Political News

తొందరలోనే చిన్నమ్మ రీ ఎంట్రీ

తమిళనాడు రాజకీయాల్లోకి తొందరలోనే శశికళ అలియాస్ చిన్నమ్మ రీఎంట్రీ ఉండబోతోందట. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు బెంగుళూరు జైల్లో శిక్ష అనుభివించిన చిన్నమ్మ ఎన్నికలకు ముందు తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమెను దురదృష్టం వెన్నాడటంతో ఎన్నికల్లో సైలెంట్ అయిపోవాల్సొచ్చింది. దాంతో దివంగత ముఖ్యమంత్రి నెచ్చెలిగా పాపులరైన శశికళ ప్రమేయం లేకుండానే ఎన్నికలు పూర్తయిపోయాయి.

డీఎంకే కూటమి సాధించిన ఘన విజయంతో ఎంకే స్టాలిన్ సీఎం అయ్యారు. అయితే అందరు అనుకున్నట్లు ఏఐఏడీఎంకే కూటమి సీట్ల వేటలో మరీ వెనకబడిపోలేదు. 74 సీట్లలో గెలిచి గట్టి ప్రతిపక్షంగానే నిలబడింది. అయితే ప్రధానప్రతిపక్షంలోని ఇద్దరు కీలక నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఎన్నికలైన తర్వాత విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.

తమిళనాడులో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఏఐఏడీఎంకే పగ్గాలు అందుకోవటానికి చిన్నమ్మ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకనే పార్టీలోని కొందరు ముఖ్యనేతలు, ఎంఎల్ఏలతో శశికళ టచ్ లో ఉన్నారట. శశికళకు మూడు అంశాలు అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మొదటిది పార్టీ ప్రతిపక్షంలో ఉండటం. రెండోది పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు జనాకర్షణ లేకపోవటం.

ఇక మూడోది ఏమిటంటే జైలు జీవితం గడిపిన చిన్నమ్మ ఆరేళ్ళు పోటీచేసేందుకు లేదు. ఐదేళ్ళు ఎలాగూ ప్రతిపక్షంలో సరిపోతుంది. మహాఉంటే మరో ఏడాది ఓపికిపడితే సీఎం కుర్చీలో మళ్ళీ తానే కూర్చునే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నారట. అంటే వచ్చే ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అధికారంలోకి వస్తేనే లేండి. ఇలాంటి విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే శశికళ తొందరలోనే రంగంలోకి దూకబోతున్నట్లు ప్రచారం పెరుగుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on May 31, 2021 12:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

29 minutes ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

1 hour ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

1 hour ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

2 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

3 hours ago

వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…

3 hours ago