గత కొద్దికాలంగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న మాజీ మంత్రి , టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ విషయంలో మరో కీలక అప్డేట్ తెరమీదకు వచ్చింది. ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలకు బలం చేకూర్చేలా ఎప్పుడు పదవికి రాజీనామా చేయనున్నారు? ఎప్పుడు కాషాయ కండువా కప్పుకోనున్నారనే విషయంలో స్పష్టత వచ్చేసిందని అంటున్నారు. జూన్ 2న తన పదవికి రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్ జూన్ 6న బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
అసైన్డ్ భూముల ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ మంత్రి పదవి పోవడం, ఆయన్ను తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ చేయడం తెలిసిన సంగతే. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ తదుపరి ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోను ఆసక్తి నెలకొంది. తన సన్నిహితులతో పాటుగా నియోజకవర్గానికి చెందిన అందరి అభిప్రాయాలను తీసుకున్న ఈటల సొంత పార్టీ ఆలోచన విరమించుకొని BJPలో చేరడానికే మొగ్గు చూపుతున్నారని సమాచారం. బీజేపీలో చేరికపై ఆయన నుంచి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ మేరకు నిర్ణయం జరిగిందని అంటున్నారు.
తన పొలిటికల్ కెరీర్పై ఇక సందిగ్దత ఉంచడం సరికాదని భావించిన ఈటల రాజేందర్ బీజేపీ వైపు అడుగులు వేయడం సరైందని భావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూర్ 2న ఆయన తన పదవికి గుడ్ బై చెప్తారని అంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ 6న బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని సమాచారం.
ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…
తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్…
అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీదేవి అంటే ఎప్పటికీ చెక్కుచెదరని పేరు. అలాంటి గొప్ప నటికి…
తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు.. ఇక్కడ నివసించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద…
గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా…
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన తీర ప్రాంతం(బీచ్) ఏపీలో…