Political News

ఒకరు కాదు.. ముగ్గురు ‘ముద్దు’ అంటున్న చైనా..!

ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది అనగానే.. ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది చైనా. ఆ దేశంలో జనాభా చాలా ఎక్కువ. ఆ జనాభాని కంట్రోల్ చేయడానికి ఆ దేశం.. అప్పట్లో ఓ సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. ‘ ఒకరే ముద్దు.. లేక అసలే వద్దు’ ఇది ఆ దేశ సిద్ధాంతం. ఈ రూల్ ని చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. చైనాలో ఎవరైనా జంట రెండో సంతానం కావాలి అంటే.. ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. కేవలం కవలలు పుడితే మాత్రమే.. ఇద్దరు పిల్లలను ఒకే చేసేవారు. ఒకటి కన్నా ఎక్కువ కాన్పులకు అసలు ఒప్పుకున్నదే లేదు.

అలాంటిది.. తాజాగా చైనా ఈ విధానంలో మార్పు తీసుకువచ్చింది. ఇప్పుడు ముగ్గురు పిల్ల‌ల్ని క‌నేందుకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ పాల‌సీలో చైనా కీల‌క మార్పులు చేసింది. ఒక జంట గ‌రిష్టంగా ముగ్గురిని క‌నేందుకు వీలుగా మార్పులు చేసింది.

1970వ సంవ‌త్స‌రం నుండి 2016 వ‌ర‌కు చైనాలో ఒకే సంతానం అన్న విధానం అమ‌లైంది. జనాభా పెర‌గ‌కుండా ఉండేందుకు తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని 2016లో స‌వ‌రించి… ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌నేందుకు అనుమ‌తి ఇచ్చారు. తాజాగా ముగ్గురికి పెంచారు. ఇత‌ర దేశాల్లో యువ‌త జ‌నాభా ఎక్కువ‌గా ఉండ‌గా… చైనాలో మాత్రం వృద్ధ జ‌నాభా పెరుగుతూ వ‌స్తుంది. దీంతో ప్ర‌భుత్వం మార్పులు చేసింది.

అయితే, ఏక సంతానానికి అల‌వాటు ప‌డ్డ చైనా ప్ర‌జ‌లు… 2016లో ప్ర‌భుత్వం ఇద్ద‌రికి అనుమ‌తి ఇచ్చినా పెద్ద‌గా రిజ‌ల్ట్ క‌న‌ప‌డ‌లేదు. తాజాగా ముగ్గ‌రు సంతానం నిర్ణ‌యం తీసుకున్నారు. 2020, నవంబ‌ర్ 1 నాటికి చైనా జ‌నాభా 141.78కోట్లు.

This post was last modified on June 1, 2021 9:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌ఘురామ కస్టడీ కేసు: అటు సస్పెన్షన్.. ఇటు అరెస్ట్!

వైసీపీ హ‌యాంలో అప్పటి ఆ పార్టీ న‌ర‌సాపురం ఎంపీ, ప్ర‌స్తుత అసెంబ్లీ ఉప‌స‌భాప‌తి రఘురామ‌కృష్ణ రాజును అక్ర‌మంగా అరెస్టు చేసి..…

29 minutes ago

వద్దే వద్దంటున్న అజిత్ ఫ్యాన్స్

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్‌కు వీరం, వేదాళం, విశ్వాసం చిత్రాలతో మరపురాని విజయాలు అందించాడు దర్శకుడు శివ. తమిళంలో…

2 hours ago

జననాగయన్… విజయ్ కీలక నిర్ణయం?

అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. తమిళ టాప్ స్టార్ విజయ్ చివరి చిత్రం ‘జననాగయన్’ విడుదలై ఆరు వారాలు…

2 hours ago

కల్తీ పాల మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం

రాజమండ్రిలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ లో కల్తీ పాలు తాగి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా…

3 hours ago

బలవంత్ బిజినెస్ వర్కౌట్ అయ్యిందా

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ప్రమోషన్ల పరంగా బాగా హడావిడి చేసింది హే బలవంత్ ఒక్కటే. మిగిలినవి కూడా పబ్లిసిటీ…

3 hours ago

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…

5 hours ago