ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది అనగానే.. ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది చైనా. ఆ దేశంలో జనాభా చాలా ఎక్కువ. ఆ జనాభాని కంట్రోల్ చేయడానికి ఆ దేశం.. అప్పట్లో ఓ సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. ‘ ఒకరే ముద్దు.. లేక అసలే వద్దు’ ఇది ఆ దేశ సిద్ధాంతం. ఈ రూల్ ని చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. చైనాలో ఎవరైనా జంట రెండో సంతానం కావాలి అంటే.. ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. కేవలం కవలలు పుడితే మాత్రమే.. ఇద్దరు పిల్లలను ఒకే చేసేవారు. ఒకటి కన్నా ఎక్కువ కాన్పులకు అసలు ఒప్పుకున్నదే లేదు.
అలాంటిది.. తాజాగా చైనా ఈ విధానంలో మార్పు తీసుకువచ్చింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో చైనా కీలక మార్పులు చేసింది. ఒక జంట గరిష్టంగా ముగ్గురిని కనేందుకు వీలుగా మార్పులు చేసింది.
1970వ సంవత్సరం నుండి 2016 వరకు చైనాలో ఒకే సంతానం అన్న విధానం అమలైంది. జనాభా పెరగకుండా ఉండేందుకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని 2016లో సవరించి… ఇద్దరు పిల్లల్ని కనేందుకు అనుమతి ఇచ్చారు. తాజాగా ముగ్గురికి పెంచారు. ఇతర దేశాల్లో యువత జనాభా ఎక్కువగా ఉండగా… చైనాలో మాత్రం వృద్ధ జనాభా పెరుగుతూ వస్తుంది. దీంతో ప్రభుత్వం మార్పులు చేసింది.
అయితే, ఏక సంతానానికి అలవాటు పడ్డ చైనా ప్రజలు… 2016లో ప్రభుత్వం ఇద్దరికి అనుమతి ఇచ్చినా పెద్దగా రిజల్ట్ కనపడలేదు. తాజాగా ముగ్గరు సంతానం నిర్ణయం తీసుకున్నారు. 2020, నవంబర్ 1 నాటికి చైనా జనాభా 141.78కోట్లు.
This post was last modified on June 1, 2021 9:23 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…