ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది అనగానే.. ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది చైనా. ఆ దేశంలో జనాభా చాలా ఎక్కువ. ఆ జనాభాని కంట్రోల్ చేయడానికి ఆ దేశం.. అప్పట్లో ఓ సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. ‘ ఒకరే ముద్దు.. లేక అసలే వద్దు’ ఇది ఆ దేశ సిద్ధాంతం. ఈ రూల్ ని చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. చైనాలో ఎవరైనా జంట రెండో సంతానం కావాలి అంటే.. ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. కేవలం కవలలు పుడితే మాత్రమే.. ఇద్దరు పిల్లలను ఒకే చేసేవారు. ఒకటి కన్నా ఎక్కువ కాన్పులకు అసలు ఒప్పుకున్నదే లేదు.
అలాంటిది.. తాజాగా చైనా ఈ విధానంలో మార్పు తీసుకువచ్చింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో చైనా కీలక మార్పులు చేసింది. ఒక జంట గరిష్టంగా ముగ్గురిని కనేందుకు వీలుగా మార్పులు చేసింది.
1970వ సంవత్సరం నుండి 2016 వరకు చైనాలో ఒకే సంతానం అన్న విధానం అమలైంది. జనాభా పెరగకుండా ఉండేందుకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని 2016లో సవరించి… ఇద్దరు పిల్లల్ని కనేందుకు అనుమతి ఇచ్చారు. తాజాగా ముగ్గురికి పెంచారు. ఇతర దేశాల్లో యువత జనాభా ఎక్కువగా ఉండగా… చైనాలో మాత్రం వృద్ధ జనాభా పెరుగుతూ వస్తుంది. దీంతో ప్రభుత్వం మార్పులు చేసింది.
అయితే, ఏక సంతానానికి అలవాటు పడ్డ చైనా ప్రజలు… 2016లో ప్రభుత్వం ఇద్దరికి అనుమతి ఇచ్చినా పెద్దగా రిజల్ట్ కనపడలేదు. తాజాగా ముగ్గరు సంతానం నిర్ణయం తీసుకున్నారు. 2020, నవంబర్ 1 నాటికి చైనా జనాభా 141.78కోట్లు.
This post was last modified on June 1, 2021 9:23 am
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…