాల్ని మీడియాలో వచ్చినవే. కాకుంటే.. కొన్ని విషయాలు మాత్రం రాలేదు. అందులో ఆసక్తికరమైన అంశం.. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ ను కలవాలని ఉందని సోనూ అడిగితే.. తప్పకుండా తాను కూడా కలవాలని అనుకుంటున్న మాటను కేటీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా తాను ముంబయి నుంచి ఫుడ్ తీసుకొస్తానని.. తనకు హైదరాబాద్ బిర్యానీ సిద్ధం చేసి ఉంచాలని సోనూ సూద్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. వీరి సంభాషణను ఆసక్తిగా ఫాలో అయిన ఒక నెటిజన్ అనూహ్యమైన కోరికను కోరాడు. కేటీఆర్ – సోనూసూద్ కలిసిన సందర్భంలో తనకు ఫోటో షూట్ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అండగా నిలుస్తున్న ఇద్దరు రియల్ హీరోస్ కు ఫోటోషూట్ చేస్తానని కోరాడు. మరి.. ఆ కుర్రాడి కోరికను కేటీఆర్ మన్నిస్తారా?
This post was last modified on June 3, 2021 7:43 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…