Political News

ఈటల నిర్ణయం సరైనదేనా ?

మాజీమంత్రి ఈటల రాజేందర్ నిర్ణయం సరైనదేనా ? ఇపుడిదే ప్రశ్నపై జనాల్లో చర్చ మొదలైంది. మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన టీఆర్ఎస్ ఎంఎల్ఏ తొందరలో బీజేపీలో చేరబోతున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను కలిసి చర్చలు జరిపారు. కాబట్టి కమలం కండువాను కప్పుకోవటం ఇక లాంఛనమనే అనిపిస్తోంది. ముందుగా రాష్ట్రంలో కమలం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ముఖ్యనేతలతో భేటీ అయిన ఈటలకు పార్టీలో చేరటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాంతో నేరుగా ఢిల్లీకి వెళ్ళి నడ్డాతో కూడా భేటీ అయ్యారు.

సరే ఏ పార్టీలో చేరాలనేది ఈటల ఇష్టమే. అయినా ప్రస్తుత రాజకీయ పరిస్ధితులను గమనిస్తే బీజేపీలో చేరటం సరైన నిర్ణయం కాదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తెలంగాణాలో బీజేపీకి నిజంగా అంత సీనేమీలేదు. ఏదో గాలి వచ్చినపుడు ఓ నాలుగు సీట్లు గెలవటం తప్పించి స్ధిరమైన ఓటు బ్యాంకు, కచ్చితంగా గెలుస్తుందని చెప్పుకునేంత సీన్ లేదన్నది వాస్తవం.

పైగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రతను నియంత్రించటంలో నరేంద్రమోడి ఘోరంగా ఫెయిలయ్యారు. దాని ప్రభావం డైరెక్టుగా జనాలమీదే పడుతోంది. కరోనాతో లక్షల సంఖ్యలో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. టీకాల కార్యక్రమం, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాలో కూడా మోడి దారుణంగా విఫలమయ్యారు. మోడి ఫెయిల్యూర్ ప్రభావం యావత్ దేశంపై తీవ్రంగా కనబడుతోంది. ఈ కారణంగానే మోడిపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోతోంది.

బెంగాల్ ఎన్నికల్లోనే కాకుండా ఉత్తరప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో కూడా బీజేపీ దారుణంగా ఓడిపోయింది. అంటే యావత్ దేశంలో మోడి గ్రాఫ్ పడిపోతున్న సమయంలో ఈటల బీజేపీలో చేరటం అంత తెలివైన నిర్ణయం కాదేమో అనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మరి మోడి, బీజేపీ విషయాన్ని ఈటల ఆలోచించకుండానే ఉంటారా ? అనేది ఇంకో సందేహం. నిజంగానే మోడి గ్రాఫ్ పడిపోతున్న సమయంలో తెలంగాణాలో ఎన్నికలు జరిగితే ఈటెల పరిస్ధితేంటో ?

This post was last modified on June 1, 2021 12:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

4 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

6 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

35 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago