Political News

ఈటల ప్లేస్ కోసం దొంత రమేష్ ప్రయత్నాలు..?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ షాకింగ్ కి గురిచేశాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆరోపణలు రావడం.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్ తో ఈటలకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పార్టీ మొదటి నుంచి ఉన్న ఆయన అలా సడెన్ గా పార్టీకి దూరమవ్వడం సొంత పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోయారు.

ఇక తాజాగా ఆయన కమలం గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత నడ్డాతో భేటీ కూడా అయ్యారు. ఇలాంటి సమయంలో.. టీఆర్ఎస్ లో ఈటల స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న.. ప్రశ్నగానే మిగిలింది. అయితే.. ఈ ప్రశ్నకు సమాధానంగా మారేందుకు ఆ పార్టీకి చెందిన దొంతు రమేష్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

పార్టీ అధిష్టానం సైతం.. దొంత రమేష్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సీఎం కెసిఆర్ ను హుజురాబాద్ ప్రాంతానికి చెందిన తెరాస నాయకుడు దొంత రమేష్ నిన్న ప్రగతి భవన్ లో కలిశారు. ఇతనితోపాటు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ కూడా ఉన్నారు. ఇటీవల దొంత రమేష్ కెసిఆర్ తో వరుసగా భేటీ అవుతున్నారు.

అంతేకాకుండా..హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలను దొంత రమేష్ ముఖ్యమంత్రికి ఎప్పటికపుడు అందిస్తున్నారు అని సమాచారం. కాబట్టి హుజురాబాద్ లో నెక్స్ట్ ఎవరంటే.. దొంతు రమేష్ అని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. దీనిని బట్టి.. దొంత రమేష్ కి కీలక బాధ్యతలు అప్పగించినట్లే అనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే.. కొద్ది రోజులు ఎదురుచూడక తప్పదు.

This post was last modified on June 2, 2021 6:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశ్వక్ అర్థం చేసుకున్న ట్రెండ్ నిజమేనా

నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…

23 minutes ago

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

1 hour ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

2 hours ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

2 hours ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

2 hours ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

3 hours ago