రెండు రోజుల డిజిటల్ మహానాడులో నేతల మధ్య జరిగిన సంభాషణల్లో ఓ విషయం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే చాలావర్గాలు తెలుగుదేశంపార్టీకి దూరమైపోయాయనే విషయం. దూరమైపోయిన సామాజికవర్గాలను మళ్ళీ దగ్గరకు తీసుకోవటం ఎలాగ అనే అంశంపై చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.
ఇదే విషయమై సోమిరెడ్డి మాట్లాడుతు టీడీపీకి క్రిస్తియన్, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజికవర్గాలు దూరమైపోయిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి అండగా నిలబడిన ఎస్టీలు, ముస్లింలు దూరమైపోవటం వల్ల చాలా నష్టం జరిగిందని సోమిరెడ్డి స్పష్టంగా చెప్పారు. కాబట్టి దూరమైపోయిన వర్గాలను దగ్గరకు తీసుకోవాలంటే వాళ్ళని ఆదరించాలనే తీర్మానం చేయాలని సోమిరెడ్డి పట్టుబట్టారు. అయితే అందుకు చంద్రబాబు, యనమల అంగీకరించలేదు. పై కులాలకు టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయాలేదని ఒప్పుకున్నట్లవుతుందని యనమల వాదించారు.
ప్రత్యేకంగా పై సామాజికవర్గాలను కలుపుకుని వెళ్ళాలనే తీర్మానం పెడితే తమంతట తాముగానే పై వర్గాలను దూరం చేసుకున్నట్లవుతుందని గట్టిగా వాధించారు. మహానాడులో తీర్మానం చేయటంకన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్లోకి చూపిస్తేనే బాగుంటుందని చంద్రబాబు మాటకు యనమల మద్దతిచ్చారు. ఇదే సమయంలో సోమిరెడ్డి మాట్లాడుతూ దూరమైన వర్గాలను మళ్ళీ దగ్గరకు తీసుకోవాలంటే ఏదో ఒక తీర్మానం చేయకపోతే వాళ్ళల్లో నమ్మకం ఎలా కలుగుతుందని లేవనెత్తిన సందేహానికి ఎవరు సమాధానం చెప్పలేదు.
మొత్తంమీద మహానాడు వేదికగా పార్టీకి దూరమైన సామాజికవర్గాల విషయంలో వాస్తవాలు మాట్లడుకున్నారనే అనుకోవాలి. ఏ ఏ వర్గాలు టీడీపీకి దూరమైపోయాయనే విషయంలో సోమిరెడ్డి లెక్కను యనమల బలపరిచారు. రాయలసీమ, తెలంగాణాలో రెడ్లంతా టీడీపీకి దూరమైపోయారని సోమిరెడ్డి చెప్పినపుడు చంద్రబాబు, యనమల ఏమీ మాట్లాడలేదు.
This post was last modified on May 31, 2021 6:55 am
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…