రెండు రోజుల డిజిటల్ మహానాడులో నేతల మధ్య జరిగిన సంభాషణల్లో ఓ విషయం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే చాలావర్గాలు తెలుగుదేశంపార్టీకి దూరమైపోయాయనే విషయం. దూరమైపోయిన సామాజికవర్గాలను మళ్ళీ దగ్గరకు తీసుకోవటం ఎలాగ అనే అంశంపై చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.
ఇదే విషయమై సోమిరెడ్డి మాట్లాడుతు టీడీపీకి క్రిస్తియన్, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజికవర్గాలు దూరమైపోయిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి అండగా నిలబడిన ఎస్టీలు, ముస్లింలు దూరమైపోవటం వల్ల చాలా నష్టం జరిగిందని సోమిరెడ్డి స్పష్టంగా చెప్పారు. కాబట్టి దూరమైపోయిన వర్గాలను దగ్గరకు తీసుకోవాలంటే వాళ్ళని ఆదరించాలనే తీర్మానం చేయాలని సోమిరెడ్డి పట్టుబట్టారు. అయితే అందుకు చంద్రబాబు, యనమల అంగీకరించలేదు. పై కులాలకు టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయాలేదని ఒప్పుకున్నట్లవుతుందని యనమల వాదించారు.
ప్రత్యేకంగా పై సామాజికవర్గాలను కలుపుకుని వెళ్ళాలనే తీర్మానం పెడితే తమంతట తాముగానే పై వర్గాలను దూరం చేసుకున్నట్లవుతుందని గట్టిగా వాధించారు. మహానాడులో తీర్మానం చేయటంకన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్లోకి చూపిస్తేనే బాగుంటుందని చంద్రబాబు మాటకు యనమల మద్దతిచ్చారు. ఇదే సమయంలో సోమిరెడ్డి మాట్లాడుతూ దూరమైన వర్గాలను మళ్ళీ దగ్గరకు తీసుకోవాలంటే ఏదో ఒక తీర్మానం చేయకపోతే వాళ్ళల్లో నమ్మకం ఎలా కలుగుతుందని లేవనెత్తిన సందేహానికి ఎవరు సమాధానం చెప్పలేదు.
మొత్తంమీద మహానాడు వేదికగా పార్టీకి దూరమైన సామాజికవర్గాల విషయంలో వాస్తవాలు మాట్లడుకున్నారనే అనుకోవాలి. ఏ ఏ వర్గాలు టీడీపీకి దూరమైపోయాయనే విషయంలో సోమిరెడ్డి లెక్కను యనమల బలపరిచారు. రాయలసీమ, తెలంగాణాలో రెడ్లంతా టీడీపీకి దూరమైపోయారని సోమిరెడ్డి చెప్పినపుడు చంద్రబాబు, యనమల ఏమీ మాట్లాడలేదు.
This post was last modified on May 31, 2021 6:55 am
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్…
ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం.…
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…
నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…
టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…