మాజీమంత్రి ఈటల రాజేందర్ నిర్ణయం సరైనదేనా ? ఇపుడిదే ప్రశ్నపై జనాల్లో చర్చ మొదలైంది. మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన టీఆర్ఎస్ ఎంఎల్ఏ తొందరలో బీజేపీలో చేరబోతున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను కలిసి చర్చలు జరిపారు. కాబట్టి కమలం కండువాను కప్పుకోవటం ఇక లాంఛనమనే అనిపిస్తోంది. ముందుగా రాష్ట్రంలో కమలం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ముఖ్యనేతలతో భేటీ అయిన ఈటలకు పార్టీలో చేరటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాంతో నేరుగా ఢిల్లీకి వెళ్ళి నడ్డాతో కూడా భేటీ అయ్యారు.
సరే ఏ పార్టీలో చేరాలనేది ఈటల ఇష్టమే. అయినా ప్రస్తుత రాజకీయ పరిస్ధితులను గమనిస్తే బీజేపీలో చేరటం సరైన నిర్ణయం కాదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తెలంగాణాలో బీజేపీకి నిజంగా అంత సీనేమీలేదు. ఏదో గాలి వచ్చినపుడు ఓ నాలుగు సీట్లు గెలవటం తప్పించి స్ధిరమైన ఓటు బ్యాంకు, కచ్చితంగా గెలుస్తుందని చెప్పుకునేంత సీన్ లేదన్నది వాస్తవం.
పైగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రతను నియంత్రించటంలో నరేంద్రమోడి ఘోరంగా ఫెయిలయ్యారు. దాని ప్రభావం డైరెక్టుగా జనాలమీదే పడుతోంది. కరోనాతో లక్షల సంఖ్యలో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. టీకాల కార్యక్రమం, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాలో కూడా మోడి దారుణంగా విఫలమయ్యారు. మోడి ఫెయిల్యూర్ ప్రభావం యావత్ దేశంపై తీవ్రంగా కనబడుతోంది. ఈ కారణంగానే మోడిపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోతోంది.
బెంగాల్ ఎన్నికల్లోనే కాకుండా ఉత్తరప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో కూడా బీజేపీ దారుణంగా ఓడిపోయింది. అంటే యావత్ దేశంలో మోడి గ్రాఫ్ పడిపోతున్న సమయంలో ఈటల బీజేపీలో చేరటం అంత తెలివైన నిర్ణయం కాదేమో అనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మరి మోడి, బీజేపీ విషయాన్ని ఈటల ఆలోచించకుండానే ఉంటారా ? అనేది ఇంకో సందేహం. నిజంగానే మోడి గ్రాఫ్ పడిపోతున్న సమయంలో తెలంగాణాలో ఎన్నికలు జరిగితే ఈటెల పరిస్ధితేంటో ?
This post was last modified on June 1, 2021 12:31 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…