మాజీమంత్రి ఈటల రాజేందర్ నిర్ణయం సరైనదేనా ? ఇపుడిదే ప్రశ్నపై జనాల్లో చర్చ మొదలైంది. మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన టీఆర్ఎస్ ఎంఎల్ఏ తొందరలో బీజేపీలో చేరబోతున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను కలిసి చర్చలు జరిపారు. కాబట్టి కమలం కండువాను కప్పుకోవటం ఇక లాంఛనమనే అనిపిస్తోంది. ముందుగా రాష్ట్రంలో కమలం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ముఖ్యనేతలతో భేటీ అయిన ఈటలకు పార్టీలో చేరటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాంతో నేరుగా ఢిల్లీకి వెళ్ళి నడ్డాతో కూడా భేటీ అయ్యారు.
సరే ఏ పార్టీలో చేరాలనేది ఈటల ఇష్టమే. అయినా ప్రస్తుత రాజకీయ పరిస్ధితులను గమనిస్తే బీజేపీలో చేరటం సరైన నిర్ణయం కాదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తెలంగాణాలో బీజేపీకి నిజంగా అంత సీనేమీలేదు. ఏదో గాలి వచ్చినపుడు ఓ నాలుగు సీట్లు గెలవటం తప్పించి స్ధిరమైన ఓటు బ్యాంకు, కచ్చితంగా గెలుస్తుందని చెప్పుకునేంత సీన్ లేదన్నది వాస్తవం.
పైగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రతను నియంత్రించటంలో నరేంద్రమోడి ఘోరంగా ఫెయిలయ్యారు. దాని ప్రభావం డైరెక్టుగా జనాలమీదే పడుతోంది. కరోనాతో లక్షల సంఖ్యలో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. టీకాల కార్యక్రమం, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాలో కూడా మోడి దారుణంగా విఫలమయ్యారు. మోడి ఫెయిల్యూర్ ప్రభావం యావత్ దేశంపై తీవ్రంగా కనబడుతోంది. ఈ కారణంగానే మోడిపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోతోంది.
బెంగాల్ ఎన్నికల్లోనే కాకుండా ఉత్తరప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో కూడా బీజేపీ దారుణంగా ఓడిపోయింది. అంటే యావత్ దేశంలో మోడి గ్రాఫ్ పడిపోతున్న సమయంలో ఈటల బీజేపీలో చేరటం అంత తెలివైన నిర్ణయం కాదేమో అనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మరి మోడి, బీజేపీ విషయాన్ని ఈటల ఆలోచించకుండానే ఉంటారా ? అనేది ఇంకో సందేహం. నిజంగానే మోడి గ్రాఫ్ పడిపోతున్న సమయంలో తెలంగాణాలో ఎన్నికలు జరిగితే ఈటెల పరిస్ధితేంటో ?
This post was last modified on June 1, 2021 12:31 pm
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…