తమిళనాడు రాజకీయాల్లోకి తొందరలోనే శశికళ అలియాస్ చిన్నమ్మ రీఎంట్రీ ఉండబోతోందట. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు బెంగుళూరు జైల్లో శిక్ష అనుభివించిన చిన్నమ్మ ఎన్నికలకు ముందు తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమెను దురదృష్టం వెన్నాడటంతో ఎన్నికల్లో సైలెంట్ అయిపోవాల్సొచ్చింది. దాంతో దివంగత ముఖ్యమంత్రి నెచ్చెలిగా పాపులరైన శశికళ ప్రమేయం లేకుండానే ఎన్నికలు పూర్తయిపోయాయి.
డీఎంకే కూటమి సాధించిన ఘన విజయంతో ఎంకే స్టాలిన్ సీఎం అయ్యారు. అయితే అందరు అనుకున్నట్లు ఏఐఏడీఎంకే కూటమి సీట్ల వేటలో మరీ వెనకబడిపోలేదు. 74 సీట్లలో గెలిచి గట్టి ప్రతిపక్షంగానే నిలబడింది. అయితే ప్రధానప్రతిపక్షంలోని ఇద్దరు కీలక నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఎన్నికలైన తర్వాత విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఏఐఏడీఎంకే పగ్గాలు అందుకోవటానికి చిన్నమ్మ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకనే పార్టీలోని కొందరు ముఖ్యనేతలు, ఎంఎల్ఏలతో శశికళ టచ్ లో ఉన్నారట. శశికళకు మూడు అంశాలు అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మొదటిది పార్టీ ప్రతిపక్షంలో ఉండటం. రెండోది పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు జనాకర్షణ లేకపోవటం.
ఇక మూడోది ఏమిటంటే జైలు జీవితం గడిపిన చిన్నమ్మ ఆరేళ్ళు పోటీచేసేందుకు లేదు. ఐదేళ్ళు ఎలాగూ ప్రతిపక్షంలో సరిపోతుంది. మహాఉంటే మరో ఏడాది ఓపికిపడితే సీఎం కుర్చీలో మళ్ళీ తానే కూర్చునే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నారట. అంటే వచ్చే ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అధికారంలోకి వస్తేనే లేండి. ఇలాంటి విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే శశికళ తొందరలోనే రంగంలోకి దూకబోతున్నట్లు ప్రచారం పెరుగుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on May 31, 2021 12:01 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…