Political News

ఒకరు కాదు.. ముగ్గురు ‘ముద్దు’ అంటున్న చైనా..!

ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది అనగానే.. ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది చైనా. ఆ దేశంలో జనాభా చాలా ఎక్కువ. ఆ జనాభాని కంట్రోల్ చేయడానికి ఆ దేశం.. అప్పట్లో ఓ సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. ‘ ఒకరే ముద్దు.. లేక అసలే వద్దు’ ఇది ఆ దేశ సిద్ధాంతం. ఈ రూల్ ని చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. చైనాలో ఎవరైనా జంట రెండో సంతానం కావాలి అంటే.. ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. కేవలం కవలలు పుడితే మాత్రమే.. ఇద్దరు పిల్లలను ఒకే చేసేవారు. ఒకటి కన్నా ఎక్కువ కాన్పులకు అసలు ఒప్పుకున్నదే లేదు.

అలాంటిది.. తాజాగా చైనా ఈ విధానంలో మార్పు తీసుకువచ్చింది. ఇప్పుడు ముగ్గురు పిల్ల‌ల్ని క‌నేందుకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ పాల‌సీలో చైనా కీల‌క మార్పులు చేసింది. ఒక జంట గ‌రిష్టంగా ముగ్గురిని క‌నేందుకు వీలుగా మార్పులు చేసింది.

1970వ సంవ‌త్స‌రం నుండి 2016 వ‌ర‌కు చైనాలో ఒకే సంతానం అన్న విధానం అమ‌లైంది. జనాభా పెర‌గ‌కుండా ఉండేందుకు తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని 2016లో స‌వ‌రించి… ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌నేందుకు అనుమ‌తి ఇచ్చారు. తాజాగా ముగ్గురికి పెంచారు. ఇత‌ర దేశాల్లో యువ‌త జ‌నాభా ఎక్కువ‌గా ఉండ‌గా… చైనాలో మాత్రం వృద్ధ జ‌నాభా పెరుగుతూ వ‌స్తుంది. దీంతో ప్ర‌భుత్వం మార్పులు చేసింది.

అయితే, ఏక సంతానానికి అల‌వాటు ప‌డ్డ చైనా ప్ర‌జ‌లు… 2016లో ప్ర‌భుత్వం ఇద్ద‌రికి అనుమ‌తి ఇచ్చినా పెద్ద‌గా రిజ‌ల్ట్ క‌న‌ప‌డ‌లేదు. తాజాగా ముగ్గ‌రు సంతానం నిర్ణ‌యం తీసుకున్నారు. 2020, నవంబ‌ర్ 1 నాటికి చైనా జ‌నాభా 141.78కోట్లు.

This post was last modified on June 1, 2021 9:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

2 minutes ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

32 minutes ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

33 minutes ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

1 hour ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

2 hours ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

3 hours ago