Political News

ఈటల ప్లేస్ కోసం దొంత రమేష్ ప్రయత్నాలు..?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ షాకింగ్ కి గురిచేశాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆరోపణలు రావడం.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్ తో ఈటలకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పార్టీ మొదటి నుంచి ఉన్న ఆయన అలా సడెన్ గా పార్టీకి దూరమవ్వడం సొంత పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోయారు.

ఇక తాజాగా ఆయన కమలం గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత నడ్డాతో భేటీ కూడా అయ్యారు. ఇలాంటి సమయంలో.. టీఆర్ఎస్ లో ఈటల స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న.. ప్రశ్నగానే మిగిలింది. అయితే.. ఈ ప్రశ్నకు సమాధానంగా మారేందుకు ఆ పార్టీకి చెందిన దొంతు రమేష్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

పార్టీ అధిష్టానం సైతం.. దొంత రమేష్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సీఎం కెసిఆర్ ను హుజురాబాద్ ప్రాంతానికి చెందిన తెరాస నాయకుడు దొంత రమేష్ నిన్న ప్రగతి భవన్ లో కలిశారు. ఇతనితోపాటు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ కూడా ఉన్నారు. ఇటీవల దొంత రమేష్ కెసిఆర్ తో వరుసగా భేటీ అవుతున్నారు.

అంతేకాకుండా..హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలను దొంత రమేష్ ముఖ్యమంత్రికి ఎప్పటికపుడు అందిస్తున్నారు అని సమాచారం. కాబట్టి హుజురాబాద్ లో నెక్స్ట్ ఎవరంటే.. దొంతు రమేష్ అని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. దీనిని బట్టి.. దొంత రమేష్ కి కీలక బాధ్యతలు అప్పగించినట్లే అనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే.. కొద్ది రోజులు ఎదురుచూడక తప్పదు.

Satya

Recent Posts

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

3 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

4 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

34 minutes ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

38 minutes ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago

ఇంత అహంకారమెందుకు అంబటి

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…

2 hours ago